-
అజిత్ సినిమాలో విలన్గా పాపులర్ హీరో
అజిత్ లేటెస్ట్ మూవీ తుణివు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టార్ హీరో తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి కథతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్కు, నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో ఆయన్ను తప్పించి మగిళ్ తిరుమేణిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ నటించనున్నారట. గతంలో వీరిద్దరు కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎన్నై అరిందాల్ అనే చిత్రంలో నటించారు. అందులో అజిత్ పోలీసు అధికారిగా, అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్ 62వ సినిమాలో కూడా అరుణ్ విజయ్ ఢీ కొనబోతున్నారన్నమాట. -
షాకింగ్.. అజిత్ అభిమాని ఆత్మహత్య , థియేటర్లోకి అనుమతించలేదనే..!
తమిళసినిమా: నటులపై హద్దులు మీరిన అభిమానం ప్రాణాలను బలిగొంటోంది. పొంగల్ సందర్భంగా విజయ్ నటించిన వారిసు, అజిత్ నటించిన తుణివు చిత్రాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అవి ఆ హీరోల అభిమానుల్లో పోటీ తత్వాన్ని పెంచేశాయి. దీంతో ఆ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలు అంటూ రచ్చరచ్చ చేశారు. భరత్ అనే అజిత్ అభిమాని ఒకరు లారీపైకి ఎక్కి డాన్స్ చేస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా అజిత్ మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు చూస్తే తూత్తుక్కుడికి చెందిన వీరబాహు అనే వ్యక్తి అజిత్ వీరాభిమాని. ఇతను గురువారం తుణివు చిత్రాన్ని తన కుటుంబసభ్యులతో కలిసి చూడడానికి థియేటర్కు వెళ్లాడు. అయితే ఇతను మద్యం తాగి ఉండటంతో థియేటర్ సిబ్బంది అతన్ని థియేటర్లోకి అనుమతించలేదు. మద్యం తాగాడని అవమానకరంగా మాట్లాడి కుటుంబసభ్యులను మాత్రమే థియేటర్లోకి అనుమతించారు. తనను చిత్రాన్ని చూడడానికి అనుమతించకపోగా తన కుటుంబసభ్యుల ముందే అవమానించడాన్ని భరించలేక వీరబాహు ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అజిత్ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్గా ఉంచారా?
నటుడు అజిత్ తన వయసుకు దగ్గ పాత్రలో నటించడం ప్రారంభించి చాలా కాలమైంది. ఆయనకు జతగా నటించే హీరోయిన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమధ్య వివేకం చిత్రంలో కాజల్ అగర్వాల్, విశ్వాసం చిత్రంలో నయనతార, వలిమై చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి అజిత్ సరసన నటించారు. తాజాగా విడుదలైన తుణివు చిత్రంలో మలయాళ భామ మంజువారియర్ నటించారు. వీళ్లందరూ వయసులో సీనియర్ నటీమణులే అనేది గమనార్హం. కాగా తుణివు చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కారణం పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉండడమే. ముందుగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతో ఆమె నటించడం లేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. అదేవిధంగా ఇటీవల నటి ఐశ్వర్యరాయ్ అజిత్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నటి సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరి పేరు ఇప్పటివరకు చిత్ర వర్గాలు ప్రకటించలేదు. చిత్రం షూటింగ్ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు అసలు హీరోయిన్ ఎంపిక చేశారా, చేస్తే ఆ విషయాన్ని సస్పెన్స్గా ఉంచారా? అనే చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. -
వారిసు, తునివు థియేటర్ యాజమాన్యాలకు నోటీసులు
తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ చిత్రాల విడుదల చేసిన థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయ్ నటించిన వారిసు, అజిత్ తుణివు చిత్రాలు పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ముఖ్యంగా 11, 12వ తేదీల్లో మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? అదేవిధంగా థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయరాదని, వాటికి పూజలు, పాలాభిషేకాలు వంటివి నిర్వహించరాదని, సినిమా టికెట్లను అధిక రేట్లకు విక్రయించకూడదని నిబంధనలు విధించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ థియేటర్ యాజమాన్యం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక ఆటలను ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లను బ్లాక్లో రూ.1000, రూ.2000 వరకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే థియేటర్ల ముందు అభిమానులు రచ్చ రచ్చ చేశారు. చదవండి: అల్లు అర్జున్కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం కాగా నటుడు విజయ్ నటించిన వారిసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు, అజిత్ నటించిన తుణివు రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇలాంటి అన్ని విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వారు సరైన వివరణ ఇవ్వకుంటే 1957లోని ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
