-
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
లైంగిక వేధింపుల కేసు : యడ్యూరప్పకు ఎదురు దెబ్బ!
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసుఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్లో పోలీస్స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసుకేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.ఆయన మాజీ సీఎం తొందరపడొద్దుజూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.ఎక్కడ విచారించాలోఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మీకు ఓట్లు వేసిన వారికే విత్తనాలు ఇస్తారా..?
-
శాం పిట్రోడాకు కీలక బాధ్యతలు.. ప్రధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్ రిజిజు
లోక్సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగిబాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ.. శాం పిట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని అన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘ప్రధాని మోదీ ఊహించినట్లే.. రాహుల్ గాంధీ సలహాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా , ఈశాన్య ప్రజలు చైనీస్గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా కకనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారు. ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారు’. అని పేర్కొన్నారు.ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు. ‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు.అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’ అని మోదీ ఆ వీడియోలో అన్నారు.కాగా లోక్సభ ఎన్నికల సమయంలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా పార్టీ నియమించింది. -
బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం
-
అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక మలుపు. ఆ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. పదేళ్లుగా అద్వానీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాదే ఆయన భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే. -
సీబీఐ అదుపులో కేజ్రీవాల్.. బీజేపీకి ఆప్ చురకలు!
సాక్షి,న్యూఢిల్లీ : రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్) సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్ వేదికగా స్పందించింది.లిక్కర్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీ అమితాబ్ రావత్ అరెస్ట్ ఆర్డర్ను పాస్ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు.ఈ వరుస పరిణామలపై ఆప్ స్పందించింది. ట్రయిల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్ మండిపడింది. కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్ చేసిందని ట్వీట్లో పేర్కొంది.‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించింది’అని ట్వీట్లో ద్వజమెత్తింది. -
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కాంగ్రెస్ ఇకనైనా కుటిలరాజకీయాలు, చీకటి ఒప్పందాలు మానాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కుటిల రాజకీయాలు, చీకటి ఒప్పందాలు వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్థవంతంగా చర్చకు సహకరించి పరిష్కారమార్గాలు సూచించాలని ఒక ప్రకటనలో కోరారు. దేశాన్ని అస్థిరపరిచి, బలహీనపరిచేందుకు విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు. ‘ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. ఎమర్జెన్సీపాలన దేశానికి ఓ మాయని మచ్చ.ప్రజల గొంతునొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం’ అని మండిపడ్డారు. అధికారం కోసం ఇందిరాగాంధీని మించి ఆమె మనవడు రాహుల్గాంధీ దురాలోచన చేస్తున్నారని ఆరోపించారు. వివిధ దేశాల్లో పర్యటిస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే ముసుగులో రాహుల్ పాశ్చాత్య దేశాల జోక్యాన్ని నిస్సిగ్గుగా కోరుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు.తెలుగురాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన డీఎస్పీరెడ్డి, జంగారెడ్డి, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ.చలపతిరావు, వెంకయ్య నాయుడు, సీహెచ్.విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డి, ఇంకా సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసినా, కాంగ్రెస్కు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా ఆ పార్టీ నేతలు తీరు మారలేదని బండిసంజయ్ విమర్శించారు. -
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
-
స్పీకర్ పదవిపై వీడని సస్పెన్స్
న్యూఢిల్లీ: 18వ లోక్సభ స్పీకర్గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నెల 26న జరిగే స్పీకర్ ఎన్నికకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీలతో ఎన్డీఏ సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్డీఏ తమ స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీపడే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోందని విశ్వసనీవర్గాలు తెలిపాయి. స్పీకర్పై ఎలాంటి తుది నిర్ణయాన్ని తమకు తెలుపలేదని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడొకరు తెలిపారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బీజేపీ తమ అగ్రనేతలందరికీ మునుపటి శాఖలే కేటాయించి.. కొనసాగింపును భూమికగా ఎంచుకున్నందున 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కొనసాగించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి స్పీకర్ పోస్టుకు తమ అభ్యరి్థని పోటీకి నిలుపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తోందని, బీజేపీకి అందుకు ముందుకు రాకపోతే పోటీచేయక తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. కొత్త స్పీకర్పై ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి విపక్షాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, అలా జరపని పక్షంలో తాము స్పీకర్ పదవికి పోటీ పెడతామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ సోమవారం విలేకరులతో అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది మాకు తెలిపిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమికి చెందిన నాయకుడొకరు అన్నారు. బలహీనవర్గాలకు చెందిన అభ్యరి్థని పోటీపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలముంది. -
దేశ సమైక్యతకు బీజేపీ పనిచేస్తుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలో సమగ్రత, సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఆర్టికల్ 370ని విభేదించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పట్లో కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేశారని, తర్వాత భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని వివరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు బలిదానం చేసిన చరిత్ర జనసంఘ్దన్నారు.శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద కిషన్రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నా లు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారని, అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు.75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి, డాక్టర్ విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
కరుడుగట్టిన పసుపు యోధుడు
సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్బ్రాండ్ అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. అయ్యన్నను స్పీకర్ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. సీఎంగానే సభలో అడుగుపెట్టా.. సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు. 25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరికంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు. ప్రజలు హుందాతనం చూస్తారు ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్ను చేసినట్లుందన్నారు. గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.హుందాగా మాట్లాడాలి.. శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్హుందాగా నడపాలంటూనే జగన్పై అనవసర విమర్శలు.. గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే మంత్రులు అనిత, బీసీ జనార్థన్రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్కు అభినందనలు చెప్పడం కంటే జగన్ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ను బీజేపీ రద్దు చేసింది
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. -
కేసీఆర్ను విమర్శించడమే కాంగ్రెస్, బీజేపీ పని
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలతో ఎదురుదాడి చేయడం మినహా కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ సోయి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందన్నారు. దీంతో తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పారీ్టయేనని మరోమారు నిరూపితమైందన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగింత, గోదావరి, కావేరి అనుసం«ధానం సహా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.సింగరేణి బ్లాకుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయన్నారు. శ్రావణి బ్లాక్ వేలంపై డిప్యూటీ సీఎం భట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డికి కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్కు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, మీడియాలో కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ముఖచిత్రం నుంచి ఆయనను అదృశ్యం చేయాలనుకుకోవడం కుదిరేపని కాదని అన్నారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు. నాగర్కర్నూల్ ఘటన దారుణం ఇల్లందకుంట: నాగర్కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండికేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ కుట్ర
-
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిలో అతిపెద్ద కుట్ర
-
కేంద్ర హోం మంత్రిగా కరీంనగర్ లో బండి సంజయ్ మొదటి స్పీచ్
-
ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చ నిరసన
-
ఏపీ కి ప్రత్యేక హోదా తేవాలి బాబు కు అఖిల పక్షాల డిమాండ్
-
20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. సన్మాన కార్యక్రమం ఇలా... గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్టాప్ జీప్లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. మోదీకి ధన్యవాద సభ ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 21న అన్ని మండలాల్లో యోగా డే కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు. -
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నా: మేఘ్వాల్
కోల్కతా: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఆదివారం కోల్కతాలో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు.