-
పట్టు వదలకుండా..!
అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్ట్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్. -
పాలిటిక్స్ లోకి విజయ్.. స్పీడ్ పెంచిన అజిత్
-
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో టచ్లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
గుడ్ బ్యాడ్ సెట్లో...
అజిత్ కుమార్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అజిత్ కుమార్తో తమ కొత్తప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లోని ఓ స్టూడియోలోప్రారంభమైంది.ఈ కీలక షెడ్యూల్ కోసం ఓ సెట్ని తీర్చిదిద్దారు. అజిత్తో పాటు కీలక పాత్రధారులు ఈ షూట్లో పాల్గొంటున్నారు. ‘‘ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ప్రాజెక్ట్లలో ఒకటిగా రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అభినందన్ రామానుజం. -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే. -
సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా?
మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO — Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024 -
ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో.. అసలు కారణం ఇదే!
తమిళ స్టార్ హీరో గతేడాది తునివు(తెగింపు) చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ విడాయమర్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమా త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఇదిలా ఉండగా అజిత్ సడన్గా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ తమ హీరోకు అసలు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారంటూ సన్నిహితులు వెల్లడించారు. కానీ తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆయన నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని అజిత్ ప్రతినిధి సురేష్ చంద్ర తెలిపారు. అంతే కాకుండా బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అజిత్ సర్జరీ గురించి వచ్చిన కథనాలు అవాస్తవమని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు. Ajith sir's @VenusMotoTours now launched. Our best wishes and congratulations for the successful venture. | #AK #Ajith #Ajithkumar | #VidaaMuyarchi | pic.twitter.com/BK4vxVK412 — Ajith | Dark Devil (@ajithFC) October 5, 2023 -
ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!
సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. దీనికి తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త చిత్రమే ఉదాహరణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు అజిత్ ఇటీవల నటించిన తుణివు(తెగింపు) చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఆ తర్వాత చిత్రం గురించి ప్రకటించి కూడా చాలా నెలలు అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విడాముయిర్చి అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ లోగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) దీంతో ఇక మిగిలింది షూటింగ్ ప్రారంభించడమే అనుకున్నారు. అతే విడాముయిర్చి చిత్రానికి ఇంకా ముహూర్తం కుదరలేదు. అజిత్ బైక్ విదేశీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో విడాముయిర్చి చిత్రం ఆగిపోయిందనే ప్రచారం పెద్దఎత్తున వైరలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ చిత్రం ఆగిపోలేదని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత సుభాస్కరన్ ఇటీవల స్పష్టం చేశారు. హీరోయిన్ ఎవరు? ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మొదట నటి త్రిష నాయకిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వైదొలిగారనే ప్రచారం జోరందుకుంది. అలాగే మలయాళ నటి మంజు వారియర్ పేరు కూడా వినిపించింది. తాజాగా బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈమె ఇంతకుముందే అజిత్తో వలిమై చిత్రంలో నటించారు. చివరికీ హ్యుమా ఖురేషీ పేరన్న ఫైనల్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..) -
పుణెలో భారీ షూటింగ్ సెట్.. ఆ స్టార్ హీరో కోసమే!