‘తునివి’ థియేటర్ వద్ద అపశ్రుతి, అజిత్ ఫ్యాన్ మృతి
తమిళ స్టార్ అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంత కాదు. ఆయన తాజా చిత్రం తునివు(తెలుగులో తెగింపు) బుధవారం(జనవరి 11న) థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని అజిత్ భారీ కటౌట్ కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు మూవీ ఆడుతున్న థియేటర్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. చదవండి: ఆర్యన్ ఖాన్తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి ఈ రోజు తెల్లావారు జామున వేసిన స్పెషల్ షోలో అత్యుత్సాహంతో ఓ అభిమానికి ప్రాణాలు కోల్పొయాడు. వివరాలు.. తునివు స్పెషల్ షో ఈ రోజు ఉదయం తెల్లావారు జామున ఒంటి గంటలకు వేశారు. ఈ షో చూసేందుకు భారీ అభిమానులు థియేటర్కు వచ్చారు. అందులో భరత్ కుమార్(19) అనే అజిత్ వీరాభిమాని చెన్నైలోని కోయంబేడ్ రోహిణి థియేటర్కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. ఇక షో అయిపోయాకు అభిమానులంతా థియేటర్ ముందు కేకలు వేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. చదవండి: అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్ అలా ఫ్యాన్స్ అంతా రోడ్డు పైకికు అజిత్ పేరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యుత్సాహంతో ఉన్న భరత్ అక్కడ మెల్లిగా కదులుతున్న నీళ్ల ట్యాంకర్ లారీ ఎక్కాడు. దానిపైకి ఎక్కి అజిత్ పేరు గట్టిగా అరుస్తూ డాన్స్ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో అతడు లారీ మీద నుంచి కింద పడ్డాడు. అతడి శరీరాం నేలకు గట్టిగా తగడంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన భరత్ కుమార్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా భరత్ మృతి చెందాడు. -
అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్
పొంగల్కు విడుదలవుతున్న వారీసు, తుణివు చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలు బుధవారం తెరపైకి రానున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యం స్పెషల్ షోలకు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా అజిత్ నటించిన తుణివు చిత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆటల ప్రదర్శనకు, విజయ్ చిత్రం వారీసు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ చిత్రాలకు ప్రభుత్వం 11, 12 తేదీల వరకే స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చింది. ఆ తరువాత పండుగ సందర్భంగా 13 నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి ప్రత్యేక ఆటలకు అనుమతి లేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా థియేటర్ల ముందు భారీ కటౌట్లును ఏర్పాటు చేయడం, పాలాభిõÙకాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.7 లక్షలతో అజిత్ కటౌట్ తమ అభిమాన నటులను ఆరాధించడం సహజమే. కర్ణాటకకు చెందిన నటుడు అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున తుణివు చిత్రంలోని కటౌట్ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అజిత్ వర్సెస్ విజయ్.. సూపర్స్టార్ ఎవరు? కోలీవుడ్లో ఫ్యాన్స్ రచ్చ
తమిళసినిమా: సూపర్స్టార్ ఎవరన్న విషయంపై కోలీవుడ్లో పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ కథానాయకుడిగా వారిసు చిత్రాన్ని నిర్మించిన దిల్రాజు విజయ్కు అజిత్ కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉందని, ఆయనే నంబర్వన్ అని ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. అదే వేదికపై నటుడు శరత్కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తు సూపర్స్టార్ విజయ్ అని తాను సూర్యవంశం విజయోత్సవ వేదికపైనే చెప్పానని.. అది నిజమైందని పేర్కొన్నారు. అది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో డిబేటింగ్ వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నంత వరకు ఆయనే సూపర్స్టార్ అని సీనియర్ నటుడు, నిర్మాత కె.