-
పొగ మంచు ఎఫెక్ట్: చెన్నై వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్కు మళ్లింపు
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో ఆదివారం ఉదయం తీవ్రమైన స్థాయిలో పొగమంచు చుట్టు ముట్టింది. దీంతో చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలని తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచుతో చెన్నై ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. This looks like some crazy fog+smoke (Bhogi Effect). Visibility is very poor across Chennai..👀 pic.twitter.com/bRka4t21b3 — Chennai Updates (@UpdatesChennai) January 14, 2024 ఈ క్రమంలో ప్రతికులమైన వాతావరణం కారణంగా చెన్నై, ఢిల్లీకి సంబంధించిన పలు విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. విమాన ప్రయాణికులు ఎప్పటికప్పుడు ముందుగానే విమాన వివరాలు తెలుకోవాలని సూచించింది. #WATCH | Tamil Nadu: A layer of smog engulfs several parts of Chennai. (Drone visuals from Rajiv Gandhi Road, shot at 6:40 am) pic.twitter.com/BEdSPwhsrH — ANI (@ANI) January 14, 2024 అయితే ఈ రోజు(ఆదివారం) చెన్నైలో పెద్ద ఎత్తున పొగమంచు ఏర్పడటానికి భోగి పండగ సందర్భంగా ప్రజలు వేసే మంటటు కారణమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. VIDEO | Flight services affected at Chennai Airport due to dense fog in the region. pic.twitter.com/TvQBjxn66l — Press Trust of India (@PTI_News) January 14, 2024 -
2016లో గల్లంతు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ
ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది. 2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే.. ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్బ్లెయిర్కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు. అయితే పోర్ట్ బ్లెయిర్లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు. విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్. -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
మహిళా భద్రతలో టాప్.... చెన్నై!
అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది. ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం. ఈ సర్వేని సిటీ ఇన్క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్ఫోర్స్లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
తమిళనాడు డీజీపీ ఆఫీస్కు ‘బాంబు’ బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు. 400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు. -
Chennai: మహిళా టెక్కీ హత్యకు కారణం ఇదే !
చెన్నై: సంచలనం రేపిన చెన్నై టెక్కీ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. టెక్కీ నందిని(26) వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న అసూయతోనే ఆమె స్నేహితుడు వెట్రిమారన్ ఈ దారుణ హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నందిని, నిందితుడు వెట్రిమారన్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదివారు. చదువు అనంతరం ఇద్దరూ చెన్నై వచ్చి ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అయితే నిందితుని పాత పేరు మహేశ్వరి. కేవలం నందినిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని నెలల క్రితం అతడు లింగ మార్పిడీ సర్జరీ చేయించుకుని వెట్రిమారన్గా మారాడు. ఇద్దరూ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో నందిని కొంతకాలంగా వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని, ఈ విషయంలో తాను తట్టుకోలేకే ఆమెను హత్య చేసినట్లు వెట్రిమారన్ పోలీసులకు చెప్పాడు. నందినిని హతమార్చాలనే ఉద్దేశంతోనే ఈ నెల 23న రాత్రి బర్త్ డే గిఫ్ట్ ఇస్తానని పిలిచి చైన్తో గొంతు నులిమి, బ్లేడ్తో కోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందిని మరణించింది. ఈ కేసులో పోలీసులు వెట్రిమారన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదీ చదవండి: టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా? -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్లైన్లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్షాప్ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్షాప్కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్లోని పిల్లల కోసం షెల్ఫ్ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
