-
మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ అధికారుల సమన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్కుమార్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. స్పందించిన హర్ష.. ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్ను లగ్జరీ వాచ్ డీలర్గా, నవీన్కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి. కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. -
రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్
చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్కు చెందిన కిల్పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
మోదీ మాత్రమే ఉంటారు.. బీజేపీ కాదు: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓ జాతీయా మీడియా ఇంటర్య్వూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఎన్నికల ఫలితాలు వెలువడగానే పీఎం అభ్యర్థిని కూటమి ప్రకటింస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీలంకను చాలా సార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 సీట్లతో పోటి చేయగా 23 స్థానాల్లో గెలుపొందింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సిట్లలో విజయం సాధించింది. సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక.. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి. -
నగదు మాత్రమే ఇవ్వండి
జేబులో డబ్బులు పెట్టుకోవడం జనం మానేశారు. ఖర్మగాలి ఫోన్ పే పని చేయకపోతే తెల్లముఖాలు వేస్తున్నారు. నగదు లావాదేవీల వల్ల ఎంత ఖర్చవుతున్నదో ఎంత మిగిలి ఉన్నదో తెలిసేది. కాని ఆన్లైన్ పేమెంట్లకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆటో నడిపే ఒక పెద్దాయన తన ఆటోలో పెట్టిన నోటీస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. నగదు అవసరాన్ని గుర్తు చేసే పోస్ట్ ఇది. ‘జీ పే చేయొద్దు. డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం దగ్గర ఆపమని అడగొద్దు’ అని చెన్నైలో ఒక ఆటోబాబాయ్ పెట్టిన బోర్డు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. గతంలో అందరి దగ్గర డబ్బులుండేవి. ఆటో ఎక్కినా దిగినా డబ్బు ఇచ్చి బేరం ముగించేవారు. ఇప్పుడు అందరూ జీపే, ఫోన్పే చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ ‘నగదు మాత్రమే’ అనే బోర్డులు ఉన్నాయి. దానికి కారణం డిజిటల్ లావాదేవీల్లో ఏదైనా మోసం జరుగుతుందేమోనని. ఈ ఆటోబాబాయ్కి కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. లేదా ఎక్కిన వారు జీపే పని చేయకపోతే ఏటీఎం దగ్గరకు వెళదామని టైమ్ వేస్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే స్పష్టంగా ‘ఏటీఎం దగ్గర ఆటో ఆపమని అడగొద్దు’ అంటూ బోర్డ్ పెట్టాడు. చెన్నైలో ఇతని ఆటో ఎక్కిన మహిళ ఈ బోర్డును ఫొటో తీసి ‘ఎక్స్’లో పెడితే ఇంటర్నెట్లో మంచి డిబేట్ నడిచింది. ‘ఇలాగైతే ఎలా’ అని కొందరంటే ‘బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ పేమెంట్ల వల్ల ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి?’ అని కొందరు ప్రశ్నించారు. చివరకు ఆటో ఎక్కిన మహిళ తన అ΄ార్ట్మెంట్ దగ్గర దిగి, సెక్యూరిటీ దగ్గర అప్పు తీసుకుని ఆటో బాబాయ్కి చెల్లించి బతుకు జీవుడా అనుకుంది. -
హాయి హాయిగా... కూల్ కూల్గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్గా ప్రయాణిస్తున్నారు. -
IPL 2024: మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్లు పూర్తవుతాయి. అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లతో కూడిన తొలి దశ షెడ్యూల్ను విడుదల చేసింది. -
తమిళిసై వర్సెస్ తమిళచ్చి.. ఆసక్తికర పరిణామం
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్ టికెట్ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంతా కాసేపు షాక్కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. S Chennai: Pic of Tamilisai and Tamizhachi extending a courtesy hug after filing nominations N Chennai: Sekar Babu and Jayakumar fighting over which party arrived at the location first to file nomination pic.twitter.com/0AHpuWhYkN — Dharani Balasubramaniam (@dharannniii) March 25, 2024 కాగా సౌత్ చెన్నైలో బీజేపీ నుంచి తమిళిసై, డీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి, అన్నాడీఎంకే నుంచి డాక్టర్ జయవర్దన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో స్థానికంగా పోరు ఆసక్తికరంగా మారింది. #WATCH | Chennai, Tamil Nadu: After filing her nomination for the Lok Sabha elections, former Telangana Governor and Puducherry Lieutenant Governor and BJP candidate Tamilisai Soundararajan says, " The people want PM Modi to be Prime Minister again. South Chennai is a… pic.twitter.com/SLmZ0sy05R — ANI (@ANI) March 25, 2024 -