రాజన్ పేర్కొన్నారు. నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మాత్రం నేటి సూపర్స్టార్ విజయ్ అని తెలిపారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయమై నటుడు శరత్కుమార్ ఒక చానల్లో మాట్లాడుతూ.. తాను విజయ్ సూపర్స్టార్ అని సంబోధించానే కాని రజనీకాంత్, అజిత్ సూపర్స్టార్లు కాదని చెప్పలేదన్నారు. రజనీకాంత్తో పాటు అజిత్, అమితాబచ్చన్, షారూక్ఖాన్ వీళ్లంతా సూపర్స్టార్లేనని శరత్కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా సూపర్స్టార్ అన్నది ఒక టైటిల్ కాదని పేర్కొన్నారు. దీని గురించి ఇకపై వివాదం చేయాలన్న ఆలోచన లేదని, దీనిని వివరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అదే విధంగా తాను విజయ్ ముఖ్యమంత్రి అవుతారనో, మంత్రి అవుతారనో చెప్పలేదని, సూపర్స్టార్ అవుతారని చెప్పానని అన్నారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా సూపర్స్టార్లే అని పేర్కొన్నారు. సూర్యవంశం చిత్ర వేడుకలలో చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నానని, రియల్ సూపర్స్టార్ అంటే ఎప్పటికీ ఎంజీఆర్నే అని శరత్కుమార్ పేర్కొన్నారు. -
ఆ హీరో తుపాకీ కాల్చడం నేర్పించాడు : మంజు వారియర్
తమిళసినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దసరా, జీ సినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇందులో అజిత్ సరసన మలయాళీ స్టార్ నటి మంజు వారియర్ తొలిసారిగా నటించారు. అదేవిధంగా ఈమె తమిళంలో నటించిన రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు ధనుష్తో కలిసి అసురన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా తుణివు చిత్రంలో నటించిన అనుభవాన్ని మంజు వారియర్ ఒక భేటీలో పేర్కొంటూ ఈ చిత్రం కొత్త అనుభవమని పేర్కొన్నారు. ఇంతకుముందు అసురన్ చిత్రంలో చేసిన ప్రాత్రకు.. తుణివు చిత్రంలోని క్యారెక్టర్కు పోలికే ఉండదన్నారు. ఇందులో యాక్షన్ హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. కణ్మణి అనే యువతిగా ఒక చేతితో తుపాకీ కాల్చడం కష్టతరం కావడంతో హీరో అజిత్ నేర్పించారన్నారు. తాను ఇంతకుముందు అనేక చిత్రాల్లో నటించాను కానీ, యాక్షన్ పాత్రలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అసురన్ చిత్రం తరువాత మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తుణివు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. కథ నచ్చడంతోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అసురన్ చిత్రంలోని పచ్చయమ్మాళ్ పాత్రను ప్రేక్షకులు ఎలా ఆదరించారో ఈ చిత్రంలోని కణ్మణి పాత్రను కూడా అలాగే ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. -
పొంగల్ బరిలో అగ్ర హీరోలు .. డిస్ట్రిబ్యూటర్లకు కొత్త చిక్కులు
తమిళ అగ్రహీరోలు విజయ్, అజిత్ చిత్రాల మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొంది. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నటి రష్మిక మందన్నా కథానాయకి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తునివు. మలయాళ నటి మంజు వారియర్ హిరోయిన్గా చేసిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. జి.సినిమా సంస్థతో కలిసి బోనీకపూర్ నిర్మించారు. దీనికి అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొంగల్ బరిలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నాయి. వారిసు కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రంగా ఉంటుందని ఆ చిత్ర వర్గాలు చెబుతుంటే, తునివు చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు రావడం సహజమే అయినా, అజిత్, విజయ్ ఇద్దరికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడం, నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా భావించడం, వీరి చిత్రాల మధ్య అంచనాలు వీటికి కారణాలుగా చెప్పొచ్చు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర విడుదల హక్కులను నటుడు, నిర్మాత, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. ఒకేరోజు రెండు చిత్రాలు విడుదల..! విజయ్ వారిసు చిత్రాన్ని చెన్నై, కోయంబత్తూర్, ఉత్తర ఆర్కాడ్, దక్షిణ ఆర్కాడ్ ఏరియాల్లో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థనే విడుదల చేయనుంది. మిగిలిన ఏరియాలను మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్ విడుదల చేయనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ రెండు చిత్రాలను ఒక రోజు అటు ఇటుగా విడుదల చేస్తారని డిస్టిబ్యూటర్లు భావించారు. వారిసు చిత్రాన్ని 12వ తేదీ విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో తునివు చిత్రాన్ని 11వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు వారిసు చిత్రాన్ని కూడా 11వ తేదీ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈగో కారణంగానే ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. విజయ్ చిత్రం ఆడియో ఆవిష్కరణను ఇటీవల చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ జనవరి ఒకటో తేదీ దీన్ని ప్రసారం చేసింది. ఆ తర్వాత చిత్ర ట్రైలర్ను కూడా విడుదల చేశారు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు చేయలేదు. అంతేకాదు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. తలలు పట్టుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు దీనికి అజిత్ మేనేజర్ మంచి చిత్రానికి పబ్లిసిటీ అవసరం లేదంటూ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. అయితే తునివు చిత్ర ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఊర మాస్గా ఉన్న ఈ చిత్రం ట్రైలర్ అజిత్ అభిమానులకు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది. దీంతో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా తుణివు చిత్ర ట్రైలర్, వారిసు చిత్రం కంటే ఎక్కువ లైకులు పొందుతోందంటూ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వారిసు, తునివు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతుండడంతో ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు కేటాయించాలి, దేనికి మార్నింగ్ షోలు వేయాలి? ఏ హీరో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అని డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ చిత్రాల విడుదల విషయంలో సినిమా పెద్దలు చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారిసు, తునివు చిత్రాల టికెట్లను రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్లో విక్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం టికెట్ రూ.190కి మించరాదని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు చిత్రాలు మరో నాలుగు రోజుల్లో భారీ అంచనాల మధ్య తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. మరి ఏ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోందో వేచి చూడాల్సిందే. -
త్రిషకు షాక్! తెరపైకి కాజల్ అగర్వాల్?
సినిమా రంగంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నటుడు అజిత్ కొత్త చిత్రం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం. ఈయన కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్కు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తన 62వ చిత్రానికి అజిత్ రెడీ అవుతున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇందులో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అజిత్, నయనతారలది హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట నటించి మెప్పించింది. ఆ విషయం పక్కన పెడితే అజిత్ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. దీంతో కాజల్ అగర్వాల్ ఎంపిక చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్తో జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, కమలహాసన్ సరసన ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. -
తెగింపు క్లైమాక్స్పై అదిరిపోయే బజ్! ఆడియన్స్కి థ్రిల్లింగ్ ఎక్స్పిరియన్స్ ఖాయం..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘తునివు’. ఇటీవల నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెగింపు పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్లోన యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో మూవీలోని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ అజిత్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు సినీ విశ్వేషకులు. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్ ఎలా ఉందంటే! ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. మూవీలోని క్లైమాక్స్ ఎవరూ ఊహించిన రేంజ్లో ఉండబోతుందట. ఆడియెన్స్ను సీట్లకు అతుక్కుపోయేలా థ్రిలింగ్ ఎలిమెంట్స్తో క్లైమాక్స్ను డిజైన్ చేశాడట డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమా మొత్తంలో హీరో అజిత పేరు ఎక్కడా రివీల్ చేయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతుందట. క్లైమాక్స్లో ఉండే యాక్షన్స్ సీన్స్, అదే సమయంలో హీరో రోల్ బయటపడటం అంతా ఆడియన్స్కి ఓ థ్రిల్లింగ్ ఎక్స్పిరియన్స్ ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ రిలీజ్ డేట్ వరకు వేచి చూడాల్సిందే. చదవండి: స్టేజ్పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్, వీడియో వైరల్ -
అజిత్ కూతురు అనౌష్కను చూశారా? ఎంత అందంగా తయారైందో!
తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అజిత్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇండస్ట్రీలో ఆయనకు వివాదా రహితుడు. పొగడ్తలైన, విమర్శలనై ఒకేలా తీసుకుంటూ తన పనేంటో తాను చూసుకుంటాడు. ఇక తన పని తర్వాత అజిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది కుటుంబానికే. హీరోగా ఎంత బిజీగా కుటుంబానికి ఎప్పుడు సమాయాన్ని కెటాయిస్తాడు. చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ముఖ్యంగా పండుగలు, పుట్టిన రోజు వేడుకుల, స్పెషల్ డేస్ అసలు మిస్ అవ్వడు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. అయితే అజిత్ కుటుంబం విషయంలో చాలా గోప్యత పాటిస్తాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషమాలను, కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయమైన బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలతో న్యూ ఇయర్ను కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. భార్య షాలిని, కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్లతో కలిసి విదేశాల్లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఇందులో అజిత్ కూతురు అనుష్క స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కనిపించి షాకిచ్చింది. మీడియాకు, సోషల్ మీడియా దూరంగా ఉండే అజిత్ కూతురు సడెన్గా ఇలా కనిపించడంతో ఆమె హాట్టాపిక్గా నిలిచింది. దీంతో ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాల్లోకి ఎప్పుడు ఇస్తుంది? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ View this post on Instagram A post shared by வீர சென்னை (@ajithkumar_fansclup) -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న అజిత్ 'చిల్లా చిల్లా' సాంగ్
తమిళసినిమా: రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి స్టార్హీరోల చిత్రాల్లో ప్రేక్షకులకు ఎంతో కొంత ఏదో ఒక సందేశం ఉంటుంది. అయితే ఈ తరం ప్రేక్షకులకు సందేశాలు, సూచనలు నచ్చడం లేదు. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా, సరదాగా సాగే చిత్రాలనే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు హెచ్.వినోద్ గ్రహింనట్లున్నారు. అల్టీమేట్ స్టార్ అజిత్కు ఈయన ఇంతకుముందు నేర్కొండ పారై్వ, వలిమై చిత్రాలను చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నా, ఎంటర్టెయిన్మెంట్ అంశాల లోపం కనిపిస్తుంది. కాగా తాజాగా ముచ్చటగా మూడోసారి అజిత్ కథానాయకుడిగా తుణివు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విధితమే. మలయాళ నటి మంజువారియర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ సినిమా సంస్థతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందింది. పొంగల్ సందర్భంగా విడుదలకీ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది సంగీత దర్శకుడు జిబ్రాన్కు 50వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ పాడిన సల్లా సల్లా అనే పాటను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారింది. తుణివు చిత్రం గురిం దర్శకుడు హెచ్.వినోద్ తాజాగా చెప్పిన విషయం ఇందులో ఎలాంటి సందేశాలు ఉండవన్నారు. ఓన్లీ మాస్ అంశాలతో కూడిన ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంగా తుణివు ఉంటుందని పేర్కొన్నారు. -
హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా
చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోయిన్లుగా అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు. దివంగత నటి శ్రీదేవి నుంచి ఎందరో నటీమణులు కథానాయికులుగా రాణించారు. రాణిస్తూనే ఉన్నారు. ఆ కోవలో తాజాగా నటి అనిఖా సురేంద్రన్ చేరింది. ఈ కేరళ కుట్టి 2007లోనే బాలతారగా పరిచయమైంది. మలయాళం, తమిళం, తెలుగుభాషల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రంలో త్రిషకు కూతురుగానూ, విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతార కూతురుగానూ నటించి బాగా పాపులర్ అయ్యింది. కాగా 18వ ఏట అడుగుపెట్టిన అనిఖా హీరోయిన్గా అవకాశాలు కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందులో భాగంగా ఇటీవల సామాజిక మాధ్యమాలను బాగా వాడుకుంటోంది. తన గ్లామరస్ ఫొటోలను తరుచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ చిత్ర పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు జూనియర్ నయనతార అనే ముద్రవేసుకుంది. ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో బుట్టబొమ్మ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ సంగీత దర్శకుడు, నటుడు హిప్ హాప్ తమిళాకు జతగా నటించనుంది. మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన హిప్ హాప్ తమిళా ఆ తర్వాత నట్పేతునై, నాన్ సిరిత్తాల్, శివకుమారిన్ శపథం, అన్బరివు చిత్రాల్లో నటించారు. తాజాగా వెల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి అనిఖా సురేంద్రన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) చదవండి: మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! ఘనంగా నటి శ్రీవాణి గృహప్రవేశం వేడుక, నటీనటుల సందడి.. ఫొటో వైరల్ -
అభిమానులకు అజిత్ సూచన.. ‘నిజాయితీగా నడుచుకోండి..’
