-
బర్ఖా సింగ్పై కాంగ్రెస్ పార్టీ వేటు
న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్పై ఆ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా బర్ఖా సింగ్ నిన్న (గురువారం) ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పదవికి రాజీనామా చేసినా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని బర్ఖా సింగ్ పేర్కొన్న విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదని, స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలున్న పార్టీ అని తాను పార్టీ వదలనని ఆమె చెప్పారు. కాగా రాహుల్ గాంధీకి పార్టీ నడపడం చేతకాదని, ఆయన పార్టీ అధ్యక్షపదవికి పనికిరారని విమర్శలు చేయడంతో క్రమశిక్షణా రాహిత్యం కింద బర్ఖా సింగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మరోవైపు బర్ఖా సింగ్ వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీ ఎందుకు దాక్కుంటున్నారు?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ కార్యకర్తల నుంచి ఎందుకు దాక్కుంటున్నారు? ఈ ప్రశ్న అడిగింది ఎవరో ప్రతిపక్ష నాయకులు కాదు.. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్. కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్ తదితరులపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులను అజయ్ మాకెన్ తిడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశ్నలు అడుగుతారన్న భయంతో ఆయన భయపడి దాక్కుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి రాహుల్ గాంధీ 'అన్ ఫిట్' అని చాలామంది అత్యంత సీనియర్ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ, యూత్ కాంగ్రెస్ మాజీ నాయకుడు అమిత్ మాలిక్ ఇప్పటికే పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోగా.. ఇప్పుడు బర్ఖా శుక్లా సింగ్ వంతు అయింది. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలా వరుసపెట్టి పెద్ద నాయకులంతా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతుండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మార్చి 28న నవరాత్రుల సందర్భంగా తాను, పలువురు మహిళా కార్యకర్తలు ఉపవాసంతో ఉండి రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించామని, కానీ ఆయన నవరాత్రులను పట్టించుకోరంటూ తమను ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా అక్కడివాళ్లు చెప్పారని బర్ఖా శుక్లా సింగ్ చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ తన పట్ల, ఇతర మహిళా నాయకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అదే విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ప్రియాంకా గాంధీ గురించి వినయ్ కతియార్ ఏమైనా అంటే వెంటనే దాన్ని తాము ఖండించాలని రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చేవని, కానీ తాము అజయ్ మాకెన్ తమను తిడుతున్నారని చెప్పినా ఆ విషయాన్ని మాకెన్తోనే తేల్చుకోవాలని చెప్పేవాళ్లని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసమే మహిళా సాధికారతను వాడుకున్నారని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో దుమారం: మహిళా నేత తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్దేవా పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా, నెట్టా డిసౌజాలు తనను మానసికంగా వేధించి, బెదిరించారని రచన బాంబు పేల్చారు. త్వరలో జరిగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (ఎంసీడీ) టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎంసీడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే వాలియా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల పంపిణీలో పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, అక్రమాలు జరిగాయంటూ అజయ్ మాకెన్కు ఆయన లేఖ రాశారు. టికెట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. -
అందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి
ఏడో వేతన సంఘం సిఫార్సులపై కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారమిక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సిఫార్సుల వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. గరిష్ట, కనిష్ట వేతనాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలన్న ఉద్యోగుల డిమాండ్ను సంఘం పూర్తిగా విస్మరించిందని మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సులు ఉద్యోగులుకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవి విఫలమయ్యాయన్నారు. 52 రకాల అలవెన్సులను ఆపివేయడం, వడ్డీ లేకుండా ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేయడంపై అభ్యంతరం తెలిపారు. -
'అందుకే అవార్డులు తిరిగిచ్చేస్తున్నారు'
న్యూఢిల్లీ: అవార్డు వాపసీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మత అసహనం పెరిగిపోతుండడంతో రచయితలు, మేధావులు తదితరులు అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నారని పేర్కొంది. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో పురస్కారాలు తిరిగిచ్చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ అధికా ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. 'ప్రముఖులు అవార్డులు ఎందుకు వెనక్కు ఇచ్చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు వారినెంతో బాధించాయి. వీటిని సరిదిద్దాలన్న ఉద్దేశంతోనే పురస్కారాలు ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తున్నారు' అని మాకెన్ అన్నారు. వార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలని అన్నారు. -