IPL 2024: ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోం గ్రౌండ్లోనే ఆరంభ మరియు ఫైనల్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ సీజన్కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇక్కడ ఫైనల్ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్, లక్నో జట్లు (జైపూర్) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్) ఢీకొట్టనున్నాయి. -
IPL 2024 CSK Vs RCB : చెన్నైలో ఐపీఎల్ ఫీవర్.. ఉచిత ప్రయాణం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్కు శుక్రవారం తెరలేవనుంది. చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చైన్నె సూపర్కింగ్స్తో రాయల్చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మ్యాచ్కు అతిథ్యం ఇస్తున్న చైన్నె నగరంలో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. సాక్షి, చైన్నె: ఐపీఎల్ –17వ సీజన్కు వేళైంది. చేపాక్కం చిదంబరం స్టేడియంలో మ్యాచ్ల వీక్షణకు అభిమానులు సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచే సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి తొలి మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్ను ఢీ కొట్టేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. వివరాలు.. తమిళనాట క్రికెట్ అభిమానులకు కొదవ లేదు. జాతీయ స్థాయి పోటీలతో పాటు ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి అభిమానులు వేలాదిగా ఎగబడుతారు. ఇక చైన్నె సూపర్కింగ్స్ జట్టు తమదే అన్నట్లు అభిమానులు భావిస్తుంటారు. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్లో విడుదలైన జాబితా మేరకు చైన్నెలో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ శుక్రవారం రాత్రి నిర్వహిస్తారు. ఇందులో 16వ సీజన్ ఛాంపియన్, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో చైన్నె సూపర్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. ఈ సీజన్కు కూడా ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉంటారని భావించిన అభిమానులకు చైన్నె యాజమాన్యం గురువారం సాయంత్రం షాక్ ఇచ్చింది. సంబరాలతో తొలి మ్యాచ్ చేపాక్కం స్టేడియంలో 50 వేల మంది మ్యాచ్ను తిలకించేందుకు అవకాశం ఉంది. గత సీజన్లో టికెట్లు బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షం కావడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఈసారి టికెట్ల విక్రయాలన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించారు. ఇందులోనూ పెద్దఎత్తున గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నకిలీ వెబ్సైట్ల ద్వారా టికెట్ల విక్రయాలు సాగించినట్లు విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ పక్కనబెడితే టికెట్ల పొందిన అభిమానులు మాత్రం స్టేడియంలో సందడి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే స్టేడియంలో పరుగుల వరద కురిపించేందుకు క్రికెటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇరు జట్ల సభ్యులు చైన్నెకు చేరుకుని కఠోర సాధన చేశాయి. శుక్రవారం జరిగే మ్యాచ్ కారణంగా చేపాక్కం పరిసరాలలో ఇప్పటికే ట్రాఫిక్ మార్పులు చేశారు. అభిమానులు సాయంత్రం ఐదు గంటలలోపు స్టేడియానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ముందుగా స్టేడియంలో సంబరాలు మిన్నంటనున్నాయి. సంగీత మాంత్రీకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరితో పాటు అక్షయ కుమార్ సహా ఇతర బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ దృష్ట్యా, అభిమానుల కోసం చైన్నె ఫ్రాంచేజీ వర్గాలు ఎంటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో చేపాక్కం వైపుగా వెళ్లే అభిమాను లు మ్యాచ్ టికెట్టును చూపించి చైన్నె నగర రవాణా సంస్థ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అలాగే అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు మెట్రో, ఈఎంయూ రైళ్ల సేవలకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈనెల 26వ తేదీన జరిగే మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. అనూహ్యంగా.. ఎంఎస్ ధోనీకి బదులుగా కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ప్రకటించారు. ఇక 15వ సీజన్లో కెప్టెన్గా జడేజా కొన్ని మ్యాచ్లకు వ్యవహరించాడు. అయితే ఆ సమయంలో వరుస ఓటములు ఎదురు కావడంతో మళ్లీ కెప్టన్గా బాధ్యతలు ఎంఎస్ స్వీకరించాడు. ఈ పరిస్థితులలో తాజాగా మళ్లీ కెప్టెన్ మారడంతో.. చైన్నె సూపర్ కింగ్స్లో ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తమ అభిమాన క్రికెటర్ ధోనీ కోసం వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లి ఆడుతుండడంతో ఆయన అభిమానులు స్టేడియంలో సందడి చేయడానికి రెడీ అయ్యారు. -
చెన్నై సౌత్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న తమిళిసై
-
చెన్నై సౌత్ బరిలో తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను చెన్నై సౌత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. -
వైవిధ్యభరిత కథాంశంతో వస్తోన్న సరికొత్త థ్రిల్లర్ మూవీ..!