హీరో అజిత్ది సినీ రంగంలో ప్రత్యేక స్థానం. నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్న ఆయన వివాద రహితుడు. తానేంటో తన పని ఏంటో అన్నట్టుగా ఉంటారు. సినిమా రంగంలో జరిగే విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. తన చిత్రాల విషయంలో కూడా ఏ ఇతర చిత్రాలతో పోటీగా భావించరు. అదే విధంగా ఇతర స్టార్ నటుల మాదిరిగా అభిమాన సంఘాలను ఇష్టపడరు. అభిమాన సంఘాల పేరుతో తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని, తమ కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపుతూ జీవితంలో ఎదగాలని తన అభిమానులకు సూచిస్తారు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇళ్లు మారేవాళ్లం: రష్మిక అలాంటి అజిత్ చాలా కాలం తరువాత అభిమానుల కోసం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో అభిమానులను ఉద్దేశించి ‘మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే వారిని స్పూర్తినిచ్చే వారిని మీ చుట్టూ ఉంచుకోండి.. ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు, అనవసర విషయాల జోలికి పోకండి. మీ లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ ఉన్నత స్థాయికి చేరుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. ఇది మంచి వాళ్ల కాలం. నిజాయితీగా నడుచుకోండి. మీలోని ప్రతిభను చాటుకోండి. మంచిగా జీవించండి.. జీవించనీయండి’ అని అజిత్ పేర్కొన్నారు. అయితే ఆయన సడన్గా ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేస్తోంది. అదే విధంగా నటుడు విజయ్ హీరోగా నటించిన వారీసు చిత్రం కూడా అదే సమయానికి తెరపైకి రాబోతుంది. సాధారణంగా వీరి సినిమాలు వేర్వేరు తేదీల్లో విడుదలైతేనే వారి అభిమానులు రచ్చ.. రచ్చ చేస్తారు. అలాంటిది చాలా కాలం తరువాత విజయ్, అజిత్ నటించిన చిత్రాలు ఒకేసారి తెరపైకి రాబోతున్నాయి. దీంతో ఎలాంటి గొడవలు జరగకూడదని అజిత్ తన అభిమానులకు ఇలాంటి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. pic.twitter.com/gt9iOY20z7 — Suresh Chandra (@SureshChandraa) November 17, 2022 -
లక్కీ చాన్స్ కొట్టేసిన త్రిష.. ఆ ఇద్దరు స్టార్లతో మరోసారి..
మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న నటి త్రిష ఇటీవల సరైన సక్సెస్ లేక సతమతం అయ్యింది. అయితే తాజాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీచార్జి అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రంలో కుందవై యువరాణిగా ఎంతో హూందాగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇదంతా దర్శకుడు మణిరత్నం చలవే అని చెప్పక తప్పదు. త్రిష తాజాగా ది రోడ్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా ఇప్పుడు మరో రెండు భారీ అవకాశాలు ఈ అమ్మడి తలుపులు తట్టినట్టు తెలుస్తోంది. దళపతి విజయ్ సరసన గిల్లీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష తాజాగా మరోసారి ఆయనతో జతకట్టే అవకాశం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విజయ్ 67వ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కథా నాయకిగా నటి త్రిష నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా మరో లక్కీఛాన్స్ కూడా ఈ భామను వరించనున్నట్లు తాజా సమాచారం. విజయ్కు పోటీగా భావించే నటుడు అజిత్ 62వ చిత్రంలో త్రిషను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అజిత్ ప్రస్తుతం తన 61వ చిత్రం తుణివులో నటిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించనున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. ఇందులో నాయకిగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి త్రిష పేరు వినిపిస్తోంది. అజిత్కు జంటగా ఈ బ్యూటీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
గుడియాత్తంలో ప్రేమికుల ఆత్మహత్య?.. రీట ఇంటి సమీపంలో వ్యవసాయబావిలో
సాక్షి, చెన్నై: వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా నెల్లూరు జిల్లా పేటకు చెందిన వెంకటేశన్ కుమారుడు అజిత్కుమార్(26) పాల వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి శెట్టికుప్పం కాలియమ్మన్ ఆలయం వెనుక ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అజిత్కుమార్ చెప్పులు, సెల్ఫోన్ కుంట సమీపంలో ఉండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె రీట(22) కాట్పాడిలోని ఓ ప్రైవేటు టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నెల్లూరు పేట పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా ఉంది. ఇదిలా ఉండగా రాత్రి 2 గంటల సమయంలో రీట ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్) -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే.. -
హైదరాబాద్లో ప్రత్యేకంగా అజిత్ను కలిసిన ఆది, అందుకేనా?