ప్రచారం కోసమే రూ. 526 కోట్లా?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రచారం కోసం రూ. 526 కోట్లు కేటాయించటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. సమాచారం, ప్రచారం కోసం గత ఏడాది కేవలం రూ. 24 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఏకంగా రూ. 526 కోట్లు కేటాయించటం ఏమిటని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్మాకెన్ బీజేపీ నేత విజేందర్గుప్తా, ప్రశ్నించారు. -
ఆ బడ్జెట్ మీడియాను కొనేయడానికేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ప్రచార బడ్జెట్ పై కాంగ్రెస్ మండిపడింది. గతంలో కేవలం రూ.24 కోట్ల మేర ఉన్న రాష్ట్ర ప్రచార బడ్జెట్ అమాంతం రూ.526.19 కోట్లకు పెంచడంపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాదని తెలిసినా ప్రచారాల కోసం ఇంతమేర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అంతపెద్ద మొత్తంలో ప్రచార ప్రకటనల కోసం ఖర్చుపెట్టడం సరికాదని మాకెన్ అన్నారు. ఏకంగా మీడియానే కొనుగోలు చేయడానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లుందని మాకెన్ ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి తగిన నిధులు లేవు కానీ.. ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కాగా, ప్రభుత్వ అధికార ప్రతినిధి నాగేంద్ర శర్మ మాత్రం మాకెన్ వ్యాఖ్యలను ఖండించారు. తొలిసారి సమాచార ప్రచార శాఖను ఏర్పాటు చేయడంతోనే అంతమొత్తంలో నిధులు కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అయితే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందా? అని మాకెన్ సవాల్ విసిరారు. -
అబద్ధపు హామీలతో పక్కదారి పట్టించారు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది. అంతే కాకుండా ఐదేళ్ల కాలంలో 40 నుంచి 50 శాతం వరకు ఎన్నికల హామీలను నెరవేర్చగలమని అధికారులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఇది పూర్తిగా ఎలక్షన్ వాచ్డాగ్స్ మేనిఫెస్టో మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఈసీని కలసి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘పౌర సేవల దినోత్సవం’ సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఈసీకి తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టం వచ్చినట్లు హామీల వర్షం కురిపించారని ఆరోపించారు. తద్వారా ప్రజలను పక్కదారి పట్టించారని విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మేనిఫెస్టో మార్గదర్శకాల ప్రకారం అవాస్తవ ఎన్నికల వాగ్దానాలతో ప్రజలపై ప్రభావం చూపేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. కాగా, పౌర సేవల దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అనేక అంచనాలను పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ప్రస్తుతం మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వారే ఐదేళ్లలో విసిరివేసే అవకాశం ఉందన్నారు. కానీ ఐదేళ్లలో 100 శాతం హామీలను నెరవేర్చలేకున్నా కనీసం 40 నుంచి 50 శాతం మాత్రం నెరవేర్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ఆధారంగా అజయ్ మాకెన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
డిస్కంల డిమాండ్కు తలొగ్గద్దు
ప్రభుత్వానికి డీపీసీసీ అధ్యక్షుడు మాకెన్ లేఖ న్యూఢిల్లీ: విద్యుత్ సుంకం 20 శాతం పెంచాలని డిస్కంలు కోరడం సమంజసం కాదని, వారి డిమాండ్కు లొంగవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. డిస్కంల కోరిక అసమంజసం మాత్రమే కాదని, వారి ఇష్టానుసారం ప్రభుత్వం నడుచుకుంటే అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులపై పెను భారం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాసినట్లు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేలా ఢిల్లీ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ)కు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 శాతం మంది ఢిల్లీ ప్రజలు విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని చెప్పడం ద్వారా ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. ప్రొఫైలింగ్ వినియోగదారులెవరూ లేకుండా ఆ విధంగా ఎలా చెప్పగలుతారని ప్రశ్నించింది. ప్రజా సొమ్మును విద్యుత్ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా కుటుంబానికి ఓ విద్యుత్ మీటర్ను అందించాలని ఏప్రిల్ 17న డీఈఆర్సీ కార్యదర్శి ముందు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా చేయడం వల్ల 50 శాతం సబ్సిడీపై నెలకు 400 యూనిట్ల వరకు వినియోగించుకునే విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని ఆ పిటిషన్లో పేర్కొంది. -
'నో ఐడియా.. మాకేం తెలియదు'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భిన్న రకాలు స్పందించారు. ఆయన అతిత్వరలోనే తిరిగొస్తారని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం తమకేం తెలియదని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ బుధవారం ఢిల్లీకి తిరిగొస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీని గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. 'నో ఐడియా. రాహుల్ పునరాగమనం నుంచి మాకేమీ తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాం' అని మాకెన్ అన్నారు. 55 రోజుల సెలవు ముగించుకుని రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
