-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
మహానంది: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున 1.20 గంటల ప్రాంతంలో మూడోసారి గోశాల ప్రాంగణంలో సంచరించింది. ఉదయం విధులకు హాజరైన ఏఈవో ఓంకారం వేంకటేశ్వరుడు సీసీ కెమెరాలు పరిశీలించగా గోశాల ముందు నుంచి కృష్ణనంది మార్గం వైపు చిరుతపులి వెళ్లిన దృశ్యం కనిపించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఆర్వో హైమావతి, ఎఫ్బీవో ప్రతాప్లకు సమాచారం ఇచ్చారు. చిరుత భయంతో వణికిపోతున్న స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను బంధించాలని కోరుతున్నారు. -
మహానందిలో మరోసారి చిరుత కలకలం
మహానంది: మహానంది గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దినేష్కుమార్రెడ్డి, డీఆర్ఓ హైమావతి, ఎఫ్బీఓ ప్రతాప్లకు సమాచారం అందించారు. వారు మహానంది గోశాల వద్దకు చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రదేశం, పాదముద్రలను గుర్తించారు. ఇదిలా ఉండగా.. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులోని శిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మంగళవారం ఓ మహిళ మృతి చెందిన విషయాన్ని మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఘటనతో పచ్చర్ల వద్ద నల్లమలలో అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం బోను, పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే అటుగా సంచరించే చిరుతపులి అంతటా తిరుగుతుందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ మహానంది, పచ్చర్ల ప్రాంతాల్లో చిరుతలు సంచరించగా.. ఈ గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఇప్పటికీ గోప్యత పాటిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశంలో చిక్కిన చిరుత ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఘటన గిద్దలూరు రూరల్: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుతపులి స్థానికులకు కంటబడడంతో భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు చిరుతపులిని బంధించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుతపులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంటపడింది. దీంతో వారు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది.దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ డైరెక్టర్ వై.వి.నరసింహారావు, రేంజి ఆఫీసర్ కుమార్రాజ రెస్క్యూ టీమ్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని బావి చుట్టూ వలచుట్టి చిరుతను బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
నంద్యాలలో ‘చిరుత’ టెన్షన్
మహానంది: చిరుత పేరు వినిపిస్తే చాలు నల్లమల అటవీ పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో ఏదైనా అరుపులు వినిపిస్తే చాలు తెల్లవార్లు జాగారమే చేయాల్సి వస్తుంది. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అనంతరం గిద్దలూరు మార్గంలోని అటవీ చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిపై దాడి చేసి గాయపరిచింది. రైల్వే పనులకు వచ్చిన ఛత్తీస్ఘడ్కు చెందిన పాండవ అనే బాలికపై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. శిరివెళ్ల మండల పరిధిలోని నల్లమలలో ఉన్న పచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ బీబీ వారం రోజుల క్రితం నిద్రిస్తుండగా చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. తాజాగా మంగళవారం అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మోహరున్నీసా కట్టెపుల్లల కోసం వెళ్లగా దాడి చేసి తలను తినేసింది. ఇదిలా ఉండగా పచ్చర్ల సమీపంలోని చిరుతపులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు బోను ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.మహానందిలో భయం...భయం..మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో వారం రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. దేవస్థానానికి చెందిన గోశాల, అన్నప్రసాద వితరణ కేంద్రం, పాత వివేకానంద పాఠశాల ప్రాంగణాల్లో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దాడి ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. అటవీశాఖ అధికారులు స్పందించి మహానంది, పచ్చర్ల గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని నల్లమల పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చిరుత దాడిలో మహిళ మృతి..