అజిత్ చిత్రం ఇంతకుముందు నటించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత ఆయన చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచే విషయమే. అజిత్ తాజా చిత్రానికి విడా ముయర్చి అనే టైటిల్ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆది నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. (ఇది చదవండి: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?) ముందుగా నయనతార భర్త విఘ్నేష్శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన రాసిన స్క్రీన్ప్లే నచ్చలేదన్న కారణంతో చిత్రం నుంచి తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత అజిత్ భూటాన్, నేపాల్ దేశాల్లో బైక్ పర్యన చేసొచ్చారు. కాగా విడా ముయర్చి చిత్రానికి మగిళ్ తిరుమేణిని ఫిక్స్ చేశారు. దీంతో అజిత్ దర్శకుడు మగిళ్ తిరుమేణి కలిసి కథా చర్చలకోసం ఇటీవల లండన్లో మకాం పెట్టారు. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్కు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెలాఖరులో పూణేలో విడా ముయర్చి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకోసం అక్కడ భారీ సెట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఇందులో అజిత్ సరసన త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు అర్జున్దాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
త్రిష VS శ్రీలీల ఫుల్ డిమాండ్
-
కొత్త బిజినెస్ ప్రారంభించిన స్టార్ హీరో అజిత్
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొత్త రంగంలోకి అజిత్
తమిళ సినిమా: తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అన్ని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అజిత్ -
అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ ఫ్యాన్స్
-
రెస్టారెంట్లో చెఫ్గా మారిపోయిన స్టార్ హీరో.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది తునివు సినిమాతో సక్సెస్ అందుకున్న అజిత్ తర్వాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఈ స్టార్ హీరో నేపాల్లో చెఫ్గా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..అజిత్కు బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. రీసెంట్గా బైక్పై నేపాల్ వెళ్లిన ఆయన ఓ హోటల్లో చెఫ్ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా అక్కడ వంట చేస్తూ షాకిచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంత సింపుల్గా ఉండటం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అజిత్ వచ్చారని తెలిసి చుట్టుపక్కల ప్రజలు పెత్త ఎత్తున ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. Recent Ajith Kumar sir cooking Nepal hotel🤩🔥#RIDEformutualrespect #AjithKumar #Ak62 #Thala More exclusive video only on Ajithkumar_samrajyam follow now ❤️ pic.twitter.com/Sk3gyodxip — Ajithkumar_Samrajyam (@Ak_Samrajyam) April 24, 2023 -
అందుకే అజిత్ సినిమా నుంచి తొలిగించారు: విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అజిత్ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అజిత్ 62వ సినిమా రాబోయే ప్రాజెక్ట్కు ఎన్నికైన విఘ్నేశ్ శివన్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంతవరకు అజిత్ కానీ విఘ్నేశ్ శివన్ నుంచి క్లారిటీ లేదు. నయన్ కూడా దీనిపై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తన భర్తను అవమానించినందుకు నయన్ హర్ట్ అయ్యిందని, ఇకపై అజిత్తో నటించనని ఆమె నిర్ణయించుకుందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. చదవండి: పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే దీంతో ఈ విషయంలో అంతా అజిత్ని తప్పుబట్టారు. అజిత్కు స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందంటూ కోలీవుడ్ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ సినిమా నుంచి తప్పుకోవడంపై మొదటిసారి విఘ్నేశ్ శివన్ పెదవి విప్పాడు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AK62 ప్రాజెక్ట్ నిలిచిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. తన స్కిప్ట్ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తనని తప్పించారన్నాడు. చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు ఇందులో అజిత్ తప్పులేదని, తాను రాసిన స్క్రిప్ట్ ఆ మూవీ నిర్మాణ సంస్థకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్ట్కు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్న అన్నాడు. అంతేకాదు ఒక అభిమానిగా అజిత్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తానంటూ విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. కాగా అజిత్ - విఘ్నేశ్ శివన్ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ గతేడాది ప్రకటించింది. అజిత్ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది. -
నయన్ భర్త అవుట్.. ఏకే 62 మూవీకి ముహుర్తం ఫిక్స్
తమిళసినిమా: నటుడు అజిత్ చివరిగా నటించిన తుణివు చిత్రం గత ఏడాది దీపావళికి తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఆయన నటించనున్న చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కారణం దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నశ్ శివన్ దర్శకత్వంలో లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కూడా ఫిక్స్ అయ్యారు. చిత్ర ప్రీ పొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే చివరి సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఆయన కథను పూర్తిగా రెడీ చేయకపోవడమేనని సమాచారం. దీంతో ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. అయితే చిత్రం ఎప్పుడు సెట్ పైకి వెళ్తుందనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ఈ మధ్యలో నటుడు అజిత్ బైక్పై విదేశీ ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా ఇటీవల అజిత్ తండ్రి కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ షూటింగ్లో పాల్గొడానికి మరింత సమయం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అజిత్ నటించనున్న 62వ చిత్రం ప్రారంభానికి ముహూర్తం కరారైనట్లు తెలిసింది. ఏప్రిల్ నెలలో ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి మే నుంచి షూటింగ్ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వేలువడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. చదవండి: సీక్రెట్గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్ ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ అజిత్కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు -
విడాకుల రూమర్స్పై స్పందించిన స్టార్ కపుల్!.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ కపుల్స్లో అజిత్-షాలిని ఒకరు. అయితే కొద్దిరోజులుగా వీరికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 22ఏళ్ల అజిత్-షాలినిల వివాహ బంధంలో కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయని, త్వరలోనే వీరి విడాకులు తీసుకోనున్నారంటూ కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. దీంతో బెస్ట్ కపుల్స్గా ఉన్న అజిత్-షాలినిలు విడిపోవడం ఏంటని అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న ఈ రూమర్స్కి అజిత్-షాలినిలు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవలె అజిత్తో ఉన్న వరుస ఫోటోలను షాలిని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తాజాగా ఓ వెకేషన్కు సంబంధించి భర్తతో కలిసి ఉన్న పిక్స్ని పోస్ట్ చేసి పరోక్షంగా దీనిపై స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా అజిత్-షాలినిల విడాకుల ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అజిత్ ‘తునీవు'(తెగింపు) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
షాలినితో పెళ్లి వద్దని అజిత్కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్!
కోలీవుడ్లోని ప్రముఖ జంటల్లో అజిత్ కుమార్-షాలిని ఒకరు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన షాలిని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గానూ నటించింది. ఈ క్రమంలో అమర్కలం(1999) మూవీలో తొలిసారిగా అజిత్తో జోడీ కట్టింది. నిజానికి ఈ సినిమా చేయడానికి మొదట షాలిని ఒప్పుకోలేదు. తాను చదువుకోవాలని కాబట్టి ఈ సినిమా చేయలేనని చెప్పేసింది. దీంతో నిర్మాతలు హీరోనే రంగంలోకి దిగమని సూచించారు. అలా అజిత్ తనగురించి పరిచయం చేసుకుంటూ ఆమెతో కలిసి పనిచేయాలని ఉందంటూ చాలాసేపు తనను ఒప్పించే ప్రయత్నం చేసి చివరకు సఫలమయ్యాడు. ఈ సినిమా షూటింగ్లో అజిత్ అనుకోకుండా ఆమె మణికట్టుకు గాయం చేయడం, తరచూ తన పరిస్థితి గురించి ఆరా తీసే క్రమంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా రిలీజైన మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే అప్పట్లో అజిత్తకు షాలినిని పెళ్లి చేసుకోవద్దని సూచించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా. జనాలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు, ఆ షాలినిని పట్టించుకోవద్దు అని చెప్పాడట. కానీ అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం రమేశ్కు తెలియదు. దీంతో మరో డైరెక్టర్ శరణ్.. హీరోకే వార్నింగ్ ఇస్తున్నావు, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి అని హెచ్చరించాడట. అప్పుడు కానీ రమేశ్కు వారు ప్రేమలో ఉన్నారని తెలిసిరాలేదు. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 24న జరిగిన అజిత్ పెళ్లికి కూడా వెళ్లి దంపతులను ఆశీర్వదించాడు. ఇక పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే! -
డైరెక్టర్కు ఆ కండిషన్ పెట్టిన అజిత్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన చిత్రం నుంచి తొలగించారు. ఆయన కథను పూర్తిగా సిద్ధం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కాగా ఇప్పుడు ఆయన స్థానంలోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. నిజం చెప్పాలంటే ఈయన పేరును కూడా చిత్ర వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాగా అజిత్ నటించే నూతన చిత్రం షూటింగును మార్చి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో అజిత్ జంటగా నటించే నటి ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో ప్రతి నాయకుడిగా అరుణ్ విజయ్, ముఖ్యపాత్రల్లో అధర్వ, బిగ్ బాస్ కవిన్, జాన్ కెక్కెన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా దీనికి అనిరుధ్ సంగీతాన్ని, నీరవ్ షా చాయాగ్రహణం అందించనున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్ను మూడు నెలల్లో పూర్తిచేయాలని దర్శకుడికి అజిత్ నిబంధన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు లేదా మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తుణివు చిత్రంలో అజిత్ పాత్ర పేరు బ్లాక్ డెవిల్. దీంతో అందులోని డెవిల్ పేరును తన 62వ చిత్రానికి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అజిత్ సినిమాలో విలన్గా పాపులర్ హీరో
అజిత్ లేటెస్ట్ మూవీ తుణివు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టార్ హీరో తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి కథతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్కు, నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో ఆయన్ను తప్పించి మగిళ్ తిరుమేణిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ నటించనున్నారట. గతంలో వీరిద్దరు కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎన్నై అరిందాల్ అనే చిత్రంలో నటించారు. అందులో అజిత్ పోలీసు అధికారిగా, అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్ 62వ సినిమాలో కూడా అరుణ్ విజయ్ ఢీ కొనబోతున్నారన్నమాట.