వైవిధ్యభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'వన్స్ అప్పాన్ ఏ టైమ్ మద్రాస్'. ఫ్రైడే ఫిలిం ఫాక్టరీ కెప్టెన్ ఆనంద్, బాలా, ట్రీమ్ హౌస్ హరున్, పీజీఎస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హైపన్ లూప్ విధానంలో రూపొందుతున్న థ్రిల్లర్ కథా చిత్రమని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో భరత్, షాన్, రాజాజీ హీరోలుగా, విరుమాండి అభిరామి, అంజలి నాయర్, పవిత్రాలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మానవ జీవితంలో సందర్భమే హీరో, విలన్ అని పేర్కొన్నారు. ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో మనిషి చేతికి వస్తుందన్న దాన్ని బట్టి.. ఆయుధాన్ని అతను మంచికి ఉపయోగిస్తాడా? లేదా చెడుకోసం వాడతాడా? అన్న దాన్ని బట్టే అతని జీవితం ఉంటుందన్నారు. అలా నలుగురి చేతికి అనూహ్యంగా ఒక తుపాకీ వస్తుందన్నారు. వేర్వేరు జీవన విధానంతో పయనించే ఆ నలుగురు వ్యక్తుల చేతుల్లో ఆ తుపాకీ ఎలా మారుతుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం కథ సాగుతుందన్నారు. చిత్ర షూటింగ్ను చైన్నె పరిసర ప్రాంతాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో కన్నిక, తలైవాసల్ విజయ్, అరుళ్ టి.శంకర్, పోర్కొడి, పీజీఎస్, కల్కి, సయద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాళిదాస్, కన్నన్ ద్వయం ఛాయాగ్రహణం, నడునల్వాడై చిత్రం ఫేమ్ జోస్ ప్రాంక్లిన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. -
చెన్నైకి వేటగాడు
హైదరాబాద్లో పని ముగించుకుని చెన్నైకు వెళ్లాడు వేటగాడు. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ కీలకపాత్రధారులు. ఇటీవల హైదరాబాద్లోప్రారంభమైన ‘వేట్టయాన్’ సినిమా షెడ్యూల్ ముగిసింది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా, రితికా సింగ్ ఈ షెడ్యూల్లో పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలిసింది. ఓ యాక్షన్ సీక్వెన్స్, ఓపాటను కూడా చిత్రీకరించారని సమాచారం. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుంది. -
‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్ఏ’
చెన్నై: మహిళలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే పార్టీ వక్రీకరిస్తోందని బీజేపీ నేత కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.1000 భిక్ష ఇస్తే.. వారికి ఓటు వేస్తారా?. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే.. ప్రజలు ఇలా ప్రభుత్వం ఇచ్చే రూ.1000 భిక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె సోమవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అన్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను కించపరిచేలా ఉన్నాయని డీఎంపీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించిందని కుష్బూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘మహిళలకు రూ. 1000 ఇచ్చే బదులు ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలి.అలా చేయటం వల్ల మహిళలకు వేల రూపాయలు పొదుపు చేసినట్లు అవుతుంది.వారి కుటుంబాలకు సాయం చేసినట్లు అవుతుంది. వాళ్లు సంతోషంగా తల ఎత్తుకొని జీవిస్తారు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు నా మాటలను తప్పుదోవ పట్టించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం డీఎంకే డీఎన్ఏ.. కానీ నాది కాదు’ అని కుష్బూ సుందర్ వివరణ ఇచ్చారు. ‘నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసి పారిపోయే వ్యక్తిని కాదు. ధైర్యంగా మాట్లాడటం నేర్పిన వ్యక్తి కలైంజ్ఞర్ కరుణానిధి. మీరు( డీఎంకే) దానిని మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చి పోలేదు’ అని కుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన కుష్బూను వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
పెట్రోల్ ట్యాంకు మీద కిట్ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి!