యంగ్ హీరో ఆది పినిశెట్టి, స్టార్ హీరో అజిత్ను కలిసిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్లో ఉన్న అజిత్ను ప్రత్యేకం ఆది కలవడం అందరిని ఆలోచనలో పడేసింది. దీంతో ప్రస్తుతం ఇది పరిశ్రమలో హాట్టాపిక్గా నిలిచింది. ఆది ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మరి అజిత్ను కలవడం వెనక ఏదైన అంతర్యం ఉందా?, ఇద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ విషయమై కలుసుకున్నారా? అంటూ కొందరు చర్చించుకుంటుండగా.. మరికొందరు ఈ మే 18న ఆది పెళ్లి సందర్భంగా ఆయనను ఆహ్వానించేందుకు కలిసి ఉంటాడని అభిప్రాయ పడుతున్నారు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఏదేమైనా వీరిద్దరు కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేంలో చూసిన వీరి ఫ్యాన్స్ ఆది-అజిత్లు కలిసి ఓ మల్టిస్టార్ సినిమా చేస్తే బాగుంటుందంటూ వారి మనసులోని మాటను బయటపెడుతున్నారు. కాగా ఆది మార్చి 24న తన ప్రియురాలు, హీరోయిన్ నిక్కీ గల్రానీని సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరి పెళ్లి తేదీపై ఈజంట ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చదవండి: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్ కానీ ఈ నెల 18వ తేదీన ఈ జంట వివాహనికి ముహుర్తం ఫిక్స్ అయ్యిందంటూ తమిళ మీడియా తమ వెబ్సైట్లో కథనాలు రాసుకొస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ప్రస్తుతం అజిత్ తన తాజా చిత్రం ఏకే61 మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్లనే ఉంటున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
కాలేజీ ప్రొఫెసర్గా మారనున్న అజిత్!
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇంతకు ముందు ఈయన కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన బోనీ కపూర్, జి.స్టూడియోస్ సంస్థ మళ్లీ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. గత చిత్రాల దర్శకుడు హెచ్.వినోద్నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అజిత్ ఇందులో కాలేజీ ప్రొఫసర్గా నటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇందులో ఆయనకు జంటగా నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలిసింది. బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా కోలీవుడ్లో రీ ఎంట్రీ కానుందన్న మాట. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ టబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈమె అజిత్ సరసన చాలా కాలం క్రితం కండుకొండేన్ చిత్రంలో నటించారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఇప్పటికే ఈ చిత్రం కోసం రెండు పాటలను రికార్డ్ చేశారట. ఈ చిత్ర ప్రారంభోత్సవ దృశ్యాలను నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్టైం పబ్లిక్గా..
