-
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. హగ్గులతో 'బిగ్బాస్' కీర్తి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు (ఫోటోలు)
-
విడాకుల మహోత్సవం
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.అనిల్ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024 -
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Cricketers Celebrate Eid: రంజాన్ వేడుకల్లో క్రికెటర్లు.. ఫొటోలు చూశారా? (ఫొటోలు)
-
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నేచురల్ స్టార్ నాని బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కొత్త ఏడాదికి గూగుల్ వెల్కమ్- నెట్టింట్లో డూడుల్ వైరల్
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి.. 2023కి వీడ్కోలు పలకడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమైపోయారు. అంతకంటే ముందు గూగుల్ ఓ కొత్త డూడుల్ ప్రదర్శించింది. దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 3... 2... 1... హ్యాపీ న్యూ ఇయర్! అంటూ గూగుల్ పేర్కొంది. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలను, విషాదాలను నెమరు వేసుకుంటూ.. 2024 సంతోషంగా సాగాలని కోరుకుంటూ వెల్కమ్ చెప్పడానికి ప్రపంచమే సిద్దమవుతున్న సమయంలో గూగుల్ ఈ విన్నూత ప్రయోగం చేసింది. నిజానికి 1998 నుంచి 2003 వరకు, గూగుల్ వివిధ సందర్భాలను పురస్కరించుకుని, వ్యక్తులను గౌరవించడం మొదలు ఏకంగా 5000 కంటే ఎక్కువ డూడుల్ రూపొందించినట్లు సమాచారం. ఈ డూడుల్ ఐడియా అనేది సంస్థ కో-ఫౌండర్స్ నుంచి పుట్టుకొచ్చిందే. ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్లెస్ ట్రైన్ వీడియో వైరల్ 1998లో గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ నెవాడాలో బర్నింగ్ మ్యాన్ ఉత్సవానికి హాజరు కావడానికి ఆఫీసుకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గూగుల్ వినియోగదారులకు తెలియజేయడానికి ఓ సులభమైన మార్గాన్ని ఆలోచించడంలో భాగంగానే ఈ డూడుల్ అనేది పుట్టుకొచ్చింది. -
Nani-Mrunal Thakur Latest Photos: హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోటకు చేరిన నాని, మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
న్యూజెర్సీలో తెలుగు పీపుల్ ఫాండేషన్ వార్షికోత్సవ వేడుకలు
-
సైనికులతో మోదీ దీపావళి వేడుకలు
లఢక్: దీపావళి సంబరాలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరాన్ని మోదీ సందర్శించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదలు చేకూరాలని ఆకాంక్షించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. "సైన్యం సరిహద్దుల్లో హిమాలయంగా స్థిరంగా ఉన్నంతకాలం దేశం భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో భారత్పై నమ్మకం పెరిగింది. దేశ సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి. అందుకే దేశంలో శాంతి నెలకొంది. ఇందుకు సైన్యం పాత్ర ఎనలేనిది" అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali with Army personnel in Himachal Pradesh's Lepcha pic.twitter.com/ff23aUxgqe — ANI (@ANI) November 12, 2023 ప్రధాని మోదీ ప్రతి ఏడాది దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి దీపావళి వేడుకలతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. గత ఏడాది కార్గిల్లో జరుపుకున్నారు. Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL — Narendra Modi (@narendramodi) November 12, 2023 ఇదీ చదవండి: కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
Nita Ambani 60th Birthday: పుట్టినరోజు వేడుకల్లో నీతా అంబానీ (ఫొటోలు)
-
జాతీయ అవార్డ్ విన్నర్స్కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్పై అద్భుతమైన యాడ్ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్లో.. -
ధోని బర్త్డే వేడుకలు.. అతిథులు ఎవరంటే? (ఫొటోలు)
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
డైవర్స్ తీసుకోవడాన్నిగ్రాండ్గా సెలబ్రేట్ చేసింది..రీజన్ వింటే..