R Ashwin's Emotional Tribute On 100th Test: ‘‘క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్కు ఉన్న ఆదరణ వేరు. అందుకే చాలా మంది టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్లోకి రావాలని భావిస్తారు. వాళ్ల కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే, ఒక్క విషయం మాత్రం ఆశావహ క్రికెటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. టెస్టు ఫార్మాట్ అనేది జీవితం నేర్పలేని పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే మంత్రం. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలన్న విషయాలను బోధిస్తుంది. నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చిన్నతనంలో.. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను కూడా ముందు కూర్చోబెట్టుకుని.. కోచింగ్ క్యాంపునకు తీసుకువెళ్లేవాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన.. తన కుమారుడు జీవితంలో.. కెరీర్లో ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్నారు. మా అమ్మ, మా తాతయ్య సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది ఇక నా భార్య.. నన్ను పెళ్లి చేసుకునే సమయంలో నా ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా.. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది. నాకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా నా క్రికెట్ జర్నీని అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలుగుతున్నారు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్ తరఫున 100వ టెస్టు బరిలో దిగిన తరుణంలో.. తాను క్రికెటర్గా ఎదగడంలో తన తండ్రి రవిచంద్రన్ పాత్ర.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడంలో తన భార్య ప్రీతి అండదండగా నిలిచిన తీరును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఖరిదైన టెస్టు గురువారం మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇక ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా చెన్నై ఆల్రౌండర్ అశూ చరిత్రకెక్కాడు. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! Number 9⃣9⃣ gets ready for his 💯th Test Match! 👏👏 📽️ WATCH 🔽 - Life, Cricket & Beyond ft. @ashwinravi99#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 7, 2024 -
అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్కు థాంక్స్: అశూ భార్య
‘‘రాజ్కోట్ టెస్టు జరుగుతున్న సమయంలో పిల్లలు స్కూలు నుంచి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత.. తను 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. వెనువెంటనే మమ్మల్ని అభినందిస్తూ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇంతలో మా అత్తయ్య పెద్దగా కేక పెట్టి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అశ్విన్కు ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చెన్నై- రాజ్కోట్ మధ్య విమాన రాకపోకలు అంత ఎక్కువగా లేవని తెలుసు. అందుకే నేను ఛతేశ్వర్ పుజారాకు ఫోన్ చేసి అతడి కుటుంబ సభ్యుల సహాయం కోరాను. ఆ తర్వాత అశ్విన్కు ఫోన్ చేశాను. ఎందుకంటే ఆంటీని పరీక్షించిన తర్వాత.. ‘ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది’ అని డాక్టర్ చెప్పారు. అదే విషయం అశ్విన్తో చెప్పగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత 20 -25 నిమిషాలకు గానీ మళ్లీ మాట్లాడలేకపోయాడు. రోహిత్ శర్మ, రాహుల్(ద్రవిడ్) భాయ్, బీసీసీఐలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అశ్విన్ చెన్నైకి చేరేంతవరకు క్షేమసమాచారాలు అడుగుతూ మాకు అండగా నిలబడ్డారు. ఆరోజు అశ్విన్ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనైంది. అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడన్న సంతోష సమయంలోనే అత్తగారు అనారోగ్యం పాలవడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొంది. కష్టకాలంలో ఛతేశ్వర్ పుజారా కుటుంబం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తమకు అండగా నిలిచారని ప్రీతి కృతజ్ఞతాభావం చాటుకుంది. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మధ్యలోనే అశ్విన్ జట్టును వీడిన విషయం తెలిసిందే. 500 వికెట్ల క్లబ్లో చేరిన తర్వాత తల్లి అనారోగ్యం పాలైన నేపథ్యంలో సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాడు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ జట్టుతో చేరాడు. ఇక ప్రస్తుతం ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుతో అశ్విన్ మళ్లీ బిజీ కానున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అశూకు ఇది వందో టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి.. ఈ సిరీస్ సమయంలో తమ కుటుంబం మానసిక వేదనకు గురైన తీరును వివరిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాలమ్లో తన మనసులోని భావాలు పంచుకుంది. చదవండి: Rohit Sharma: సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ ఉదయం 5.30 గంటలకే ఇలా.. -
కార్యకర్త చేసిన పనికి ప్రధాని మోదీ ఎమోషనల్
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురింపించారు. చెన్నై ఎయిర్పోర్టులో మోదీకి ఓ బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య ఇద్దరు కవల పిల్లలు జన్మనించిందని అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చినట్లు స్వయంగా మోదీకే తెలియజేయటం విశేషం. అటువంటి అంకితభావం ఉన్న కార్యకర్త చేసిన పనికి తాను ఎమోషనల్ అయినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. மிகவும் சிறப்பு வாய்ந்த சந்திப்பு! சென்னை விமான நிலையத்தில், நமது கட்சி நிர்வாகிகளில் ஒருவரான திரு அஸ்வந்த் பிஜய் அவர்கள் என்னை வரவேற்க காத்திருந்தார். சற்றுமுன் தான், அவரது மனைவி இரட்டைக் குழந்தைகளைப் பெற்றெடுத்துள்ளார் என்றும், ஆனால் அவர் இன்னும் அவர்களை சந்திக்கவில்லை… pic.twitter.com/bufqjbe9wo — Narendra Modi (@narendramodi) March 4, 2024 ‘చైన్నై ఎయిర్పోర్టులో నాకు స్వాగతం పలకడానికి వచ్చిన బీజేపీ కార్యకర్త అశ్వంత్ పిజై చాలా ప్రత్యేకంగా అనిపించారు. అతను తన భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచిందని చెప్పారు. అయినా వారిని ఇంకా కలవలేదన్నారు. వారిని కలవకుండా నాకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చానని తెలిపారు. నేను ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు తెలియజేశాను’ అని సదరు కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. ‘అభిమానం, అంకితభావంతో కూడిన అశ్వంత్ పిజై వంటి బీజేపీ కార్యకర్తను చూడటం చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు చూపించే ప్రేమ, అనురాగం నన్ను భావోద్వేగానికి గురిచేశాయి’ అని ప్రధాని మోదీ అన్నారు. చదవండి: కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు నిజమే! -
స్టాలిన్ బర్త్డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్కు చైనా స్టిక్కర్ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్గా కొనసాగుతున్నారు. -
తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు..
చెన్నై: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడువ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తమిళనాడులో కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు శనివారం తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, కోయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. #JustIn | NIA Raids Across Tamil Nadu's Tiruchirappalli — NDTV (@ndtv) February 10, 2024 ఇక, ముఖ్యంగా కోయంబత్తూరులోనే నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టారు. 2021లో కోయంబత్తూరులోని ఉక్కడం కొట్టమేడు ప్రాంతంలో కారు బాంబు పేలుడుతో సంబంధాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్టు సమాచారం. -
విశాఖ -చెన్నై కారిడార్ పై అవాస్తవాలతో ఈనాడు కథనం
-
ప్రధానికి టాలీవుడ్ స్టార్ హీరో రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు, అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందిచారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. https://t.co/w9Kk48BQVJ — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 20, 2024