ఓ సౌత్ స్టార్ కపుల్ రొమాంటిక్ డేట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి రోజు సందర్భంగా ఈ కపుల్స్ పబ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్ హీరో భార్య షేర్ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకి ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు అజిత్-షాలినిలు. సోమవారం వారి 23వ పెళ్లి రోజు సందర్భంగా అజిత్, షాలినిలు రొమాంటిక్ డిన్నర్ డేట్కు వెళ్లారు. చదవండి: సీక్రెట్ రివీల్ చేసిన హెబ్బా పటేల్ అక్కడ బ్లూ లైట్లో డాన్స్ చేస్తూ అజిత్ భార్య షాలికి వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటో చూసిన వారి ఫ్యాన్స్ మురిసిపోతూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ ఫొటోలో అంత ప్రత్యేకత ఏం ఉందంటే.. పెళ్లైన తర్వాత ఇలా వీరిద్దరూ ఇలా కనిపంచడం తొలిసారి. అజిత్ హీరోగా ఎంత బిజీ ఉన్న ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాడు. స్టార్ హీరో అయిన అజిత్.. కుటుంబం, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇష్టపడడు. పిల్లలు, భార్యతో అజిత్ పబ్లిక్లోకి రావడం చాలా అరుదు. చదవండి: హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే! షాలిని, అజిత్లది ప్రేమ పెళ్లి అయినప్పటికీ వీరిద్దరూ ఇలా ఎన్నడూ క్లోజ్గా కనిపించింది లేదు. వారి 23 ఏళ్ల వైవాహిక బంధంలో ఈ దంపతులు రొమాంటిక్ డేట్ రావడం, ఆ ఫొటోలు షేర్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫొటో ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వారిద్దరూ జంటగా నటించిన ‘అద్భుతం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం షాలిని సినిమాలకు గుడ్బై చెప్పి గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. View this post on Instagram A post shared by Shamlee (@shamlee_official) -
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నయనతార!
Nayanthara To Pair Up With Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇటీవలె వలిమై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట కాసుల వర్షం కురిపించింది. దీని తర్వాత ఆయన డైరెక్షన్లోనే అజిత్ మరో సినిమా చేయనున్నాడు. అనంతరం అజిత్ మరో మూవీని కూడా లైన్లో పెట్టేశాడు. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాకొ ఓకే చెప్పారు. ఇందులో హీరోయిన్గా నయనతారని తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక గతంలో అజిత్, నయన్ కాంబినేషన్ లో వచ్చిన ‘బిల్లా , ఆగన్, ఆరంభం, విశ్వాసం’ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు : నిర్మాత
నటుడు అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని నటుడు, నిర్మాత ఆర్కే సురేష్ అన్నారు. ఆదివారం చెన్నైలో మాయన్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఉండేవారే ఇక్కడి వారిని విమర్శిస్తున్నారని, అజిత్ నటించిన వలిమై చిత్రం గురించి కొందరు తీవ్రంగా విమర్శలు చేశారన్నారు. తప్పులను ఎత్తి చూపించవచ్చని, నటుడు అజిత్ గురించి మాట్లాడే అర్హత వారెవరికీ లేదన్నారు. సోషియే ఫాంటసీ కథా చిత్రంగా రూపొందిన మాయాన్ చిత్రాన్ని చూసి రాజమౌళి చిత్ర దర్శకుడు రాజేష్ను అభినందించారని అన్నారు. ఈ సినిమాను తమిళనాడుకు చెందిన మలేషియా వాసి డత్తో గణేష్ నిర్మింస్తుండగా రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వినోద్ మోహన్, బిందు మాధవి, ప్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. గూగుల్ కుట్టప్ప ట్రైలర్ ఆవిష్కరణలో సురేష్ -
ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్.వినోద్ తెరకెక్కించిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ కన్నడ, మలయాళంలో రిలీజైన వలిమై.. తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. చదవండి: స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు ఇదిలా ఉంటే ఇప్పుడు వలిమై ఓటీటీలో సైతం సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 25 నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ డీల్కు డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో పుష్ప మూవీ కూడా ప్రాంతాల వారీగా ఒక్కో తేదీలలో స్ట్రీమింగ్ చేయగా.. వలిమై కూడా తమిళంలో కొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో అజిత్కుమార్?
తమిళ స్టార్ హీరో అజిత్కుమార్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలా అంటూ అభిమానులు ఆయన్ను ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. కోలీవుడ్లో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోగా అజిత్కు పేరుంది. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటివలి కాలంలో ఈ వార్తలు మరింత ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అజిత్.. ప్రత్యేకంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర ట్విట్టర్ ద్వారా వివరించారు. అజిత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని కోరారు. "Mr Ajith kumar has got no intentions of venturing into politics and hence humbly requests the respected members of the media to refrain from encouraging such misleading informations".https://t.co/vILUFO8HCI — Suresh Chandra (@SureshChandraa) March 1, 2022