కొత్త క్వీన్ వైశాలి: తోబుట్టువుతో పోటీపడి.. తమ్ముడి నీడను దాటి
‘మీ తమ్ముడు నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ గ్రాండ్మాస్టరై నాలుగేళ్లు దాటిపోయింది. మరి మీరెప్పుడు గ్రాండ్మాస్టర్ అవుతారు?’ ఏడాది కాలంగా ఎక్కడికి వెళ్లినా వైశాలిని వెంటాడుతున్న ప్రశ్న అది. ఒక్కోసారి తోబుట్టువు ఘనత కూడా తెలీకుండానే అనవసరపు అసహనాన్ని కలిగిస్తుంది. నిజానికి క్రీడల్లో ఒకరి ప్రదర్శనకు మరొకరి ఆటతో పోలికే ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వైశాలికి మాత్రం ఇంట్లోనే పోటీ ఉండటంతో పోలిక సహజమైంది. దాంతో ఆమెపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. కానీ చదరంగంలో ఒత్తిడిని అధిగమించడమే అన్నింటికంటే పెద్ద సవాల్ కదా! వైశాలి కూడా అలాగే ఆలోచించింది. జీఎం కావడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో వరుసగా ఒక్కో గేమ్లో, ఆపై ఒక్కో టోర్నీలో గెలుపుపై మాత్రమే దృష్టి పెట్టి దూసుకుపోయింది. క్యాండిడేట్స్లాంటి మెగా టోర్నీకి కూడా అర్హత సాధించింది. అక్కడా ఆమె తన ప్రశాంతతను కొనసాగించింది. ఫలితంగా విజయాలు వైశాలిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల వయసులో చెస్ గ్రాండ్మాస్టర్ల జాబితాలో తన పేరును రాసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చెస్లో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి చిచ్చరపిడుగు అయిన తమ్ముడి నీడను దాటి ఇప్పుడు సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. మున్ముందు ఆమె సాధించబోయే ఘనతల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై మరిన్ని సంచలనాలు ఈ చెన్నై అమ్మాయి నుంచి రావడం ఖాయం. ఎప్పుడో 2002.. భారత్ నుంచి చెస్ గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి మహిళగా కోనేరు హంపి గుర్తింపు.. ఆపై మరో 9 ఏళ్లు.. 2011లో రెండో భారత మహిళా గ్రాండ్మాస్టర్గా నిలిచిన ద్రోణవల్లి హారిక.. ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల తర్వాత భారత చెస్లో మహిళలకు సంబంధించి ఒక తరహా శూన్యం ఆవరించింది. ఒక వైపు పురుషుల విభాగంలో ఆటగాళ్లు దూసుకుపోతుండగా, మహిళల వైపు నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనే రాలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా అవి తాత్కాలికమే. పైగా దిగువ స్థాయికే పరిమితమయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా విమెన్ గ్రాండ్మాస్టర్ స్థాయికి మించి కొందరు ముందుకు సాగలేకపోయారు. అలాంటి స్థితిలో వైశాలి ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే. అక్కడే మొదలు.. 2013లో వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్తో తలపడేందుకు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చెన్నైకి వచ్చాడు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అసలు ఆటకు ముందు 20 మంది జూనియర్ ప్లేయర్లతో ఒకేసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కార్ల్సన్ సిద్ధమయ్యాడు. ఈ పోరులో 12 ఏళ్ల వైశాలి మాత్రమే కార్ల్సన్ను ఓడించడంలో సఫలమైంది. ఆ ఫలితం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా కార్ల్సన్పై గెలుపు అంటే ఆషామాషీ కాదు. అప్పుడు వైశాలి అందరి దృష్టిలో పడింది. ఆరేళ్ల వయసులో చాలా ఎక్కువ సమయం టీవీ చూడటంలోనే గడుపుతున్న కూతురు దృష్టి మళ్లించేందుకు తండ్రి రమేశ్బాబు చెస్ నేర్పించాడు. తర్వాతి రోజుల్లో అదే ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. స్థానికంగా పోటీ పడిన తొలి ఈవెంట్లోనే వైశాలి గెలిచి రావడంతో ఆమె పూర్తి స్థాయిలో ఆట వైపు మళ్లింది. తండ్రితో పాటు తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహం, సహకారం కూడా ఆమె వేగంగా దూసుకుపోవడంలో ఉపకరించాయి. చెన్నైలోని వేలమ్మ స్కూల్, ఆ తర్వాత కాలేజ్లో.. వైష్ణవ్ ఇన్స్టిట్యూట్ కూడా వైశాలి చదరంగ ప్రదర్శనను గుర్తించి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన తండ్రి పోలియో కారణంగా ఎక్కడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయినా ఇతరత్రా ఒక తండ్రిగా కూతురికి అండగా నిలవడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన అక్కను ఆడనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టిన తమ్ముడు ప్రజ్ఞానంద.. తర్వాత రోజుల్లో సాధనలో ఆమెకు భాగస్వామిగా మారడమే కాదు గ్రాండ్మాస్టర్గా ఎదిగి అక్క గేమ్లను విశ్లేషించి తప్పొప్పులతో ఆమె ఆటకు సహాయకారిగా వ్యవహరించడం విశేషమే! తొలిసారి గుర్తింపుతో.. 