-
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
‘క్రైమ్’ కలవరం!
సాక్షి, నిర్మల్: నిర్మల్.. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండే జిల్లా. అలాంటి జిల్లాలో నెలరోజులుగా ఏదో ఒక ఘటన కలవర పెడుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పొన్కల్లో గోదావరిలో లభ్యమైన మృతదేహం వెనుక ఉన్న మిస్టరీని మరచిపోకముందే.. తల్వేద చెరువులో మహిళ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దారుణంగా చనిపోయాడు. ఇలా.. క్రైమ్ సీరియల్ మాదిరి ఈనెలలో వరుసగా నేరఘటనలు చోటు చేసుకున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలతో ఇది క్రైమ్సీజన్గా మారింది. పోలీసులకూ ఈ సీజన్ సవాల్గానే సాగుతోంది. భర్తను చంపించిన భార్య.. ఇద్దరు ప్రియులతో కలిసి ఓ భార్య తన భర్తనే దారుణంగా చంపించింది. ఇలాంటి ఘటనలు మీడియాలో చూడడమే తప్ప స్థానికంగా ఎప్పుడూ వినలేదు. భర్తను చంపేసిన తర్వాత కూడా.. చచ్చాడా.. లేదా.. మరోసారి చూడండంటూ ప్రియులకు ఫోన్ చేసి మరీ.. ఆ భార్య నిర్దారణ చేసుకున్న తీరు దారుణం. ఈనెల 1న బయటపడ్డ ఈ కేసు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు, నిందితులు జిల్లావాసులు కాకున్నా ఘటన మాత్రం స్థానికంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన గుజ్జెటి ఉదయ్కుమార్(39)ను ఆయన రెండో భార్య పావని ఆలియాస్ లావణ్య చంపించింది. తన ఇద్దరు ప్రియులు దవాతే దౌలాజీ అలియాస్ రమేష్, గంగాధర్తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. చంపేసి.. మూటకట్టి.. చెరువులో పడేసి తమ సోదరుడిని చంపారన్న అనుమానంతో నిందితులు ఓ మహిళను బలిగొన్న తీరు వీళ్లు మనుషులా.. అన్న భావనను కలిగించింది. పచ్చని పల్లెలో పగతో రగిలిపోయిన వాళ్లు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో మృగాలుగా వ్యవహరించిన తీరు అందరినీ కలచివేసింది. సారంగాపూర్ మండలం బోరిగాంకు చెందిన ప్రశాంత్ అతడి స్నేహితుడు మహేందర్ బైక్పై నిర్మల్ వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదం కాదని, తమ సోదరుడిని మహేందర్ హత్య చేశాడని ప్రశాంత్ సోదరులు, కుటుంబసభ్యులు కక్షగట్టారు. ఈక్రమంలో ఈనెల 12న రాత్రి మహేందర్ తల్లి కళావతి తమ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా నిందితులు ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి, కారులో తీసుకెళ్లి నిర్మల్రూరల్ మండలంలోని తల్వేద చెరువులో పడేశారు. పాతకక్షల నేపథ్యం ఉండటంతో గ్రామస్తులు నిందితులపై చర్యలు తీసుకోవలంటూ గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో నిందితులకు సహకరిస్తున్నారంటూ పోలీసుల తీరుపైనా గ్రామస్తులు ఆరోపణలు చేశారు. తల ఎగిరిపోయింది.. ఈనెల 17న రాత్రి భైంసా–నిర్మల్ మార్గంలో 61 వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్ర మాదం సంచలనమైంది. తల లేకుండా రోడ్డుపై మొండెం మాత్రమే కనిపించింది. హత్యనా.. లేక ప్రమాదమా.. అన్న చర్చ మొదలైంది. ఘటన జరిగిన మరుసటి రోజు వరకూ మృతు డి తల దొరకలేదు. దిలావర్పూర్ మండలం లోని కుస్లి గ్రామానికి చెందిన సూర అరుణ్ అనే యువకుడు ఆదివారం రాత్రి డోంగూర్గావ్ నుంచి తమ ఊరికి వెళ్తుండగా నర్సాపూర్(జి) మండలంలో ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంతో వస్తున్న భారీ వాహనం(హార్వేస్టర్గా భావిస్తున్నారు) మెడ భాగంలో బలంగా ఢీకొట్టడంతో అరుణ్ తల ఎగిరిపోయింది. దాదాపు 30మీటర్ల దూరంలో పడింది. ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు తల దొరికింది. రోడ్డుపై మొండెం మాత్రమే ఉండటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అరుణ్ది హత్యగా భావించారు. కానీ ఘటన జరిగిన తీరును అంచనా వేసిన పోలీసులు రోడ్డుప్రమాదంగా భావిస్తున్నారు. వరుస ఘటనలతో.. గతానికి భిన్నంగా జిల్లాలో వరుసగా నేరాలు, ఘటనలు చోటుచేసుకోవడంతో సర్వత్రా క్రైమ్పైనే చర్చ నడుస్తోంది. ప్రధానంగా పొన్కల్, బోరిగాం కేసులు మానవత్వానికే మాయని మచ్చగా నిలిచాయని పేర్కొంటున్నారు. ప్రియుల మోజులో పడి భర్తను చంపించిన తీరు, అనుమానంతో కక్షకట్టి ఓ అమాయకురాలి ప్రాణం తీసిన.. ఈ ఘటనలు జిల్లావాసులను కలచివేశాయని చెప్పవచ్చు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు పలు రోడ్డుప్రమాదాలు, వరుస దొంగతనాలూ ఈనెలలోనే జరిగాయి. జిల్లాకేంద్రానికి చెందిన యువకుడు మొగిలి అంజు సై తం రోడ్డుప్రమాదంతో మృత్యువు దరికి చేరాడు. మామడ మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇలా వరుస ఘటనలు జరగడంతో ఇది క్రైమ్ కాలంగా జిల్లావాసులు భావిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న క్రైమ్రేట్ పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతోంది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
సాక్షి, కాగజ్నగర్(ఆదిలాబాద్) : తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన దహెగాం మండలం రాళ్లగూడెం గ్రామంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. పోలీసులు తక్కువ సమయంలోనే కేసును చేధించి నిందితులను పట్టుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.లక్ష్మినర్సింహస్వామి, రూరల్ సీఐ అల్లం నరేందర్ వివరాలు వెల్లడించారు. రాళ్లగూడ గ్రామానికి చెందిన రౌతు బండు(38), భార్య కవిత. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. కవిత ఏడాదిగా కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగి బిక్కుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం బండును హత్య చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 17న రాత్రి బండు ఇంట్లో నిద్రిస్తుండగా కర్రతో తలపై దాడి చేసి హతమార్చారు. అనంతరం అనుమానం రాకుండా బిక్కు ద్విచక్రవాహనంపై మృతుడి శవాన్ని తీసుకెళ్లి బిబ్రా శివారులోని పత్తి చేనులో పడేశారు. సోమవారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. భార్య కవితను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. మృతుడి సోదరుడు రౌతు కొండయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రఘుపతి, మహిళా హెడ్ కానిస్టేబుల్ సమీనా, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానంతో మహిళ హత్య
సారంగపూర్(ఆదిలాబాద్ ) : మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన ఎడ్ల కళావతి(42)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనే సంచిలో కట్టి నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలోని చెరువులో పడేసిన ఘటన విధితమే. అయితే ఈ ఘటనపై ఆదివారం మృతురాలి బంధువులు బోరిగాం గ్రామంలో ఆందోళనకు దిగారు. అనవసరంగా అనుమానం పెంచుకుని మహిళా అని కూడా ఆలోచించకుండా కిరాతకంగా హత్య చేశారని ఆరోపిస్తూ నిందితుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు సైతం నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ సారంగాపూర్ ఎస్సై యూనుస్ అహ్మద్ అలీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బోరిగాం గ్రామానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు. అలాగే కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానంతో.. బోరిగాం గ్రామానికి చెందిన అచ్చమ్మ–రాజన్న దంపతులకు ముగ్గురు కుమారులు ప్రసాద్, నరేష్, రమేష్లు, కుమార్తె రాధ ఉన్నారు. చిన్నవాడైన ప్రసాద్కు ఆర్మీ జవానుగా ఉద్యోగం చేసేవాడు. సెలవులో ఇంటికి వచ్చిన ప్రసాద్ నాలుగు నెలల క్రితం ఇంటి పక్కన గల ఎడ్ల కళావతి–ఎర్రన్నల కుమారుడు మహేందర్, మరో స్నేహితుడు నిఖిల్లతో కలిసి దావత్కు వెళ్లాడు. దావత్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆలూరు మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మరణించాడు. అయితే ప్రసాద్ తల్లి, సోదరులు ఇది రోడ్డు ప్రమాదం కాదని కావాలనే మహేందర్, నిఖిల్లు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని అనుమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మహేందర్, నిఖిల్ కుటుంబీకులను నరేష్, రమేష్లు బెదిరించారని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ వేధింపులు భరించలేక ఇంటిని ఖాళీ చేసి ఎడ్ల కళావతి కుటుంబం గ్రామంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. హత్య జరిగింది ఇలా.. మృతురాలు ఎడ్ల కళావతి భర్త ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. కుమారుడు మహేందర్ బెదిరింపుల నేపథ్యంలో గ్రామాన్ని వదిలి నిర్మల్ మండలం మంజులాపూర్లో ఉంటున్నాడు. మృతురాలు కళావతి ఈ నెల 12వ తేదీన గ్రామంలో ఒకరి ఇంటి వద్ద భజన కార్యక్రమాన్ని హాజరవడానికి అచ్చమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా గమనించిన నరేష్, రమేష్, అచ్చమ్మ, పక్కా ప్రణాళిక ప్రకారం కళావతిని ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మేడపైనున్న మరో గదిలోకి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి తల్వేద గ్రామంలోగల చెరువులో పడేశారు. పలువురికి కళావతి కేకలు, అరుపులు వినిపించడంతో విషయాన్ని కళావతి కుమారుడు మహేందర్కు ఫోన్ చేసి తెలిపారని సమాచారం. ఈ నెల 14న మహేందర్ తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై అనుమానితులను విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. నిందితులను కఠినంగా శిక్షించాలి కేవలం అనుమానంతో కళావతిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు నరేష్, రమేష్, తల్లి అచ్చమ్మ, అక్క రాధ, బావ ముత్యంలను కఠినంగా శిక్షించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టౌన్ పోలీస్స్టేషన్కు అటాచ్ బోరిగాం ఘటన నేపథ్యంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సారంగాపూర్ ఎస్సై యూనుస్ అహ్మద్ అలీని నిర్మల్ టౌన్ పోలీస్టేషన్కు అటాచ్ చేశామని రూరల్ సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుతం సారంగాపూర్ ఎస్సైగా టౌన్ ఎస్సై అరాఫత్కు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని అన్నారు. -
లావుగా ఉన్నావని అత్తింటి వేధింపులతో..
సాక్షి, చెన్నూర్(ఆదిలాలబాద్) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కుమ్మరిబొగుడ కాలనీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలివీ..కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన తోట కిషన్–మధునమ్మలకు మానస, మౌనిక ఇద్దరు కూతుర్లు. తండ్రి కిషన్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమార్తె మౌనిక (22) మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా, ఆరుడ గ్రామానికి చెందిన ఏతం కిరణ్కు రూ.8లక్షల కట్నం ఇచ్చి 2018లో వివాహం చేసింది. మౌనిక లావుగా ఉండడంతో భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. శుక్రవారం బంధువులు ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు తల్లి మంచిర్యాల వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మానిక చున్నీతో దూలానికి ఉరేసుకుంది. ఎస్సై సంజీవ్, తహసీల్దార్ పుష్పలత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త కిరణ్, అత్తమామలు విడాకులు ఇవ్వాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నమ్మించి గొంతుకోశాడు..
సాక్షి, ఆదిలాబాద్ : అక్కను చూసేందుకు వచ్చి బావ చేతిలో బావమరిది హతమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని దహేలిలో నివాసముంటున్న నర్సమ్మ – దత్తుల కూతురు మమతను ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన ఓసావార్ సంతోష్తో పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోగా అక్కతో కలిసి మనోజ్ (25) బావపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏడాది నుంచి అక్కాబావలు కలిసి ఉంటున్నారు. గురువారం తన అక్కను చూసేందుకు వచ్చాడు. అక్కతో పాటు ఆమె పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. బావ సంతోష్ బావమరిదిని టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. మమత జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే బైక్ నడుపుతున్న మనోజ్ను కత్తితో వెనకనుంచి మెడను కోశాడు. ఆ తర్వాత కడుపులో పలుమార్లు పోడవడంతో మనోజ్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రావు, వన్టౌన్, టూటౌన్ సీఐలు చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు
ఈ కంటెయినర్ వాహనం విలువ రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. ఇది కొత్త వాహనం. గత నెల గుడిహత్నూర్ పోలీసులు ఈ వాహనాన్ని పట్టుకున్నారు. ఇందులో హోల్సెల్లో రూ.25లక్షల విలువైన నిషేధిత గుట్కాను అక్రమంగా వేరే రాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది ఆదిలాబాద్కు చెందిన పాన్ మసాలా వ్యాపారిది. అంత ఖరీదైన వాహనంలో లక్షల విలువైన అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నా ఆ వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదు. కారణం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం అతనే నిర్వహిస్తుండటం, ఇప్పటికే కోట్లకు పడగలెత్తడంతోనే ఇలా విలువైన వాహనం, సరుకు పట్టుబడ్డా ఆయన దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సాక్షి, ఆదిలాబాద్: గుట్కా దందాలో ఆయనో డాన్. ఆదిలాబాద్కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి, అతని సోదరులతో కలిసి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిఘా కళ్లు కప్పి దందా నడుపుతున్నాడు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అతని దందాకు బ్రేక్ పడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఇప్పటివరకు వంద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని బెయిలబుల్ కేసులు కావడంతో ఒక కేసులో పట్టుబడ్డ తర్వాత త్వరితగతిన బయటకొస్తున్న ఈ నిందితుడు మళ్లీ తన పాత పంథాను మాత్రం కొనసాగిస్తున్నాడు. విలువైన వాహనాలు, సరుకు పట్టుబడినప్పుడు ఆయన తన నష్టాన్ని మరో రూపంలో పూడ్చుకుంటున్నట్లు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంతమంది ద్వారా తెలుస్తోంది. అదెలా అంటే.. ఇటీవల గుడిహత్నూర్లో ఓ వాహనం పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ వాహనం ఖరీదు, సరుకు విలువనే అరకోటి దాటుతుండగా, దీని తర్వాత సరుకును హోల్సెల్గా విక్రయించే దగ్గర రెట్టింపు చేసి తన నష్టాన్ని పూడ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ దందాలో విలువైన వాహనాలు, సరుకు ఎలాంటిది పట్టుబడ్డా ఆ పాన్ మసాలా వ్యాపారి లైట్ తీసుకోవడానికి అదే కారణమని చెప్పుకుంటున్నారు. నిత్యం దందా.. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని ఎన్నో ఏళ్లుగా ఈ పాన్ మసాలా వ్యాపారి యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండేళ్లలోనే సుమారు రూ.5 కోట్ల అక్రమ సరుకును పట్టుకున్నారు. అయినా ఈ దందాను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. కాగా జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతున్న సమయంలో ఎస్పీ ఉక్కుపాదం మోపారు. అది చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది. ఇందులో కొంతమంది మట్కా నిర్వాహకులకు బెయిల్ రాకుండా పోలీసులు కేసులు పెట్టడంతోనే వారు మళ్లీ అటువైపుగా దృష్టి సారించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలే ఈ గుట్కా విషయంలోనూ అవలంబించాలన్న అభిప్రాయం లేకపోలేదు. కొందరికీ మామూళ్ల తంతు.. గుట్కా దందాలో కొందరు పోలీసులకు ఇప్పటికీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ గుట్కాపై ఉక్కుపాదం మోపుతూ కేసుల విషయంలో సూక్ష్మంగా దృష్టి సారించడంతో మండలాల్లో పోలీసు అధికారులు ఇందులో మామూళ్లకు వెనుకంజ వేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆయా సర్కిల్, ఎస్హెచ్ఓలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇప్పటికి మామూళ్ల తంతును రుచి మరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, శివారులో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆదిలాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కచ్కంటిలో ఒక గోదామును ఏర్పాటు చేసుకొని నిషేధిత గుట్కాను నిల్వ చేసి ఉంచగా పోలీసులే దాడిచేసి వెలుగులోకి తెచ్చారు. అయితే జిల్లా ఉన్నతాధికారికి సమాచారం రావడంతోనే ఇటువంటివి బయటకు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసు అధికారులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. మండలాల్లో గోదాములు నిషేధిత గుట్కా వ్యాపారంలో కోట్లు గడించిన ఆదిలాబాద్కు చెందిన ఓ పాన్ మసాలా వ్యాపారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ దందాలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నాడు. మండలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని సరుకును నిల్వ ఉంచి అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఈ గుట్కాను ఎక్కడికక్కడ వాహనాలు పంపి డంపింగ్ చేయడం ద్వారా దందాను సులభతరం చేసుకున్నాడు. కోట్లు గడించిన ఈ వ్యాపారికి రాష్ట్ర రాజధానిలోనూ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో కొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ వ్యాపారితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు ఇతన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం
సాక్షి, ఖానాపూర్: భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్, ఎస్సై భవానిసేన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి చెందిన లక్ష్మి (40) భర్త బుక్య బలిరాం సోదరుడు గతంలో మృతిచెందాడు. అతడి భార్యతో బలిరాం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై భార్యతో తరుచుగా గొడవలు జరిగేవి. గ్రామస్తులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో పాటు భార్యను తరుచుగా వేధించేవాడు. శుక్రవారం ఉదయం పంటచేనుకు వెళ్లిన లక్ష్మిని అక్కడికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో పంట చేనులోని పురుగుల మందు తాగి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు వెంకటేశ్, కూతుల్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ -
చెన్నూర్లో భారీ చోరీ
సాక్షి, చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో జేబీఎస్ పాఠశాల సమీపంలోని గోదావరి రోడ్డులో చెన్నూర్ ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి బీరువాలో దాచిన నగదు, విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కొమ్మెర రాధాకృష్ణమూర్తి వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లి అదేరోజు అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా పగులగొట్టి అందులో దాచిన మూడున్నర తులాల బంగారం, రూ.70 వేల విలువైన వెండి, రూ.1.60 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సై విక్టర్, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్స్వా్కడ్, క్లూస్ టీం బృందం సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని జెండవాడలో చెన్న మధు ఇంటి వద్ద కుక్క ఆగడంతో మధును తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. జైపూర్ ఏసీపీ నరేందర్ ఎంఈవో ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. పక్కా ప్లాన్తోనే దొంగతనం.. ఏంఈవో రాధాకృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్ వెళ్లి వచ్చేలోగా ఇంట్లో చోరీ జరిగింది. పక్కా ప్లాన్తోనే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారైన ఉండాలి. లేక రెక్కీ నిర్వహించిన దొంగలైన ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో పాటు నిరంతరం జన సంచారం ఉంటుంది. పగలు చోరీ జరిగే అవకాశమే లేదు. రాత్రివేళ సుమారు 10 నుంచి 12 గంటల మధ్యే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్బత్తీలతో కాల్చి...
సాక్షి, ఉట్నూర్ రూరల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్కు వివరించినట్లు సమాచారం. అయినా సదరు వార్డెన్లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..
సాక్షి, బేల(ఆదిలాబాద్ ): మండలంలోని సదల్పూర్ రెవెన్యూ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతు కుటుంబం కాగా, మరోకరిది కూలీ కుటుంబం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులోని రైతు రేషవార్ ఆశన్న పత్తి చేనులో బేల, జూనోని గ్రామాల నుంచి 8 మంది మహిళ కూలీలు ఆటోలో పత్తి ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా చెట్ల కిందకు పరుగెత్తారు. దీంతో ఒక చెట్టుకు కిందకు వెళ్లిన నలుగురు పిడుగుపాటుకు గురయ్యారు. జూనోనికి చెందిన నాగోసే ప్రమీల(33), బేలకు చెందిన కనక దేవిక(29)లు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన జూనోని గ్రామానికి చెందిన మరో ఇద్దరు లెన్గురే ఉష, నాగోసే దుర్పతలను రిమ్స్కు తరలించారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై నజీబ్ పరిశీలించారు. ఆయన వెంట కానిస్టేబుల్ స్వామి ఉన్నారు. -
దొంగలొస్తారు.. జాగ్రత్త !