రైతుల విషయంలో ఆప్ మొసలి కన్నీరు కారుస్తోంది
♦ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ♦ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం లేదా? ♦ ఆప్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు న్యూఢిల్లీ : అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోకుండా భూ సేకరణ బిల్లు విషయంలో చేపట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని అజయ్ మాకెన్ విమర్శించారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదు కిలో మీటర్ల దూరంలోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకోలేకపోయిన వారు, ఇప్పుడు ఆకస్మాత్తుగా మేల్కొని రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రంగా నష్టపోయారని మాకెన్ చెప్పారు. అయినా కూడా ఆప్ నుంచి ఒక్కరు కూడా రైతులను కలవడానికి గ్రామాలకు వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. పొరుగున ఉన్న హరియానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ సీఎంలు తమ రాష్ట్రాల్లోని బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ రాష్ట్రాల సీఎంలు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేసినా కూడా సెక్రటేరియట్ నుంచి ఆప్ నేతలు ఒక్కరు కూడా బయటకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా తమ నేతలంతా గ్రామల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామని తెలపారు. అంతే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ఆప్, ఇప్పుడు ర్యాలీ చేపట్టడం వింతగా ఉందన్నారు. ఆ పార్టీకి చెందిన వారు తమ ర్యాలీకి మద్దతు కోరేందుకు గ్రామాలకు వెళ్లాలనుకుంటే నిర్లక్ష్యం చేసినందుకు రైతులు రానివ్వరని చెప్పారు. రైతులకు ఆప్ గురించి పూర్తిగా అర్థమైందని, వారి తియ్యటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ బిల్లుకి వ్యతిరేకంగా ఏప్రిల్ 22న జంతర్మంతర్ నుంచి పార్లమెంట్కు ర్యాలీ చేపట్టింది. -
కార్పొరేషన్ల ఆర్థిక స్థితి దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా నిధుల కేటాయింపుల్లో భారీ కోత పెట్టిందని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. నిధుల సమస్య గురించి మేయర్లు సీఎం కేజ్రీవాల్కు విన్నవించినా ఆయన పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో అవసరమైన మేరకు నిధులు కేటాయించామని, ఏ అంశానికి కోత పెట్టలేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిధులు కేటాయించకుండా ఆయా అంశాలపై రాజకీయం చేస్నున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు మేయర్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్కు రూ. 302 కోట్ల నిధులు ఇవ్వాలని సంబంధింత మేయర్ యోగేంద్ర చందోలియా విన్నవించినా సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రుణం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని అజయ్ మాకెన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి సహాయం తీసుకుందామని యోగేంద్రతోపాటు ఇతరులు కూడా సీఎంకు విన్నవించారన్నారు. తూర్పు, ఉత్తర కార్పొరేషన్లు తమ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతభత్యాలు చె ల్లించలేదని మాకెన్ గుర్తు చేశారు. అన్ని కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని ఆప్ ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకుంటూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తమ హయంలో కార్పొరేషన్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేశామన్నారు. విద్య, పారిశుద్ధ్యం, వైద్యం, అనధికార కాలనీల అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలకు విరివిగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మురికివాడల్లో సౌకర్యాల కల్పనకు కూడా భారీగా నిధులిచ్చామన్నారు. -
స్వైన్ఫ్లూపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు
న్యూఢిల్లీ: ఇటీవల వేగంగా వ్యాపిస్తోన్న స్వైన్ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్విహ ంచనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు అజయ్మాకెన్ సోమవారం వెల్లడించారు. ‘స్వైన్ఫ్లూ నుంచి బయట పడటానికి ప్రభుత్వం సాగిస్తున్న కార్యక్రమాలకు మేం సాయం చేస్తాం. అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తులు 10-15 బృందాలుగా విడిపోయి అన్ని ప్రాంతాలకు తిరుగుతారు. ప్లకార్డులను పట్టుకొని, కరపత్రాలను ప్రజలకు పంచుతారు. ఈ ప్రయత్నం ద్వారా నగరంలో స్వైన్ఫ్లూ తగ్గుతుందని మాకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వచ్చే వారం రంగంలోకి రాహుల్
నాగపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే వారం మొదట్లో తిరిగి కార్యరంగంలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి కమల్నాథ్ చెప్పారు. కమలేశ్వర్ వద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తదుపరి ఐదు రోజుల్లో రాహుల్ తిరిగి విధులకు హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. రాహుల్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. కాగా, పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ఏఐసీసీ సమాచార విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అజయ్ మాకెన్ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. -
సోనియా గాంధీ అసహనం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో అలజడి తలెత్తడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్-కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ల మధ్య చోటు చేసుకున్న అంశం కాస్తా తారాస్థాయికి చేరడంతో సోనియా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జి పీసీ చాకో పార్టీ ఓటమిపై నివేదిక సమర్పించిన సమయంలో సోనియా గాంధీ ఆ విషయాలను అడిగి తెలుసుకున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం పార్టీకి మంచి కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ జగడాన్ని ఆపాలని ఆమె గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారథి అజయ్ మాకెన్ బాధ్యతలను షీలా తప్పుబట్టడంతో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించడమే కాకుండా అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో చాకో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. దీంతో నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయని గ్రహించిన సోనియా గాంధీ ఆ వార్ కు ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. -
ఓటమిపై కాంగ్రెస్లో ‘వార్’ షురూ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మొదలైంది. ఓటమిపై ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అజయ్ మాకెన్ నాయకత్వంపై మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గురువారం విమర్శల వర్షం కురిపించగా, ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో ఎదురుదాడి చేశారు. కాగా, షీలా మాట్లాడుతూ, మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతా తానే చేయగలననే భావనలో మాకెన్ ఉండిపోయి నాయకులను విస్మరించారని, అలాగే కార్యకర్తలను ఉత్తేజితులను చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తన కాంగ్రెస్కు కొంచెం కూడా తోడ్పడలేదని విమర్శించారు. చివరి నిమిషంలో మాకెన్ను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి తప్పుచేశారని చెప్పారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో అతను ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవి తన విజయాలు కాదని, కాంగ్రెస్ విజయాలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తన పేరును ఉపయోగించినట్లయితే పార్టీకి మంచి తోడ్పాటునందించి ఉండేదని చెప్పారు. ఢిల్లీలో పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దుర్భర పరిస్థితిలో ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించడంపై త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి మాట్లాడతానని తెలిపారు. అధినాయకత్వం ఆదేశిస్తే పార్టీ పునరుత్తేజ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా షీలా వ్యాఖ్యలపై పీసీ చాకో ఎదురుదాడి చేశారు. షీలా అభిప్రాయాలను పార్టీ ఆమోదించబోదని, ఆమె నోరు మూసుకుని ఉండటం ఉత్తమమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాకెన్ మద్దతుదారుడైన డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ కూడా షీలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. దీక్షిత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు-చాకో షీలా దీక్షిత్ ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆయన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీక్షిత్ ఆ విధంగా వ్యాఖ్యానించడం బాగోలేదు. పార్టీ విజ్ఞిప్తి మేరకు మాకెన్ ప్రచార నాయకత్వం స్వీకరించారు. అలాగే పార్టీ కోరితేనే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి పార్టీ గెలుపు కోసం మాకెన్ శ్రమించారన్నారు. మాకెన్, లవ్లీతో కలిసి బుధవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై రాహుల్తో చర్చించామన్నారు. అలాగే లవ్లీ మాట్లాడుతూ, ‘ఆమె సలహాలు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందే ఇచ్చి ఉండాల్సింది. ఆమె మాకంటే సీనియర్ నాయకురాలు. మేము ఆమెను చాలా గౌరవిస్తాం. ఆమె మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు, లేకుంటే పార్టీ అధినాయకత్వానికి అయినా తెలియజేయవచ్చు’ అని లవ్లీ వ్యాఖ్యానించారు. కాగా, బ్లాక్ స్థాయి నుంచి జిల్లా కమిటీలను ఎన్నికల ముందు నియమించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై లవ్లీ స్పందించారు. ‘మేము ఆ కమిటీలను తిరగి నియమిస్తాం. వాటిని తప్పనిసరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మాకు కింది స్థాయి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా, దీక్షిత్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించామని, కానీ ఈసారి తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ మద్దతును ఉపయోగించుకుని కింది స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. -
'ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు చావు దెబ్బలా ఉన్నాయి'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బలా ఉన్నాయని ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్)కి అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించినట్లు ఉన్నారని ఆయన అన్నారు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య దేశంలో ఆ తీర్పును గౌరవించాల్సిందేనని మాకెన్ తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తెలిసిందే. ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది తమకు అత్యంత ఆందోళనకరమైన విషయమేనని అన్నారు. అయినా అన్నిసార్లు సర్వేలు నిజమవుతాయనడం ఎంతమాత్రం సరికాదని మాకెన్ తెలిపారు. -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేయలేం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంత తేలికగా కొట్టిపారేయలేమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. తమ పార్టీ సాధించే ఫలితాలు ఒకవేళ సర్వేలో వచ్చినవిధంగా ఉన్నట్టయితే అది ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేం. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది మాకు అత్యంత ఆందోళనకరమైన విషయమే’ అని అన్నారు. కాగా తమకు 12 నుంచి 15 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరో నాయకుడు ఇదే విషయమై మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి పార్టీ పరిస్థితి ఎంతమాత్రం ఆశావహంగా లేదనే విషయం ఇట్టే అర్ధమవుతోందన్నారు. -
'ఇప్పటికీ ఢిల్లీలో మాకు పట్టుంది'
న్యూఢిల్లీ : ఇప్పటికీ ఢిల్లీలో తమకు పట్టుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రచార కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. సాధారణంగా అందరికి ఉండే చివరి క్షణం టెన్షన్ తనకేమి లేదని ఆయన అన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు తనకు కొత్త కాదని.. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఎన్నికలు ఎదుర్కొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తనకు చాలా సంతృప్తినిచ్చిందని మాకెన్ తెలిపారు. ప్రజల స్పందన చాలా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిపాలన పరంగా ఢిల్లీలో అనేక జటిలమైన సమస్యలున్నాయని... తమకు అధికారం ఇస్తే వాటినన్నింటిన పరిష్కారిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీ ఓటర్లకు తెలిపింది. -
కేజ్రీవాల్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని తమ పార్టీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతారహితమే కాకుండా రాజ్యాంగ విరుద్దమన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వచ్చేనెల 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు
* హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయాలు * ఆప్, బీజేపీలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి అజయ్ మాకెన్ శనివారం పేర్కొన్నారు. కేజ్రీవాల్, బేడీ ఇద్దరూ అవినీతి వ్యతిరేక పోరాటం, అన్నా హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య ఎలాంటి భేదం లేదని, వారు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటి వారని విమర్శించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేజ్రీవాల్ ఇచ్చిన అఫిడవిట్ను ఈ సందర్భంగా మాకెన్ విడుదల చేశారు. ఎర్ర బుగ్గలను వాడబోనని, పెద్ద భవంతుల్లో ఉండబోనని, అనవసర భద్రత వద్దని పలు మాటలు చెప్పిన కేజ్రీవాల్.. అధికారం చేతికి రాగానే ఆ మాటలన్నీ తప్పారని మండిపడ్డారు. తన 49 రోజుల పాలనలో కేజ్రీవాల్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఫలితంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలతో సోమవారం ఓ పుస్తకాన్ని తేనున్నట్లు అజయ్ మాకెన్ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యంకాకే ఆయన అధికారాన్ని వదిలి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇక బేడీ, షాజియా వంటి బయటివారిని పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ తన బలహీనతను చాటుకుంటోందన్నారు. మరోవైపు బీజేపీలో కిరణ్ బేడీ చేరికపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న కథనాలను సంఘ్ పరివార్ తోసిపుచ్చింది. అవన్నీ అవాస్తవమని పేర్కొంది. దీన్ని బీజేపీ, సంఘ్ పరివార్ మధ్య చీలిక తెచ్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ పరువు పోకుండా ఉండేందుకే కిరణ్ బేడీని బీజేపీలో చేర్చుకున్నారని ఆప్ ధ్వజమెత్తింది. ఢిల్లీకి రాష్ర్ట హోదా ఇచ్చే అంశంపై ఆ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది. -
ఢిల్లీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. మాకెన్ను ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులుగా నియమించినట్లు ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ చాకో మంగళవారం ప్రకటించారు. 101 మందితో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కమిటీకి మాకెన్ నేతృత్వం వహిస్తారు. తనకు పార్టీ అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని ఢిల్లీలో మాకెన్ మీడియాతో అన్నారు.ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని స్పష్టంచేశారు. 21 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ 21 మంది సభ్యులతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కమిటీని బీజేపీ మంగళవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించే ఈ కమిటీకి బీజేపీ, ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సహా ఢిల్లీలోని ఏడుగురు పార్టీ ఎంపీలు, విజయ్ గోయల్, వీకే మల్హోత్రా, జగదీశ్ ముఖి తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. -
సుజనా బకాయిలు రూ.316 కోట్లు!
ఆయన్ను రక్షించటానికే కేంద్రమంత్రిని చేశారా?: కాంగ్రెస్ సెంట్రల్ బ్యాంకు ఇచ్చిన అప్పును సుజనా చౌదరి తీర్చలేదు కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి సుజనా సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన ప్రధాన నరేంద్ర మోదీ పలువురు కళంకితులను కేబినెట్లో చేర్చుకోవడంపై సమాధానమివ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో నేరస్తులు లేకుండా చూస్తానని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన మోదీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. 66 మంది సభ్యులున్న కేంద్ర మంత్రివర్గంలో 15 నుంచి 16 మంది కళంకిత మంత్రులున్నారని ఆరోపించారు. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన టీడీపీ నేత వై.సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ.వందల కోట్ల బకాయి పడినట్లు వెల్లడించారు. బ్యాంకు అప్పును తీర్చని ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘నిన్న మంత్రివర్గంలో చేరిన వైఎస్ చౌదరి(సుజనా) వెబ్సైట్ను మేం పరిశీలించాం. అందులో ఒకవైపు సుజనా మరొక వైపు ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తున్నారు. దాని పక్కనే చౌదరి సంస్థ సుజనా టవర్స్ గురించి ఉంది. సుజనా టవర్స్ అధినేత అయిన సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ. 316 కోట్లు బకాయి పడ్డారు. ఆ బ్యాంకు జాబితాలో ఇవి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఇచ్చిన అప్పులు నిరర్థక ఆస్తులుగా మారటానికి కారకుడైనందుకేనా మీరు సుజనా చౌదరికి మంత్రి పదవి ఇచ్చారు? సెంట్రల్ బ్యాంకుకు బకాయి పడ్డ టాప్ 20 మంది జాబితాలో ఆయన 8వ స్థానంలో ఉన్నారు. సుజనాను రక్షించేందుకే మీరు మంత్రిని చేశారా? పదవి ఇచ్చే ముందు మోదీ ఈ వివరాలు తెలుసుకున్నారా? ప్రజలు నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నారు..’ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ‘మంత్రి రామ్శంకర్ కతారియాపై 23 క్రిమినల్ కేసులున్నాయి. మరో మంత్రి గిరిరాజ్సింగ్ ఇంట్లో దొంగతనానికి గురైన సొమ్ములో నుంచి రూ. 1.25 కోట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఆయన అవినీతిపరుడు కాదంటారా?’ అని మాకెన్ ప్రశ్నించారు. ‘ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అదనంగా సమాచార ప్రసార శాఖ ఇచ్చారు. ఆర్థిక శాఖకు, సమాచార శాఖకుసంబంధం ఏమిటి? కొందరు వ్యాపారవేత్తలు మీడియా సంస్థలను కొనుగోలు చేయడం తప్ప ఆ రెండింటి మధ్య మరో సంబంధం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశాఖ నుంచి హర్షవర్ధన్ను, రైల్వే శాఖ నుంచి సదానంద గౌడను తప్పించడానికి కారణం చెప్పాలని మాకెన్ డిమాండ్ చేశారు. ‘అవినీతిపరులనా? లేక అసమర్ధులనా? వారిని ఎందుకు మార్చారో మోదీ చెప్పాలన్నారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు: సుజనా తనపై వచ్చిన ఆరోపణలను ఆదివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుజనా చౌదరి ఖండించారు. బ్యాంకులను తాను రుణాలను కట్టకుండా ఎగవేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించటాన్ని తోసిపుచ్చారు. ఇందులో నిజం లేదని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. -
'ఆ యాభై వేల మంది దేశానికి తెలియాలి'
ఢిల్లీ: నల్లధనం అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ మండిపడింది. మంగళవారం బీజేపీ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. అసలు అధికారంలో ఉన్న బీజేపీ సరైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇదే విషయాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చాలా చెప్పారని ఈ సందర్భంగా మాకెన్ గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. దాదాపు 50 వేల మంది నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారని మోదీ తెలిపారన్నారు. ఆ యాభై వేల మంది ఎవరో దేశానికి తెలియాలని మాకెన్ డిమాండ్ చేశారు. -
నల్ల కుబేరుల్లో యూపీఏ మంత్రి!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు అన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ వారికే ఇబ్బందంటూ మంగళవారం వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున బ్లాక్మనీ దాచిన నల్ల కుబేరుల జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేరు ఉందంటూ బుధవారం సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. సరైన సమయంలో ఆ వివరాలు బహిర్గతమవుతాయంటూ పలు జాతీ య చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఆ జాబితాలో ఉన్నారన్న వార్తను మీరు ఖండిస్తారా? అన్న ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ.. ‘నేనా వార్తను ఖండించను. వాస్తవమని చెప్పను. నేను నవ్వుతున్నానంతే’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని, అలా వెల్లడిస్తే.. అది ఆయా దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించారు. విదేశీ ప్రభుత్వాలు తమకు అందించిన బ్లాక్మనీ అకౌంట్దారుల వివరాలున్న సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తామని, అనంతరం ఆ వివరాలు సహజంగానే బహిర్గతమవుతాయని తెలిపారు. ‘ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల జాబితాలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పలుకుబడి కలిగిన నేత పేరుందా?’ అన్న ప్రశ్నకు ‘ఎవరిపైన అయినా సరే.. అభియోగాలను రుజువు చేయగలిగే సమాచారం మా వద్ద ఉంటే ఆ సమాచారాన్ని కోర్టుకు అందజేస్తామని’ అన్నారు. వైరుధ్యాలకు అతీతంగా పార్టీలు సహకరించుకునే పద్ధతిలో భాగంగా.. కాంగ్రెస్ వారి పేర్లను వెల్లడించడం లేదా? అన్న ప్రశ్నకు.. ‘అది తప్పు. నా ప్రత్యర్థి పేరు అందు లో ఉంటే.. దాన్ని వెల్లడించేందుకు మరింత ఉత్సాహపడతా’ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ హర్యానాలో జరిపిన భూ లావాదేవీల వివాదంలోఆ రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై సోనియాగాంధీ, రాహుల్లు చాలా ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉందన్నారు. ‘బెదిరింపులు మానండి’ నల్లధనం వివరాల వెల్లడి విషయంలో లీకేజీలతో బ్లాక్మెయిలింగ్ చేయడం మానేసి ధైర్యముంటే పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని మోదీ సర్కారుకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. విదేశీ ఖాతాదారుల వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ఇరుకునపడటం ఖాయమన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. లీకేజీలు, అసమగ్ర వివరాలతో బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అజయ్ మాకెన్ హితవు పలికారు. ‘మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు. ఆ ప్రయత్నం చేయకండి. నల్లధనం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని మాకెన్ వ్యాఖ్యానించారు. నల్లధనం వ్యవహారం నుంచి దూరంగా పారిపోవడానికి జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకెప్పుడు ఆ పని పూర్తి చేస్తారన్నారు. నల్లధనం అంశంపై మోదీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పవర్లో ఉన్న పదేళ్లు ఏం చేశారు?: బీజేపీ నల్లధనం వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానమిచ్చింది. ఈ విషయంలో బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, అధికారంలో ఉన్న గత పదేళ్ల కాలంలో విదేశాల నుంచి నల్ల ధనాన్ని తిరిగి తెప్పించేందుకు ఆ పార్టీ ఏం చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూటిగా ప్రశ్నించారు.