2012.. వైశాలి చెస్ కెరీర్ను మలుపు తిప్పింది. స్లొవేనియాలో అండర్–12 బాలికల వరల్డ్ చెస్ చాంపియన్షిప్ జరిగింది. 11 ఏళ్ల వైశాలి యూరోప్లో పర్యటించడం అదే తొలిసారి. టైమ్ జోన్ భిన్నంగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కి గేమ్లు ప్రారంభం అయ్యేవి. దాంతో ఒక్కసారిగా అలవాటు తప్పిన సాధనతో పాటు ఇతరత్రా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇలాంటివాటిని అధిగమించి∙ఆమె చాంపియన్గా నిలవడం అద్భుతం! మూడేళ్ల తర్వాత గ్రీస్లో ఇదే తరహాలో వరల్డ్ అండర్–14 చాంపియన్షిప్ జరిగింది. ఈసారి మాత్రం ఆమె పూర్తి సన్నద్ధతతో వెళ్లింది. టాప్సీడ్గా బరిలోకి దిగిన ఆమె దానికి న్యాయం చేస్తూ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ అండర్–10 విభాగంలో తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. దాంతో రమేశ్బాబు కుటుంబంలో ఆనందం రెట్టింపయింది. ఒలింపియాడ్లో సభ్యురాలిగా.. కోవిడ్ సమయం ప్రపంచవ్యాప్త క్రీడా ఈవెంట్లపై కూడా ప్రభావం చూపించింది. అయితే ఆన్లైన్ గేమ్ల తర్వాత చెస్ ఆటగాళ్లు కొంత వరకు తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు. ఈ క్రమంలో వైశాలి ఆన్లైన్లో విమెన్స్ స్పీడ్ చాంపియన్షిప్లో పాల్గొని సత్తా చాటింది. తుది ఫలితం అనుకూలంగా రాకపోయినా రెండు సంచలన విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. తనకంటే ఎంతో ఎక్కువ రేటింగ్ ఉన్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణులు అసబయెయెవా, ద్రోణవల్లి హారికలను వైశాలి ఓడించగలిగింది. ప్రపంచ చెస్లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఒలింపియాడ్ ఆమె కెరీర్లో మరో చెప్పుకోదగ్గ ఘనతగా నిలిచింది. ఇందులో విజేతైన భారత జట్టులో వైశాలి కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి సోదర, సోదరి ద్వయంగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధించినా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకోవడమే వైశాలికి కీలకంగా మారింది. భారత చెస్ చరిత్రలోని 83 మంది గ్రాండ్మాస్టర్లలో ఇద్దరు మాత్రమే మహిళలు. అయితే వైశాలి శ్రమ, పోరాడేతత్వం, ఓటమిని అంగీకరించని నైజం ఆమెను కొత్త జీఎంగా నిలిపాయి. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పట్టుదలతో సాగి ఈ చెన్నై అమ్మాయి.. తన లక్ష్యాన్ని చేరింది. 2019లో ఎక్స్ట్రాకాన్ ఓపెన్లో ఆమె తొలి జీఎం నార్మ్ సాధించింది. పది మంది ప్రత్యర్థులతో తలపడగా వారిలో ఆరుగురు గ్రాండ్మాస్టర్లు. రెండో జీఎం సాధించేందుకు ఆమెకు కొంత సమయం పట్టింది. హెరాక్లియోన్లో జరిగిన ఫిషర్ ఓపెన్లో ఆమె రెండో నార్మ్ సొంతం చేసుకుంది. ఇదే జోరులో మూడో నార్మ్ వేట సాగింది. ఏడాదిన్నర లోపే ఖతర్ ఓపెన్లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి ఎనిమిది గేమ్లలోనూ నార్మ్ సాధించడంతో ఇక జీఎం లాంఛనమే అయింది. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు మారియా ముజీచుక్, స్టెఫనోవా, జోంగి తాన్లను ఓడించడంతో పాటు 2600 రేటింగ్ దాటడంతో ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో వైశాలి జీఎం ఖాయమైంది. ప్రపంచ చెస్లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వైశాలి, ప్రజ్ఞానంద నిలిచారు. ఇకపై కూడా తమ్ముడి నీడలో కాకుండా తన ఆటతో, ఎత్తుకు పైఎత్తులతో చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వైశాలి ధ్యేయంగా పెట్టుకుంది. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