డైవర్స్ అన్న పదం వింటేనే గుండె ఝల్లుమంటుంది. అదికూడా అప్పటి వరకు ఉన్న బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. ఏదో కారణంతో విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురేతే.. ఆ బాధ మాట్లలో చెప్పలేం. ఐతే ముఖ్యంగా ఆడవాళ్లు, అదికూడా పిల్లలున్న తల్లి సమాజంలో ఒంటరిగా బతకడం మరింత కష్టం అవుతుంది. దీంతో వాళ్లు దిగాలు పడిపోవడం (లేదా) ఇక జీవితమైపోయింది అనుకుని అంతం చేసుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తారు. అలా కాదు మనం జీవితం అక్కడితో అయిపోలేదంటోంది అమెరికాకు చెందిన మహిళ. మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుని నువ్వేంటో చూపేలా బతకాలంటోంది. వివరాల్లోకెళ్తే..యూఎస్లోని లారెన్ బ్రూక్ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. పదేళ్ల వివాహ బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటే తట్టకోలేకపోయింది. సరిగ్గా 2012లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తానేం చేయగలను, ఏమవుతుంది జీవితం అని డీలా పడిపోయింది. ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. డైవర్స్ ఆగిపోతుందేమో!.. తన భర్త మళ్లీ వచ్చేస్తాడేమో అన్న ఆశ భంగపడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఇక ఎన్నాళ్లు ఈ బాధను మోయాలి. ఔను! ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది బ్రూక్. అందులో భాగంగానే తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. ఇన్నిరోజులు ఏదో జరగుతుందన్న ఆశతో కన్నీళ్లతో గడిపాను. మంచో చెడో ఏదో ఒకటి అయ్యింది. ఇక్కడితో నా కన్నీళ్లకు స్వస్తి పలికి.. సెలబ్రేషన్తో ఆ విషాదానికి ముగింపు చెప్పాలనుకుంది. తన తల్లి ఫెలిసియా బౌమన్ (58), తన బెస్ట్ఫ్రెండ్ సమక్షంలో ఈ విషాదాన్ని వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్ చేశారు. మహిళలు తాను విడిపోయాను అని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడతారని బ్రూక్ చెబుతోంది. అలా కాదని ఇక నుంచి చాలా శక్తిమంతమైన మహిళగా తయారయ్యేందుకు నాంది ఇదేనని చెప్పడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ తెలసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశా. కామెడీగా మాత్రం కాదని చెప్పింది. "మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి" అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్ చేసుకుంది. రిలేషన్ని కోల్పోయానన్న బాధతో ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండి నవ్వేంటో నిరూపించుకునే తరుణం ఇది. ఇది నీకు దొరికిన అద్భుతమైన అవకాశంగా ఛాలేంజింగ్గా తీసుకో అని చెబుతోంది బ్రూక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!) -
జగన్ సంకల్పం... జన సంక్షేమం
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్ చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్ నిలిచిపోయారన్నారు. సంక్షేమ పాలన ద్వారా జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు. మడకశిరలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. హిందూపురంలో జయహో జగన్ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్టీ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. (చదవండి: ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ) -
కనుల పండువగా ‘ఆజాదీ కా రేల్గాడీ ఔర్ స్టేషన్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దక్షిణమధ్య రైల్వేలో ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్’ వేడుకలు సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో ప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, వివిధ విభాగాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్త్సోత్సవాల స్ఫూర్తిని చాటుతూ కళాకారులు అద్భుతమైన కార్యక్రమాలతో అలరించారు. (చదవండి: మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్ సెల్’ ) -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
గణేష్ ఉత్సవాన్ని ఆరెంజ్ గణపతితో జరుపుకుంటుంది..
-
ఏపీ సచివాలయానికి సంక్రాంతి సంబరాలు
-
ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
యుఎస్ ఓపెన్ విజేతగా బియాంకా
-
అక్కడ హఫీజ్ విడుదల.. ఇక్కడ సంబరాలు
లక్ష్మీపూర్/ఖేరి : ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హహీజ్ సయీద్ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేయడంతో ఉత్తర్ ప్రదేశ్లోని లక్ష్మీపూర్ గ్రామంలో కొందరు వేడులు నిర్వహించుకున్నారు. హహీజ్ సయీద్ విడుదలపై ఉత్తర్ ప్రదేశ్లో వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదంగా మారింది. శివపురి ప్రాంతంలోని బేగంబాగ్ కాలనీలో కొందరు హఫీజ్ సయీద్ విడుదల అనంతరం.. ‘హఫీజ్ సయీద్ జిందాబాద్’... ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ.. ఆకుపచ్చ జెండాలను ఎగురవేశారు. అత్యంత వివాదాస్పదమైన ఈ ఘటన కలెక్టర్ అక్షద్వీప్ దృష్టికి రావడంతో.. పూర్తి ఆధారాలతో విచారణ నిర్వహించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం హఫీజ్ సయీద్కు అనుకూలంగా 20-25 మంది యువకులు నినాదాలు చేసినట్లు కత్వాలి పోలీసులకు మొదటి సమాచారం అందింది. అయితే ఈ ఘటన తీవ్రతను మొదట అధికారులు గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ అక్షద్వీప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పలు ఇళ్లపై ఎగరేసిన ఆకుపచ్చ జెండాలను అధికారులు తొలగించారు. హఫీజ్ సయాద్, పాకిస్తాన్కు అనుకూలంగా చేసిన నినాదాలు, వేడుకులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించిందని.. పోలీసులు ప్రకటించారు. యువకులు చేసిన నినాదాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై లక్ష్మీపూర్ ఇమామ్ అష్పాఖ్ ఖాద్రీ మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ విడుదలపై వేడుకలు చేసుకోలేదని చెప్పారు. హహీజ్కు అనుకూలంగా నినాదాలు ఎవరూ చేయలేదని కూడా ఆయన ప్రకటించారు. తామంతా జులూస్ ఏ మహమ్మదీ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు ఆయన తెలిపారు.