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచర్లలో దారుణం జరిగింది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసింది. మొండాన్ని వదిలేసింది. అయితే కట్టెల కోసం వెళ్లిన మెహరున్నిసా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో మెహరున్నిసా మొండెం లభ్యం కావడంతో హతాశులయ్యారు. స్థానికులు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు ఏర్పాటు చేశారు. చిరుత కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. -
చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలోని కొండల్లో చిరుత పిల్లలు సంచరిస్తున్నాయి. చిరుత పిల్ల రైతుల కంట పడింది. చనుగొండ్ల గ్రామానికి ఆనుకొని కొండ ప్రాంతం ఉండటంతో చిరుత పిల్లను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందోనని భయభ్రాంతులు చెందుతున్నారు.గతంలో చిరుత వెంకటాపురం గ్రామ సమీప కొండ గుహల్లో నివాసాలు ఏర్పరచుకొని రాళ్ల మధ్యలో ఉంటూ అటుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతానికి అనుకొని ఇల్లు ఉండటం వలన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
మదనపల్లె వైపు..చీతా చూపు!
రాజంపేట: చీతా..ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. ఇప్పుడు దీని చూపు మదనపల్లె వైపు పడింది..అంటే చీతాలను పునరుత్పత్తి కేంద్రంగా ఎంపిక చేసుకోవాలనే భావన డబ్ల్యూఐఐ తెరపైకి తీసుకొచ్చినట్లు అటవీవర్గాల సమాచారం. 1965లో ఒక సారి చీతా కనిపించింది. ఆ తర్వాత ఈ జాతి కనుమరుగైంది.భారత్లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. 2022లో నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్(మధ్యప్రదేశ్)లోకి వదిలిన సంగతి తెలిసిందే. ► అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టెరన్ ఏరియా విస్తారంగా ఉండటంతో..ఆ ప్రాంతంలో చీతా పునరుత్పత్తికి దోహదపడుతుందనే యోచనలో వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ముఖ్య శాస్త్రవేత్త రమేష్ ఉన్నట్లు అటవీవర్గాలకు సమాచారం అందింది. ఈనెల 25న చీతా పునరుత్పత్తిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని అటవీవర్గాలు చెబుతున్నాయి. ► 70వేల హెక్టార్ల అటవీ ప్రాంతం కలిగిన మదనపల్లె రేంజ్ ప్రాంతం టెరన్ ఏరియాగా పిలుస్తారు. 18 మండలాలు ఉన్నాయి. కొండ, గట్టు, గడ్డి విపరీతంగా పెరగడం లాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల చీతాల పునరుత్పత్తి ఉండటానికి అనుకూల ప్రదేశంగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. అటు కర్ణాటక, ఇటు చిత్తూరు, మరోవైపు సత్యసాయి జిల్లాలతో టెరన్ ప్రాంతం ముడిపడి ఉంటుంది. ► చీతా అనే పదం..హిందుస్ధానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్ చీతాలు, ఆసియాటిక్ చీతాలు, నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ చీతాలు, నార్త్వెస్ట్ చీతాలు. చీతా గర్జిస్తుందని పొరపాటు పడొద్దు. దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల అది గర్జించలేదు. పిల్లిలాగే మియావ్ అని, లేదంటే పిష్ అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. ► చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోని ముగిస్తుంది. ఇది ఎంతలా అంటే స్పోర్ట్స్ కారుకంటే వేగంగా. చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగుతీసింది. ►చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లు, జింకలను వేటాడుతాయి. పెద్దవాటి జోలికి ఎక్కువగా పోవు. ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకొని త్వరగా తినేస్తాయి. మదనపల్లె ప్రాంతం అనుకూలం చీతా జీవించడానికి .. వాటి మనుగడకు మదనపల్లె అటవీ ప్రాంతం అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనిపై పరిశోధన నిమిత్తం డబ్ల్యూఐఐకి చెందిన చీఫ్ సైంటిస్టు రమేష్ ఈ అంశం గురించి ప్రస్తావించారు. ఈనెల 25న సమావేశం ఉంటుందని సమాచారం అందింది. –వివేక్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట -
చిరుత నవ్వింది!
చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. 2018లో భారత్లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే అభిప్రాయపడ్డారు. సంఖ్య పెరిగినా... ► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి. ► మధ్యప్రదేశ్లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది. ► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్ప్రదేశ్ టాప్లో నిలిచింది. ► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది. ► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి. సర్వే ఇలా... ► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు. ► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది. ► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. ► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు. ► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు ► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది. ► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు. ► ఆ లెక్కన భారత్లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది. విశేషాలు ఇవీ... మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్లోని రామ్నగర్ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం! – సాక్షి, నేషనల్డెస్క్ -
ఫుల్గా తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?