తమిళనాడులో దారుణం.. ఐటీ ఉద్యోగిని హత్యలో డబుల్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. చెన్నై శివారులోని తాలంబూర్లో దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని(25)ని ప్రియుడు వెట్రిమారన్(26) కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్ మొదట నందినిని బ్లేడ్తో తీవ్రంగా గాయపరిచి, అనంతరం ఆమెను గొలుసులతో బంధించి, చివరగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్న డెడ్బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. నందిని, వెట్రిమారన్ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. కాగా, నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్ ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు. అయితే, ఈ హత్యలో ఓ ట్రాన్స్జెండర్ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ, మరో ట్విస్ట్ ఏంటంటే.. వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి.. వెట్రిమారన్గా అబ్బాయిగా పేరు మార్చుకున్నాడు. దీంతో, కొద్దిరోజులుగా వెట్రిమారన్ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్టు సమాచారం. Deceased woman Nandhini and accused Pandi Maheshwari alias Vetrimaran. pic.twitter.com/fSaJBPoRWV — A Selvaraj (@Crime_Selvaraj) December 24, 2023 -
బ్లూ సీ డ్రాగన్! అందంగా ఉందని టచ్ చేస్తే అంతే!
బ్లూసీ డ్రాగన్లు(గ్లాకస్ అట్లాంకస్) ఒక రకమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్లోని బీచ్ తీరానికి సమీపంలో కనిపించాయి. ఇవి చూడటానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తునంది. కానీ టచ్ చేశారో ఇక అంతే. చెన్నైని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను బీభత్సానికి బీచ్కి కొట్టుకొచ్చి ఉండవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువుగా సముద్రం ఉపరితలంపైనే సంచరిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవని. ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా మారుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్కుమార్ ఈ జీవులను బీచ్లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జి సమీపంలో ఈ బ్లూసీ డ్రాగన్ సముహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరూ వీటి కారణంగా బాధతో విలవిల లాడి ఉన్నారని, మరికొందరు ఇసుకలో చనిపోయిన ఉండటాన్నికూడా చూసినట్లు వెల్లడించారు వత్సన్. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుపాను సమయాల్లోనే ఒడ్డుకు నెట్టబడటంతో కనిపించడం జరుగుతుందని శాస్త్రవేత్త కిజాకుడన్ అన్నారు. ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవని, బీచ్ల వద్దకు వచ్చేవాళ్లకు ఇవి ప్రమాదం కలిగిస్తాయని అన్నారు. అంతేగాదు బీచ్ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరించారు కూడా. ఈ బ్లూ సీ డ్రాగన్(నీలిరంగు డ్రాగన్)ని పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ (ఫిసాలియా ఫిసాలిస్), మ్యాన్-ఆఫ్-వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ' వార్ లేదా బ్లూబాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజాకుడన్ వెల్లడించారు. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారత నగరాలు ఇవే!) -
Chennai Grandmaster Tourney: ఛాంపియన్ గుకేశ్
చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. చెన్నై వేదికగా ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్కు టైటిల్ లభించింది. అర్జున్ రన్నరప్గా నిలిచాడు. హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 4 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన ఏడో రౌండ్లో గుకేశ్–హరికృష్ణ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... అర్జున్ 57 ఎత్తుల్లో సనన్ జుగిరోవ్ (హంగేరి)పై గెలుపొందాడు. టాప్–3లో నిలిచిన గుకేశ్కు 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల 98 వేలు), అర్జున్కు 12 వేల డాలర్లు (రూ. 9 లక్షల 98 వేలు), హరికృష్ణకు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 32 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
చెన్నైలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుశిక్షను విధించింది. రూ.50 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పొన్ముడి ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ 2002లో కేసు నమోదు చేసింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996-2001 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేసు నమోదైంది. అప్పట్లోనే పొన్ముడి ఆయన భార్య ఆదాయం రూ. 1.4 కోట్లుగా ఉంది. ఆర్థిక వనరులకు మించి వారి వద్ద డబ్బు ఉందని తెలింది. 1996-2001 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని అధికారులు ఆరోపించారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటించింది. పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా విడుదల చేసిన తీర్పును ఆగస్టులో మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అయితే.. కేసు చాలా పాతదని, ప్రస్తుతం పొన్ముడికి 73 ఏళ్లు కాగా, ఆయన భార్యకు 60 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా కనీస శిక్ష తగ్గించాలని దంపతులు కోరారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
Tamil Nadu Weather Updates: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం
చెన్నై: తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. 12-14 గంటల వ్యవధిలో ఎడతెగని వర్షం కురిసింది. మణిముత్తర్, తిరుచెందూర్లలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం సంభవించింది. 500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడులో ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో వర్షపాతం రావడం ఇదే ప్రథమం. Kanniyakumari Flood #TamilNadu #tamilnadurain @Savukkumedia @SavukkuOfficial pic.twitter.com/JgEwbobeba — Abdul Muthaleef (@MuthaleefAbdul) December 17, 2023 దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Fire engine itself got stuck near V.O.C port ,Thoothukudi#TNRains #Tirunelveli #TamilNadu pic.twitter.com/Sc4PbSgQ4I — West Coast Weatherman (@RainTracker) December 18, 2023 ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు. Historic Deluge: #Kayalpattinam in #Thoothukudi Receives Record-Breaking 932mm of Rain in 24hrs Visuals of Thoothukudi bypass road in TN as district recorded Exceptionally heavy Rainfall #HeavyRain #TamilNaduWeather #TamilnaduRain #ThoothukudiRains pic.twitter.com/nASBMG0Y2D — sudhakar (@naidusudhakar) December 18, 2023 Dear Chennai MEDIA. Tamilnadu is not limited upto Chennai border!🤦🏾♂️🤦🏾♂️#Nellai_Rain@polimernews@PTTVOnlineNews @sunnewstamil@news7tamil@NewsTamilTV24x7pic.twitter.com/6JNCBwPfuG — Tirunelveli (@Porunaicity) December 17, 2023 ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్
మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్సైకిల్ ముందుకు వచ్చింది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్సైకిల్ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్వర్క్లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్లతో సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్లను ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు తెలిపింది. మిచాంగ్ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు! -
చెన్నైని వదలని వర్షాలు..మళ్లీ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోని చెన్నై నగరానికి వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నగరంలో స్కూళ్లు,కాలేజీలు శుక్రవారం కూడా మూసివేయనున్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. మిచౌంగ్ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైలోనూ తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదీచదవండి..సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
చెన్నై వరద సాయానికి మోదీ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మిచౌంగ్ తుపాను కారణంగా చోటు చేసుకున్న భారీ వర్షంతో వరదలు చెన్నై సిటీని అతలాకుతలం చేశాయి. అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై బెసిన్ ప్రాజెక్టులో భాగంగా ‘ఇంటిగ్రేటెట్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్’ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వరద సహాయ కార్యకలపాలకు అవసరమగు రూ.561.29 కోట్ల నిధులకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. Chennai is facing major floods, the third such occurring in the last eight years. We are witnessing more instances of metropolitan cities receiving excessive rainfall, leading to sudden flooding. Guided by a pro-active approach, PM @narendramodi Ji has approved the first urban… — Amit Shah (@AmitShah) December 7, 2023 చెన్నై నగరం తరచుగా భారీ వరదలకు గురవుతోంది. గత ఎనిమిదేళ్లలో మూడు భారీ వరదలతో మూడు సార్లు నీట మునిగింది చెన్నై. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF)కింద ప్రధాని మోదీ మొదటిసారి చెన్నై నగరానికి వరద సాయం నిధులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం వరదల సాయంగా రూ.500 కోట్లను కలుపుకొని మొత్తం రూ. 561.29కోట్ల నిధులకు ప్రధాని ఆమోదం తెలిపారు. చెన్నై వరదలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. రాజ్నాథ్ సింగ్ వరదలపై ఏరియల్ సర్వే తర్వాత మొదటి విడత వరద సాయంగా రూ. 450 కోట్లు విడుదల చేశారు. మిగతా సాయం రెండో విడతగా విడుదల కానునుంది. RSS on ground helping people in Chennai floods And muslims, liberals,seculars Congress claim they are terr0rists. pic.twitter.com/eMKnvFeVLq — ThtKashmiriGuy (@ThtKashmiriGuy) December 7, 2023 ఇంకా.. వరదల్లో చిక్కుకున్న చెన్నై ప్రజలు తీవ్రమైన ఇబ్బందలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారు, వరద కారణగా నిరాశ్రయులేన వారికి ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు. On behalf of @BJP4TamilNadu, we extended a warm welcome to our Hon Defence Minister Thiru @rajnathsingh avl on his visit to Chennai to assess the floods & the damage caused by the #Michaungcyclone.@Murugan_MoS pic.twitter.com/XhRtoP6y6U — K.Annamalai (@annamalai_k) December 7, 2023 ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్ను సీఎం ఎంకే స్టాలిన్ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. Today our @Karthi_Offl Anna Welfare team provided food to the Semmenchery people who are affected by the cyclone and floods ♥️👏👏pic.twitter.com/JoPPyLDBfR — Karthi Fans Club ™ (@Karthi_AIFC) December 7, 2023 Thank You Chennai.. Flood எங்களுக்கு Christmas Gift.. #WhatNonsense_is_this_DMK#பதில்சொல்லுங்க_ஸ்டாலின் ?@mkstalin @AIADMKITWINGOFL @satyenaiadmk pic.twitter.com/mTDKv65ZVe — வெண்ணிலா அஇஅதிமுக (@Vennila_AIADMK) December 6, 2023 Photo of the day .Thanks To Each and Everyone who are in the Rescue works in the Flood Affected Areas. 🙏#ChennaiFlood #ChennaiFloods pic.twitter.com/zOjFU2R90w — MasRainman (@MasRainman) December 7, 2023 Vijay Makkal Iyakkam Helping People - Chennai Floods #Leopic.twitter.com/VUpki7z1jf — MAHI 𝕏 (@MahilMass) December 6, 2023 -
ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్
మిచౌంగ్ తుపాను ధాటికి తమిళనాడు ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. రెండు రోజులు విరుచుపడుతున్న మిచౌంగ్ తుపాను ఇవాళ ఉగ్రరూపం దాల్చింది. చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఐదుగురు మరణించగా.. చాలామంది ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. దీంతో వరదలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్టార్ హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై మేయర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన శ్రీమతి ప్రియా రాజన్ (చెన్నై మేయర్), కమిషనర్తో సహా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లోని ఇతర అధికారులు సురక్షితంగా మీ కుటుంబాలతో బాగా ఉన్నారని ఆశిస్తున్నా. ఎందుకంటే వరద నీరు, డ్రైనేజీ మీ ఇళ్లలోకి ప్రవేశించదు. మరీ ముఖ్యంగా మీకు ఆహారం, విద్యుత్ సరఫరా ఉంటుందని ఆశిస్తున్నా. మీరు ఉన్న ఇదే నగరంలో నివసిస్తున్న పౌరులుగా మీలా సురక్షితమైన స్థితిలో లేరు. డ్రైనేజీ కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా? లేదా చెన్నై కోసమా?' అంటూ నిలదీశారు. అంతే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 2015లో మేమే రోడ్లపైకి వచ్చాం. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియజేయగలరని కోరుతున్నా. మేం ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆహారం, నీరు అందిస్తూనే ఉంటాం. కానీ ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులందరూ బయటకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. అద్భుతం కోసం ఎదురుచూడకుండా సాధారణ పౌరులే డ్యూటీ చేయాలి. గాడ్ బ్లెస్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. విశాల్ ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 -
