-
థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు. చివరిగా బాలీవుడ్లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్ను ఆయన పట్టాలెక్కించారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ 'రాక్షసుడు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నారు. 'చావు కబురు చల్లగా' అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 పేరుతో సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో #BSS11 ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించేలా ఉంది. హారర్-మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
జెట్ స్పీడ్తో...
తమిళంలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ . ఇప్పటికే ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం ‘బైసన్ ’, ‘లాక్డౌన్ ’ అనే రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘లవ్టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘డ్రాగన్ ’లో ఓ హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కాలేజీలో ప్రదీప్–అనుపమల మధ్య చిత్రీకరిస్తున్న రొమాంటిక్ సన్నివేశాల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుపమ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్’, పరదా’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), బెల్లకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లో ఆమె నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అరడజనుకుపైగా సినిమాలతో అనుపమా జెట్ స్పీడ్తో దూసుకెళుతున్నారు. -
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్పై హాట్గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. -
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
ఇలాంటి మసాజ్ కావాలంటూ ఫోటో షేర్ చేసిన అనుపమ
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్పై ఒక హాట్గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్ను తెరపై చూపించింది. దీంతో గ్లామర్ పాత్రలకే అనుపమ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు మించి త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'పరదా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనుపమ తన గ్లామర్ ఫోటోలతో కిక్ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఫోటో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో పరదా అనే సినిమాలో అనుపమ నటిస్తుంది. ఇదొక భిన్నమైన న్యూఏజ్ ట్రావెల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్రన్తో పాటు సంగీత, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Ananda Media (@anandamediaofficial) -
నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలుసా?
టిల్లు స్క్వేర్తో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తూ పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకుంది. అయితే ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్కు గేట్లెత్తేసింది. గ్లామర్కు ఓటేసిన బ్యూటీటిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్లాక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. ఈ మూవీ సక్సెస్తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు తలుపులు తడుతున్నాయి. చీర ధరెంతో తెలుసా?దీంతో ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రూ.కోటి తీసుకుంటున్న ఈ జాణ టిల్లు స్క్వేర్ నుంచి దాన్ని రెండింతలు చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. తాజాగా నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో సింపుల్గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15000 అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024 -
లాక్ డౌన్లో ఏం జరిగింది?
ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్ ఫామ్లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్’ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్ డౌన్’ ప్రకటన కూడా వచ్చింది.ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్ పస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్ డౌన్’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. మలయాళంలో ‘ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’, తెలుగులో ‘పరదా’, తమిళంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు అనుపమ. ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అలాగే ‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఆక్టోపస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), కౌశిక్ తెరకెక్కిస్తున్న ‘కిష్కిందపురి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాల్లోనూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అనుపమ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న మరో కొత్త సినిమా ప్రకటన శనివారం వెల్లడైంది. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాతో ఏఆర్ జీవా దర్శకుడిగా పరిచయం అవుతారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని కోలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘ఈగల్’, ‘టిల్లు స్వే్కర్’, ‘సైరన్’ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఇలా ఇప్పటికే అనుపమ మూడుసార్లు థియేటర్స్లో కనిపించారు. ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
అనుపమ పరదా
అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘పరదా’ అనే టైటిల్ ఖరారైంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను నటి సమంత, దర్శక–నిర్మాతలు రాజ్ అండ్ డీకే షేర్ చేశారు. ‘పరదా’ కాన్సెప్ట్ వీడియోలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే శ్లోకం వినిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్తో పాటు ఆ పరిసర గ్రామాల్లో ఇప్పటివరకు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘‘మేలో హైదరాబాద్లో జరగనున్న కొత్త షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు ప్రవీణ్. ‘‘ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు విజయ్ డొంకాడ. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
చీరలో అనుపమ మరింత క్యూట్.. శ్రీముఖి మాత్రం ఎప్పట్లానే!
చీరలో మరింత క్యూట్ గా 'హనుమాన్' హీరోయిన్ అమృత పద్ధతైన కేరళ చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. చూస్తే అంతే మోడ్రన్ మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి తెలుగమ్మాయిలా మారిపోయిన హీరోయిన్ రుహానీ శర్మ చూపులతో మత్తెక్కించేస్తున్న 'నా సామి రంగ' ఆషికా రంగనాథ్ ప్యూర్ వైట్ శారీలో మరింత అందంగా హీరోయిన్ అనంతిక ఇంట్లో పూజ చేయించిన అనసూయ.. రీజన్ మాత్రం సస్పెన్స్ View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
Anupama Parameswaran: చీరలో ‘టిల్లుగాడి’ లవర్ లిల్లీ హోయలు (ఫొటోలు)
-
అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!
అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో అడుగుపెట్టిన కొంతకాలానికే ఇక్కడి ప్రేక్షకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకుండా పర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది అనుపమ. అందుకే ఆడియన్స్కు తెగ నచ్చేసింది. కానీ ఎంతకాలమని గిరి గీసుకుని బతకాలి? గ్లామర్ పాత్రలు కూడా ఓసారి చేసి చూస్తే పోలా? అనుకుంది. అలా టిల్లు స్క్వేర్లో భాగమైంది. డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ తొలిసారి బోల్డ్గా నటించింది. ఇంకేముంది అభిమానులు హర్టయ్యారు, తనను ట్రోల్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అనుపమకు ఇలాంటి పరిస్థితా? టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవగా, కొద్ది రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం నాడు టిల్లు స్క్వేర్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనుపమ స్టేజీపైకి వచ్చి మాట్లాడబోతుంటే అక్కడున్న జనాలు వద్దని గోల చేశారు. అది గమనించిన అనుపమ మాట్లాడకుండా వెళ్లిపోవాలా? అని సైగ చేసింది. అయినా సరే ఎవరూ నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించలేదు. మాట్లాడొచ్చా? వద్దా? అని అడగ్గా వద్దని చెప్పారు. దీంతో హర్టయిన అనుపమ.. సరే వెళ్లిపోతాను అనేసింది. కనీసం ఒక్క నిమిషం దీంతో యాంకర్ సుమ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించింది. ఆమెను తిరిగి స్టేజీపైకి తీసుకొచ్చింది. ఒక రెండు నిమిషాలైనా మాట్లాడొచ్చా? అని అనుపమ రిక్వెస్ట్ చేయగా దానికీ నిరాకరించారు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడతానని అభ్యర్థిస్తూ ప్రసంగం మొదలుపెట్టింది. ముందుగా స్పెషల్ గెస్ట్గా వచ్చిన తారక్కు కృతజ్ఞతలు తెలియజేసింది. నాకేం బాధ లేదు.. అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను.. ఆ ఎగ్జయిట్మెంట్లో నేనూ అలాగే ప్రవర్తిస్తాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా చాలామంది అక్కడి అభిమానుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. హీరోయిన్ను అలా కించపరచడం తప్పని కామెంట్లు చేస్తున్నారు. 🤦♂️ Our Crowd! pic.twitter.com/dLF2rj2JEG — Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2024 చదవండి: అమాయకుడైన చైని మోసం చేశావ్.. ఇచ్చిపడేసిన సామ్ -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్స్టార్లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్ను, పోలీస్ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
అనుపమ అలాంటి పోజులు.. మరింత హాట్గా బాలీవుడ్ భామ!
హాట్ లుక్స్లో జియా శంకర్ హోయలు.. బ్లూ శారీలో టిల్లు స్క్వేర్ భామ అనుపమ.. వైజాగ్లో శ్రద్దాదాస్ అలాంటి లుక్స్.. బాలీవుడ్ భామ రియా చక్రవర్తి హాట్ పోజులు.. బర్త్ డే ముద్దుగుమ్మ రష్మిక అలాంటి వీడియో.. View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) -
జానకిగా వచ్చేస్తున్న 'అనుపమ పరమేశ్వరన్'
'టిల్లు స్క్వేర్'తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్గా మలయాళ సీనియర్ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్స్టాలో పంచుకుంది. 'నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తైంది' అంటూ అందులో రాసుకొచ్చింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి అనే యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా.. ఆమె తరఫున కేసును వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి నటిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
బెంచ్ మార్క్ దగ్గర్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్తో ఆ మార్క్ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్ప్లేలో భాగమయ్యారు. ఓటీటీలో ఎప్పుడంటే.. మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. #TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥 All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎 Our Starboy 🌟 shattering records all over! 🤘 - https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4 — Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024 -
ఫోటో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఆమె ఎవరో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి. మన పక్కింటి పిల్లలా సరదాగా మనందరిలో కలిసిపోయిందీ అమ్మాయి. 'ప్రేమమ్'తో పరిచయమై తెలుగువారి ప్రేమను గెలుచుకుంది. తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో దాగి ఉన్న మరో టాలెంట్ను ప్రేక్షకులకు చూపించింది. సినిమా చూసిన వారందరూ లిల్లీ పాప దుమ్మురేపింది రా.. అంటూ కామెట్లు చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన అమ్మగారు అయిన సునీత ఫోటోను షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 3) సునీత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అనుపమ శుభాకాంక్షలు తెలిపింది. అనుపమ మాదిరే సునీత కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే ఏకంగా అత్తమ్మా.. హ్యాపీ బర్త్డే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త అని మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో పుట్టిన అనుపమ.. ఇంటర్ వరకు మాత్రమే చదివి సినిమాల మీద ఆసక్తితో వెండితెరపై అడుగుబెట్టి విజయం సాధించింది. నాన్న పరమేశ్వరన్, అమ్మ సునీత, సోదరుడు అక్షయ్ ఉన్నారు. తన బలం అమ్మే అంటూ చెబుతున్న అనుపమ అప్పడప్పుడు ఆమెను ఆటపట్టిస్తుంది కూడా.. ఒక్కోసారి పలు కార్టూన్స్తో తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనుపమకు నేడు తన అమ్మగారి పుట్టినరోజు కావడంతో తన ఆనందం డబుల్ అయిందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
టిల్లుతో మ్యాజిక్ సక్సెస్ : లిల్లీ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)