ఫుల్గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు. అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి అనుకోకుండా ప్రవేశించింది. పైగా అక్కడ ఉండే మద్యాన్ని ఫుల్గా తాగేసింది. పాపం ఆ మద్యం సేవించిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేనంత మత్తులోకి వెళ్లిపోయింది. ఇంతలో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది అక్కడకు వచ్చారు. మొదట ఆ చిరుతను చూసి వారంతా భయపడ్డారు. అయితే అది అలాగే పడుకుని ఉండటం చూసి బహుశా మద్యం తాగేసి ఉంటుంది అందుకే అలా ఉందని అనుకున్నారు. అయినప్పటికి అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని దాన్ని అక్కడ నుంచి బయటకు పంపే యత్నం చేశారు. ఇంతలో అది లేచింది. కానీ నడిచే మూడ్లో అస్సలు లేదు. ఇక వాళ్లు ఎలాగో లేచింది కదా అని నెమ్మదిగా బయటకు వెళ్లేలా చేశారు. అయితే అక్కడున్న వారంతా దాని దగ్గరకు వచ్చి దాని మీద చేయి వేసినా.. కిమ్ అనకుండా ఉంది. పైగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తోంది. అందుకు సంబంధించిన ఘటనను ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే గాక ఆ పులి గనుకు మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకువెల్లేది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!) -
3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా ‘జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్ పేర్కొన్నారు. ‘కునోలోకి కూన చీతాలు వచ్చేశాయ్..జ్వాల అనే నమీబియా చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ అనే చీతా రెండు కూనలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఈ సంఘటన జరిగింది. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసేవారు, జంతు ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు. 2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. కునో నేషనల్ పార్క్లో చీతాల మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకొచ్చిన శౌర్య అనే చీత జనవరి 16న మృతిచెందిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు శౌర్య అస్వస్థతకు గురవ్వడం గమనించినట్లు అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కునోలోని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వెంటనే దానికి వైద్యం అందించగా కుదుటపడిందని చెప్పారు, కానీ కాసేపటికే మళ్లీ బలహీనపడి వైద్యానికి స్పందించలేదని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చదవండి: విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’ Kuno’s new cubs! Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs. Congratulations to all wildlife frontline warriors and wildlife lovers across the country. May Bharat’s wildlife thrive… pic.twitter.com/aasusRiXtG — Bhupender Yadav (@byadavbjp) January 23, 2024 ఇక 2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో బ్యాచ్లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 10 చీతాలు( ఏడు పెద్దవి, మూడు కూనలు) మరణించాయి. ఇదిలా ఉండగా గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి. -
రాజస్థాన్ జైపూర్ లో చిరుత హల్ చల్
-
కునో నేషనల్ పార్క్లో మరో నమిబియా చీతా మృతి
భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు. Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy — ANI (@ANI) January 16, 2024 ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం. చదవండి: ఆప్ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు -
జొన్న కురుకుల గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం
-
కునో నేషనల్ పార్క్లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా నుంచి తీసుకోచ్చిన ‘ఆశా’ అనే చీతా తాజాగా మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘కునో నేషనల్ పార్క్లో ‘ఆశా’ చీతా.. మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన విషయం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ‘ఆశా’ను ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రజెక్టులో చీతాల సంరక్షణకు కృషి చేస్తున్న కునో నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు’ అని భూపేందర్ యాదవ్ తెలిపారు. దశాబ్దాల క్రితం ఇండియాలో అంతరిచిన పోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో 17 సెప్టెంబర్ 2022న ప్రాజెక్టు చీతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా పుట్టిన మూడు చీతా పిల్లతో కలిపి మొత్తం చీతాల సంఖ్య 18కి చేరింది. అయితే నమీబియా నుంచి తీసుకువచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా 2023 మార్చి 27న మరణించిన విషయం తెలిసిందే. ‘ప్రాజెక్టు చీతా’ భాగంగా మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి భారత్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. Purrs in the wild! Thrilled to share that Kuno National Park has welcomed three new members. The cubs have been born to Namibian Cheetah Aasha. This is a roaring success for Project Cheetah, envisioned by PM Shri @narendramodi ji to restore ecological balance. My big congrats… pic.twitter.com/c1fXvVJN4C — Bhupender Yadav (@byadavbjp) January 3, 2024 చదవండి: ప్చ్.. మన బాహుబలికి అంత బలం లేదట! అందుకే ఇలా.. -
మూగజీవాలపై దాడులుచేస్తున్న చిరుతలు.. ఆందోళనలో గ్రామస్తులు!
ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రాంరాయనిపల్లి (మల్కిమియాన్పల్లి) గ్రామ సమీపంలో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా రెండు చిరుతలు సంచరిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. రాంరాయనిపల్లి సమీపంలోని బోడగట్టు వద్దనున్న సందపురం వెంకట్రెడ్డి పశువుల పాక వద్ద శుక్రవారం ఉదయం రెండు చిరుతలు కనిపించాయి. విషయాన్ని గ్రామపెద్ద సాయిలు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో సెక్షన్ ఆఫీసర్ భాస్కరాచారి, సిబ్బంది అంజనేయులు గుట్టపైకి వెళ్లి పరిశీలించారు. చిరుతల జాడ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీరా సాయంత్రం అదే గుట్టపై చిరుత కనిపించడంతో హీర్లతండాకు చెందిన కొందరు దూరం నుంచి వీడియో తీశారు. చిరుతల సంచారంతో రాంరాయనిపల్లితో పాటు హీర్లతండా, అల్లమాయపల్లి, వసురాంతండా, సూర్యతండా, దేవబండతండా, నేలబండతండా, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. దూడలపై చిరుత దాడి నవాబుపేట: నవాబుపేట మండలంలోని యన్మన్గండ్ల శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం గ్రామ శివారులోని గుట్ట పక్కనున్న పొలాల్లో రైతులు దూడలను కట్టేయగా.. అర్ధరాత్రి సమయంలో చిరుత దాడిచేసి గాయపర్చింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు.. రక్తపు మడుగులో ఉన్న దూడలను చూసి భయాందోళనకు గురయ్యారు. మొత్తం నాలుగు దూడలపై దాడి చేసినట్లు రైతులు తెలిపారు. చిరుత బారి నుంచి మూగజీవాలను కాపాడాలని కోరారు. -
చిరుత కలకలం: బయటికి రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు
న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు. ఫాంహౌజ్కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు. అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. #WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB — ANI (@ANI) December 2, 2023 -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా నడక మార్గంలో చిరుత కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత పెంచారు. గుంపులుగా వెళ్లాలని, చిన్న పిల్లలను దగ్గరే ఉంచుకోవాలని భక్తులకు అటవీ శాఖాధికారులు సూచించారు. ఇటీవల కాలంలో చిరుతల సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి కర్రను కూడా అందిస్తోన్న టీటీడీ.. మరిన్ని భద్రతా చర్యలు చేపట్టే అంశంపై కసరత్తు చేస్తోంది. -
శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కదలికలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కదలికలు కలకలం సృష్టించాయి. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులకు చిరుత కదలికలు ఆందోళన రేకెత్తించాయి. చిరుత కదలికల్ని గుర్తించిన భక్తులు.. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో కాలినడకన వెళ్లే భక్తులు,.. గుంపులుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది టీటీడీ. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. మరొకవైపు ప్రత్యేక కెమెరా టాప్స్ను టీటీడీ ఫారెస్ట్అధికారులు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో చిక్కిన మరో చిరుత
-
తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!
సాక్షి, తిరుపతి: తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుక కంచె ఏర్పాటు అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇనుపకంచె ఏర్పాటుకు కేంద్రం అనుమతులను టీటీడీ కోరింది. ఈ నెల 12 ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నడకమార్గంలో పర్యటించి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నాయి. నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. స్పెషల్ టైప్ క్వార్టర్స్, శ్రీవారి మెట్టు నడకదారి, నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
తిరుమలలో చిరుతను ట్రాప్ చేసిన అటవీశాఖ అధికారులు
-
చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Cheetah & tortoise share food. Those who give their food give their heart. 📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ — Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023