మిచౌంగ్ ఎఫెక్ట్.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరోలు!
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. 'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. -
సిగ్నల్ లేదు.. సాయం కోసం హీరో ఎదురుచూపులు!
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన సహాయ చర్యలు చేపడుతున్నారు. చెన్నై నగరం నీటి ముంపునకు గురై జనజీవనం స్తంభించింది. అయితే తుపాన్ దెబ్బకు చెన్నైతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!) తాను వరదల్లో చిక్కుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కారప్పాకంలోని తమ ఇంట్లోకి నీరు చేరిందని.. సాయం కోసం వేచి కాల్ చేశానని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో పోస్ట్ చేశానన్నారు. నాతో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. విష్ణు విశాల్ ప్రస్తుతం రజినీకాంత్ లాల్ సలాం, ధనుశ్ డీ50 చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సలార్తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత) Water is entering my house and the level is rising badly in karapakkam I have called for help No electricity no wifi No phone signal Nothing Only on terrace at a particular point i get some signal Lets hope i and so many here get some help❤️ I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 -
నీట మునిగిన ఎయిర్ పోర్ట్..
-
చెన్నైలో జలప్రళయం
సాక్షి, చెన్నై: ఎక్కడ చూసినా నీరే. అంతటా వరద ప్రవాహమే. తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుపానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కొనసాగింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మంగళవారం ఉదయం దాకా మూసేస్తున్నట్టు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వండలూరు జూలోకి వరదనీరు పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో మొసళ్లు తప్పించుకున్నాయి. దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది! అక్కడ టాన్స్ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం కూడా వర్షాలు కొనసాగుతాయన్న హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నగరాన్ని చుట్టుముడుతున్న వరదను తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాలకు చెన్నైలో ఐదుగురు మృతి చెందారు. వందలాది రైళ్లు రద్దయ్యాయి. 47 ఏళ్లలో అతి భారీ వర్షం తాజా వర్ష బీభత్సం చెన్నై నగరంలో గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015 నాటి కుంభవృష్టిని కూడా మించిపోయింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చూసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలో రూ.4 వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవడంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది. మంగళవారం నాటికి 10 సెం.మీ. వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
Vedio: మిచౌంగ్ ధాటికి కుంగిన రోడ్లు
చెన్నై: తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. దక్షిణ చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఓ రహదారి కృంగిపోయింది. ఆ గుంటలోనే విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ దృశ్యాలు చూపరులను భయభ్రాంతులకు గురిచేశాయి. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించేది. Hang tight for another day everyone🙏 Even if the rain stops, recovery is going to take a while. #ChennaiRains2023 #Michaung pic.twitter.com/QsnkuxuXx3 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 4, 2023 చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం