-
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం(జూన్21) కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.వ్యవసాయం దండగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపించాలనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదా పద్ధతుల్లో చేసి రైతు ఆత్మహత్యలకు కారణమయింది. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు భరోసాపై పారదర్శకంగా అందరి సూచనల మేరకే అమలు చేస్తాం.ప్రభుత్వ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించాం. ఉపసంఘంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొంగులేటిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇక నుంచి మీడియాకు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాత్రమే చెప్తారు. వీరిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారం. వీరిని మంత్రివర్గ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాం. రుణమాఫీ అర్హుల ఎంపిక విధివిధాలపై త్వరలోనే జీవో విడుదలవుతుంది’అని రేవంత్రెడ్డి తెలిపారు. -
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
వార్ కేబినెట్ను రద్దు చేసిన నెతన్యాహూ
టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి. దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్లు వార్ కేబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది. బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు. -
నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ రద్దు
జెరూసలెం: హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్కోట్ వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్ క్యాబినెట్ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. -
పదవులపై ఉత్కంఠ.. ఎవరికి ఏ శాఖలు ?
-
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు. #WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x— ANI (@ANI) June 13, 2024 -
సీనియర్లకు నిరాశే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. గంటా, అయ్యన్నకు దక్కని పదవులు ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్లకు మొండిచేయి చూపారు. తూర్పులో జనసేనకు ప్రాధాన్యం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికీ అవకాశం రాలేదు. సీమలో సీనియర్లకు మొండి చేయి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. సుజనా చౌదరికి ఎదురు దెబ్బ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. జనసేనకు మూడే జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు. -
రుణమాఫీపై వారంలో కేబినెట్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి.. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు. కటాఫ్ తేదీ ఏది? మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. కేంద్రం మాదిరి ఉద్యోగులు, డాక్టర్లు తదితరులకు మినహాయింపు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్టులు లాంటి ప్రొఫెషనల్స్ను ఈ పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చాయనే అభిప్రాయం ఉంది. ఈ మేరకు రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు కేబినెట్లో ట్విస్ట్..
-
జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?
-
చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు
-
భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు
-
విధేయతకు పెద్దపీట!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. జి.కిషన్రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా.. సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పట్టుసాధించడంతో..2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్రెడ్డి, గోడెం నగేశ్ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు.\కేంద్ర కేబినెట్లో చోటు కోసం కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్రెడ్డి, సంజయ్ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.అనుభవం, సీనియారిటీతో..కిషన్రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది.దూకుడుగా పార్టీ బలోపేతంతో..2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్ఎస్ఎస్లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.ఏపీ నుంచి ముగ్గురికి..ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.ఉదయం ఫోన్లు.. మధ్యాహ్నం తేనీటి విందు..ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అభినందించారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.హిందీలో ప్రమాణ స్వీకారంకేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హాజరయ్యారు. -
కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్లో కింజరాపు రామ్మోహన్నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్ దక్కించుకున్నారు.టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్లకు తొలి కేబినెట్లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్..క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. 2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, ప్యానల్ చైర్మన్గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్కు గౌరవ ప్రెసిడెంట్గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు. -
మోదీ నూతన క్యాబినెట్లో అనుప్రియ పటేల్
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్రావ్ జాదవ్లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
సెంట్రల్ కాబినెట్ లో చోటు ఎవ్వరికీ..!
-
కేంద్ర కేబినెట్ కూర్పు.. ఏపీకి ఎన్ని?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. -
మంత్రి పదవులపై మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయ్యి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కొలువు దీరడమే మిగిలి ఉంది. దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికీ మంత్రి యోగం దక్కుతుందో అన్నదానిపైనే పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. వారిలో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. మే 13న పోలింగ్ జరిగింది. ఈ నెల 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో కూట మి విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం, దాని విధి వి«ధానాల మేరకు పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపైనే పడింది. జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు. కాళింగ కోటాలో కూనకు దక్కే అవకాశం జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది. లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’అచ్చెన్నకే పెద్దపీట.. సామాజిక వర్గాల వారీగా చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే స్థాయిలో జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక, సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత వెలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కింజరాపు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక, రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడికే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ రామ్మోహన్ తెరపైకి వస్తే...ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం, ఆ పార్టీ నుంచి గెలిచిన హ్యాట్రిక్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు నిలవడం, చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్లో చోటు కలి్పస్తారేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామ్మోహన్నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. ఇటు రాష్ట్రమంత్రిగా బాబాయ్ అచ్చెన్నాయుడికి, అటు కేంద్రమంత్రిగా అబ్బాయ్ రామ్మోహన్నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా? అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. కాదనుకుంటే కేంద్ర కేబినెట్లో రామ్మోహన్కు చోటు కలి్పంచాలి. ఈ సమయంలో బాబాయ్, అబ్బాయ్లో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి. -
కేంద్ర కేబినెట్లో ఇద్దరికి చాన్స్?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్లు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్లో రాష్ట్రంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు పార్టీలో అంతర్గత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలిసింది. పార్టీలో సీనియారిటీ, విధేయత, కులాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఒక రెడ్డి, మరొక బీసీ సామా జికవర్గ నేతకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇదివరకే కేబినెట్ మంత్రిగా పనిచేసిన జి.కిషన్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ పోటీలో ఉండే అవకాశం ఉంది. అయితే కిషన్రెడ్డినే మరోమారు కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్షు డిగా కొనసాగించాలని నిర్ణయిస్తే అరుణకు అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మ పురి అరవింద్, ఈటల రాజేందర్లలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందులో వరుసగా రెండోసారి గెలిచిన బండికే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోదీ పట్ల ఉన్న విధేయత, 2 లక్షలకుపైగా మెజారిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆయనకు సంఘ్ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందనే వాదన ఉంది. ఇక సీనియర్ నేతగా ఈటలకు సైతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా, తొలిసారి ఎంపీగా ఎన్నికవడం, పార్టీలో చేరి ఎక్కువకాలం కాకపోవడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కేబినెట్లో తీసుకునే వారి పేర్లపై గురువారం లేక శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకుముందే మంత్రి పదవులపై స్పష్టత రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల కమిషన్(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయించింది.అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. -
కాళేశ్వరంపై కమిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ చంద్రఘోష్ గతంలో లోక్పాల్గా, ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన మరో జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. నివేదికల సమర్పణకు గాను రెండు కమిషన్లకు 100 రోజుల గడువు విధించింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 2 గంటలకు పైగా సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కొత్త రేషన్కార్డులు, తొలివిడతలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియా సెంటర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ: పొంగులేటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపైనా, ఎవరి ఒత్తిడితో ప్రాజెక్టును అలా కట్టారో అనే అంశంపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతుందని పొంగులేటి తెలిపారు. టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ల విధానంలో ఛత్తీస్గఢ్ నుంచి నేరుగా 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆ విద్యుత్ను వాడుకోలేదని మంత్రి ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై గత ప్రభుత్వం దళారులకు చేసిన చెల్లింపులపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో ఇతర రంగాల్లో జరిగిన అవినీతికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున రూ.22,500 కోట్లతో మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలం కలిగిన పేదలు, నిరుపేదలకు దీనిని వర్తింపజేస్తారు. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, పింక్ షర్ట్ వారు అని చూడకుండా, పైరవీలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేస్తామని పొంగులేటి తెలిపారు. త్వరలో 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ప్రస్తుత ప్రభుత్వం మహిళలను కోటీశ్వరుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి వీలుగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఇక్కడి స్థలాన్ని జిల్లాల వారీగా మహిళా గ్రూపులకు కేటాయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిల్లో విశాలమైన మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 84 శాతం రైతులకు రైతుబంధు ఇచ్చిందని, వచ్చే 2 రోజుల్లో 93 శాతానికి పైగా రైతులకు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. త్వరలో కొత్త రేషన్కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదలందరికీ కొత్తగా తెల్ల రేషన్కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డులుంటేనే ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే భావన ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో రేషన్కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీసి అమలు చేయాలని భావిస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. దీనిపై నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించామన్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు లైన్క్లియర్ 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమమ్ పే స్కేల్ (టైమ్ పేస్కేల్) ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి అభ్యర్థులు తమకు అనుకూలంగా తీర్పులు తీసుకువచ్చారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కాగా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు. గత సెపె్టంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు పడక రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోయాయని పేర్కొన్నారు. కొత్తగా 16 కార్పొరేషన్లు మహిళల సాధికారత కోసం ‘తెలంగాణ మహిళా శక్తి’ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీల కోసం మొత్తం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 1.యాదవ (కుర్మ), 2.మున్నురుకాపు, 3.పద్మశాలి, 4.పెరిక (పురగిరి క్షత్రియ), 5.లింగాయత్, 6.బలిజ, 7.గంగపుత్ర, 8.మేరా, 9.ముదిరాజ్ కార్పొరేషన్, 10.ఆర్య వైశ్య, 11.రెడ్డి కార్పొరేషన్, 12.మాదిగ, మాదిగ ఉపకులాలు, 13.మాల/మాల ఉపకులాలు, 14.కుమురం భీమ్ ఆదివాసి, 15. సంత్ సేవాలాల్ లంబాడి, 16.ఎరుకలు, ఇతర ఉపకులాల కోసం ఏకలవ్య.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు: పొన్నం కులగణన నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సాంకేతికత జోడించడం కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్కు రూ.1,000 కోట్లు కేటాయించి రూ.ఒక్క కోటి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తాము కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని, త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా వర్గాల వారితో సంప్రదింపులు జరిపి రెండు మూడు వారాల్లో కార్పొరేషన్లకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తారని శ్రీధర్బాబు తెలిపారు. గీత కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు త్వరలో రక్షణ పరికరాలను అందజేస్తామని, వాటితో చెట్లను ఎక్కితే కిందపడే ప్రమాదం ఉండదని, మరణాలూ ఉండవని పొన్నం చెప్పారు. బీఆర్ఎస్ ఖాళీ అయింది: కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి బృందంగా పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కేసీఆర్ ఈ రోజు మహిళలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, జెడ్పీ/మున్సిపల్ చైర్మన్లు, కింది స్థాయి నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, మరో పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
ఏఐ కోసం రూ. వేలకోట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి 'ఇండియాఏఐ' (IndiaAI) మిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనే విజన్తో మన దేశంలో కూడా టెక్నాలజీ పెరగాలని క్యాబినెట్ భారీ బడ్జెస్ట్ ప్రకటించింది. ఇండియాఏఐ మిషన్ సామాజిక ప్రయోజనం కోసం విప్లవాత్మక సాంకేతికత అనువర్తనాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి సహాయపడుతుంది. భారత్ ప్రపంచంలో పోటీ పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.