-
'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం'
ఢిల్లీ:విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కొత్త పౌర విమానయాన విధానంపై ఆయన మీడియాకు పలువిషయాలు వెల్లడించారు. ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే కొత్త పౌర విమానయాన విధానంపై ప్రజల సూచనలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు తెలిపారు.భూసేకరణ తర్వాత విజయవాడ ఎయిర్ పోర్ట్ లో రన్ వే విస్తరణ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఎయిర్ పోర్ట్ లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు. కొత్త పౌరవిమానయాన విధానంలో విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నామని, దీనివల్ల అతిచౌకగా విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. -
మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మంత్రిగా స్పెషల్ హోదాని ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించడం ఇప్పుడు వార్త అయింది. మంత్రిగా ఆయనకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఓ ప్రత్యేక వాహనంలో ఆయన్ను విమానం దగ్గరకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉంటాయి. కానీ అశోక్ గజపతి రాజు వాటిని పక్కనపెట్టి, మిగతా ప్రయాణికులలాగా బస్సులో విమానం వద్దకు రావడం, క్యూలో నిలుచోవడం చేస్తున్నారు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ లేదు. ఏ విమానయాన శాఖ మంత్రీ ఇలాచేయలేదు. మంత్రులు, ఎంపీల వల్ల విమానాలు ఆలస్యం కావడం మామూలైపోయిన ఈ రోజుల్లో విమానయాన శాఖ మంత్రి వ్యవహార శైలి ఇప్పడు ఇది హాట్ టాపిక్ అయి కూచుంది. -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
సివిల్ ఏవియేషన్లోని అసిస్టెంట్ డెరైక్టర్, డిఫెన్స్ ప్రొడక్షన్లో ప్రిన్సిపాల్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డడైజ్డ్లోని జాయింట్ డ్రగ్ కంట్రోలర్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాస్ట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) దరఖాస్తులు కోరుతోంది. ూ అసిస్టెంట్ డెరైక్టర్ విభాగాలు: రెగ్యులేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వయసు: 40 ఏళ్లకు మించకూడదు. అర్హతలు: లా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. ూ {పిన్సిపాల్ అర్హతలు: ఏదైనా మాస్టర్స్ డిగ్రీతో పాటు టీచింగ్లో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ూ జాయింట్ డగ్స్ ్రకంట్రోలర్ అర్హతలు: ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/మెడిసిన్లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 12 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. ూ అసిస్టెంట్ కాస్ట్ అకౌంట్ ఆఫీసర్ అర్హతలు: బీకామ్తో పాటు ఫైనాన్స్ బడ్జెట్, అకౌంట్స్ అండ్ ఆడిటింగ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ూ స్పెషలిస్ట్(గ్రేడ్-2) విభాగం: మెడిసిన్, పీడియాట్రిక్స్, సర్జరీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియాలజీ. అర్హతలు: సంబంధిత విభాగంలో ఎమ్డీ/డీఎన్బీ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://www.upsconline.nic.in/ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) దూర విద్యా కేంద్రం(సీడీఈ) గుంటూరు, కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీకామ్, బీహెచ్ఎం, బీఎల్ఐఎస్సీ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు పీజీ సైన్స్ కోర్సులు ఎమ్మెస్సీ(బోటనీ, జువాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజియాలజీ, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషన్, బయోఇన్ఫర్మాటిక్స్) పీజీ ఆర్ట్స్ కోర్సులు ఎంఏ(ఇంగ్లిష్, హిందీ, తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎంఎస్డబ్ల్యూ, ఎంఈడీ పీజీ కంప్యూటర్/ఐటీ కోర్సులు ఎమ్మెస్సీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) ఎంసీఏ పీజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు ఎంకామ్ ఎంహెచ్ఆర్ఎం ఎంబీఏ(హెచ్ఆర్ఎం, మార్కెటింగ్, ఫైనాన్స్, హాస్పిటల్, టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్) అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులకు డిసెంబర్ 1, మిగతా కోర్సులకు డిసెంబరు 15 వెబ్సైట్: www.anucde.info -
'అనగనగా ఓ రాజు మంత్రి అయ్యాడు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు విమానాశ్రయం ఒక్కటే ముఖ్యం కాదని కేంద్ర విమానాయాన శాఖ పదవిని దక్కించుకున్న విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి అభివృద్ధికి కేంద్ర సాయం కోసం కృషి చేయాల్సి ఉందని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన.... అనగనగా ఓ రాజు మంత్రి అయ్యాడని చమత్కరించారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. విమానయానం సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని అశోక్ గజపతి రాజు తెలిపారు. విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల ఏర్పాటుకు అధికారులతో చర్చలు జరుపుతామన్నారు. సున్నితమైన రాష్ట్ర విభజన అనే ఆపరేషన్ను యూపీఏ కఠిన పద్ధతుల్లో చేపట్టిందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడా అనేది ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్నందున టీడీపీ మహానాడుకు హాజరు కాలేకపోవటం బాధాకరంగా ఉందని గజపతిరాజు తెలిపారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.