సాక్షి, మంచిర్యాల: దసర పండగ సందర్భంగా చాలా మంది ఊర్లోకి, వివిధ ప్రాంతాలకు టూర్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని మంచిర్యాల ఏసీపీ గౌస్బాబ పట్టణ ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. దొంగలు వీధుల గుండ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి పక్కింటి వారికి మాయ మాటలు చెప్పి తాళం వేసి ఉన్న ఇంటి వారు తమ బంధువులంటూ సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం రాత్రి వేళ దర్జాగా దొంగలు తమ పని కానిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసర సెలవులు ఉన్నందున ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు సైతం పండగకు ఇంటికి తాళం వేసి సొంతూర్లకు వెళ్తుంటారు. ఇదే మంచి తరుణం అని భావించిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణ సీఐ మహేష్ దొంగల భారి నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే ముందు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ నిఘా ఉంటుందని, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. దొంగతనం కేసులో బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీసీపీ రక్షిత కె. మూర్తి దొంగతనాల నివారణకు ఇవి పాటించండి అత్యవసరంగా ఊరెళ్లాల్సి వస్తే పక్కింటి వారికి తెలపాలి. వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అతి తక్కువ ధరకు దొరికే వైఫై బేస్డ్ రోబో కెమెరాను అమర్చుకోవాలి. దీని నుంచి మీ ఇంట్లో జరిగే విషయాలు మీ సెల్ఫోన్కు అలర్ట్ రింగ్టోన్ వస్తుంది. అది వారికి వినిపించదు. వారు దొంగతనం చేస్తుండగానే పట్టుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో సైరన్ మోగే తాళాలు సైతం అతి తక్కువ ధరలో దొరుకుతాయి. దానిని కదిలించే ప్రయత్నం ఎవరు చేసిన సైరన్ మోగుతుంది. దీంతో పక్కవారు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. తాళం వేసినా అది కనిపించకుండా డోర్ కర్టెన్ కప్పి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ముందు ఉన్న గేటుకు తాళం వేయకపోవడం మంచిది. బెడ్ రూంలో లైట్ వేసి ఉంచాలి నగలు, నగదు బీరువాల్లో దాచిపెట్టక పోవడం మంచిది. డబ్బులు, ఆభరణాలు బ్యాంకుల్లో భద్రపర్చుకోవడం ఉత్తమమైనది. అపార్ట్మెంట్లో ఉండేవారు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్మెంట్లో అందరు కలిసి వాచ్మెన్ను నియమించుకోవాలి. అతనిపై నిఘా ఉంచాలి. తలుపులకు సమీపంలో కిటికీలు ఉండకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే మంచిది. ఇలా ఉంటే కిటికీల గుండా గడియ తీసే అవకాశం ఉంది. కొత్తగా ఎవరైన అద్దెకు దిగితే వారి పూర్తి వివరాలు సేకరించాలి. మహిళలు బయటకు వెళ్లే ముందు విలువైన నగలు ధరించుకోకుండా వెళ్లడం మంచిది. తప్పదనిపిస్తే నగలు కనిపించకుండా చీర కొంగు లేదా చున్ని మెడ చుట్టూ కప్పుకోవాలి. వీలైనంత తక్కువ నగలు ధరించడం మంచి ది. ఆర్టిఫిషియల్ నగలు ధరించుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు మన పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు వారిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. వీలైతే మీ మొబైల్ ద్వారా ఫొటో తీసి పోలీసులకు పంపించాలి. ప్రజల భద్రత కోసమే పోలీస్ ప్రజల భద్రత, ప్రజల ఆస్తుల రక్షణకు పోలీస్ వ్యవస్థ 24 గంటలు పని చేస్తుంది. నిర్భయంగా సమాచారం ఇవ్వండి రక్షణ కల్పిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో 24 గంటలు నాలుగు బ్లూ కోట్స్ టీములు తిరుగుతున్నాయి. ఊళ్లకు వెళ్లే వారు ముందుగానే పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి పోతే వారి ఇళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. 100 నంబర్ బిజీగా ఉంటే మంచిర్యాల పోలీస్స్టేషన్ నంబర్ 9059949099కు సమాచారం ఇవ్వచ్చు. – ఏసీపీ, గౌస్బాబ -
రైల్వేపోలీసుల ఎత్తుకు స్మగ్లర్ల పైఎత్తు..!
సాక్షి, మంచిర్యాల: రేషన్ బియ్యం అక్రమ రవాణా కొంత పుంతలు తొక్కుతోంది. బియ్యం అక్రమ రవాణా చేయడంలో అక్రమదారులు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. నాడు బియ్యం తరలించే సమయంలో రైల్వే పోలీసులకు దొరకుండా టాయిలెట్లలో నింపి లోపల ఓ వ్యక్తి గడియ పెట్టుకుని ఉండేవారు. తనిఖీ చేసేందుకు వచ్చిన పోలీసులు బయట దొరికిన బియ్యం సంచులను మాత్రమే తీసుకువెళ్లేవారు. టాయిలెట్లో దాచిపెట్టిన బియ్యాన్ని దింపే సమయంలో డోర్ వెళ్లకపోతే ధ్వంసం చేసేవారు. ‘అక్రమ రవాణా ఆపై ధ్వంసం’ అనే కథనం ‘సాక్షి ’దిన ప్రతికలో ఆగస్టు 13న ప్రచురణ కాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారు తమ పంథాను మార్చుకున్నారు. ప్రస్తుతం కొత్త పద్ధతిలో తరలిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలుమార్గం వరం అక్రమంగా రేషన్ బియ్యం తరలించేందుకు అక్రమార్కులకు రైలుమార్గం వరంగా మారింది. రైల్వేపోలీసులు, టీసీ ఎవరైన అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమపని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, అజ్ని ప్యాసింజర్ రైళ్లల్లో అధికంగా జరుగుతోంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6గంటలకు కాజిపేట నుంచి బయలు దేరుతోంది. అజ్ని ప్యాసింజర్ రాత్రి 10:30 గంటలకు బయలుతేరుతోంది. ఈ రెండు రైళ్లు తెల్లవారే లోపు మహారాష్ట్రలోని వీరూర్కు చేరుకుంటాయి. రాత్రి వెళ్లడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణ దారులకు ఈ రెండు రైళ్లు అనుకూలంగా మారింది. ఆగని బియ్యం దందా... మహారాష్ట్రలోని వీరూర్కు మన రేషన్ బియ్యం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఆజ్ని ప్యాసింజర్ రైళ్ల ద్వారా యథేచ్ఛగా అక్రమార్కులు రేషన్ బియ్యం తరలిస్తున్నారు. కాజిపేట నుంచి ప్రతిరోజు సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్ అర్ధ రాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఆజ్ని ప్యాసింజర్ రాత్రి 10:30గంటలకు కాజిపేట నుంచి బయలుదేరి తెల్లవారు జామును వీరూర్కు చేరుకుంటుంది. ప్రతి రోజు గంటల తరబడి ఆలస్యంగా నడువడంతో బియ్యం స్మగ్లర్లకు ఇది వరంగా మారింది. వీటి వెనుకల వచ్చే మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల తదితర కొన్ని స్టేషన్లలో క్రాసింగ్ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైల్లో ఎక్కించుకునేందుకు సమయం కలిసి వస్తోంది. సంచుల్లోని బియ్యాన్ని సీట్ల కింద పారబోసి తమకు ఏమి ఏరుగనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు భాగ్యనగర్. ఆజ్నీ ప్యాసింజర్ రైళ్లో హసన్పర్తిరోడ్డు, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపూరం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్ ఈ రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గతంలో రవాణా ఇలా... గతంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా రైల్వేపోలీసులకు పట్టుబడితే బియ్యం పట్టుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయం లాంటివి జరిగేవి. ఆ తరువాత బియ్యం సంచులను టాయిలెట్ రూములో భద్రపరిచి ఓ వ్యక్తి లోపలనే ఉండి డోర్లాక్ చేసుకుని తరలించేవారు. రైల్వేస్టేషన్ గోడపైన తరలించేందుకు సిద్ధంగా బియ్యం సంచులు; సీట్లకింద పోసిన రేషన్ బియ్యం సీట్ల కింద బియ్యం... రైలు బోగిల్లోకి ఎక్కించిన బియ్యం సంచుల్లో నుంచి సీట్లకింద పారబోసి అవి ఎవరివో మాకేం తెలియదన్నట్లుగా సీట్లపై పడుకుంటున్నారు. విడిగా ఉన్న బియ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియక అధికారులు వదిలేస్తున్నారు. రేషన్ బియ్యం స్టేషన్ ప్లాట్ఫారంపైకి రాకముందే కట్టడి చేస్తే రైలుమార్గం వెంట బియ్యం అక్రమ రవాణా అరికట్టవచ్చు. రైల్వే అధికారుల అండతో.. రేషన్ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వేపోలీసులు రేషన్ బియ్యం స్మగ్లర్లను గుర్తించకపోవడంపై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికార యంత్రంగం ఈ వ్యవహారాన్ని మాములు ‘గా’ తీసుకుంటున్నారనే ఆరోపనలున్నాయి. 41 క్వింటాళ్లు పట్టివేత తాండూర్(బెల్లంపల్లి): మండలంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శుక్రవారం తెల్లవారు జామున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్లల్లో మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లల్లో దాడులు నిర్వహించారు. తలుపులు లేని ఓ ఇంట్లో 90బస్తాల్లో 41 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బియ్యాన్ని మండల కేంద్రంలోని గోదాంకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గోవింద్ , సిబ్బంది పాల్గొన్నారు. 56 క్వింటాళ్లు కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నట్లు రైల్వే రక్షక దళం ఎస్సై ఏటీఎస్ నర్సింహులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రంలోని విరూర్కు పలు ప్యాసింజర్ రైళ్ల ద్వారా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఉదయం నుంచి పలు రైళ్లలోని బోగిల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో 185 బ్యాగుల బియ్యం బస్తాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఆర్పీఎఫ్ సీఐ రాకేష్ మీణా ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. 185 బ్యాగుల్లో మొత్తం 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.... ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం డోర్పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్లేట్స్ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూ. 2లక్షలకు ఒప్పందం... విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది. 16గంటల పాటు పోలీస్ పహారా.... ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
తప్పని ఎదురుచూపులు..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): చిన్ననాటి నుంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించిన కన్నపేగు ఇన్నాళ్లు తమ మధ్య ఉంటూ నిత్యం నవ్వులతో ఆనందంగా ఉండే కన్నబిడ్డ జాడ కరువయ్యింది. మొన్నటి వరకు సంతోషాల మధ్య సాగిన ఆ కుటుంబంలో అంతుచిక్కని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇక కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్గా ఉద్యోగం మొదటి నెల జీతం కూడా తీసుకుంది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహార యాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి రమ్య ఆచూకీ మాత్రం లభించలేదు. రోజు రోజుకూ గోదావరిలో లభిస్తున్న మృతదేహాల్లో తమ రమ్య మృతదేహం ఉందేమోనని ఆందోళన ఒకవైపు... రమ్య ఆచూకీ తెలియడం లేదని మరోవైపు రమ్య తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నేటికి ఆరు రోజులైనా కన్నబిడ్డ జాడ లేదు సరికదా ఏం జరిగిందోనని అంతుచిక్కని ఆవేదనలో పెడుతున్న కన్నీరు మున్నీరు అవుతున్న వారి తీవ్ర ఆవేదన ప్రతీ ఒక్కరిని కలిచివేస్తుంది. ఏది ఏమైనా రమ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు తెలియరాలేదు. ఇంకా దాదాపు పది మంది వరకు గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రమ్య గల్లంతు ఇంత వరకు తెలియక పోవడంతో ఇటు నంనూర్లో తల్లి భూలక్ష్మి తీవ్ర ఆవేదనలో ఉండగా సంఘటనా స్థలంలో తండ్రి సుదర్శన్, సోదరుడు రఘులు దయనీయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా గల్లంతైన రమ్య ఆచూకీ త్వరగా లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో మాయలేడి
సాక్షి, బెల్లంపల్లి: కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన మాయలేడీని కాసిపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన ఠాకూర్ సుమలత గత మూడేళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ఉద్యోగాల విషయంలో జైపూర్, దేవాపూర్ పవర్ప్లాంట్లలో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ నిరుద్యోగులను కలిసి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది. అనంతరం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు విసిగి వేసారి వడ్డీ నష్టపోతున్నామని వాదనకు దిగారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సైతం మోసం చేసినట్లు విన్నవించారు. దీంతో విషయం తెలుసుకున్న సుమలత కోర్టు నుంచి ఐపీ తెచ్చుకొని నోటీసులు పంపించింది. బాధితులు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతుండగా నిందితురాలు రూ.80 లక్షలు వరకు వసూలుపై ఐపీ తెచ్చుకుంది. ఉద్యోగాల పేరిట మోసపోయింది పోయి తిరిగి ఐపీ కింద కోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాసిపేట, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్నగర్, వరంగల్, పర్కాల, హన్మకొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్లలో సైతం ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. కాగా బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి సుమలత కోసం గాలించగా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరిగింది. ఎట్టకేలకు బుధవారం కాసిపేట పోలీసులు బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ గ్రామ సమీపంలోని టోల్ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. టోల్ప్లాజా పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను బలంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 32మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిజామాబాద్, హైదరాబాద్కు తరలించారు. క్షతగాత్రుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉండడం కలకలం రేపింది. సంఘటన జరిగిన వెంటనే ఎస్సై రవీందర్కేంద్రే తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తోటి ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులకు సహాయం అందించారు. కొందరి తలలు, మరికొందరి కాళ్లు, ఇంకొందరి చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో, ప్రైవేటు వాహనాల్లో నిర్మల్, నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వేణుగోపాల కృష్ణ, రఘునందన్ రెడ్డి, శశికాంత్, శ్రీదేవి క్షతగాత్రులకు చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ మనోహర్ సింగ్ నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ప్రాణాలు కాపాడిన స్పీడ్ బ్రేకర్లు వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేసేందుకు టోల్గేటు వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లే తమ ప్రాణాలు కాపాడాయని ప్రయాణికులు చెబు తున్నారు. అప్పటికే వేగంగా వచ్చిన బస్సు స్పీ డ్ బ్రేకర్ వద్ద కంట్రోల్ అయినా.. పూర్తిగా ని యంత్రణలోకి రాకపోవడంతో అదుపుతప్పి సిమెంట్ గద్దెను ఢీకొట్టిందని చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు లేకుంటే మరింత వేగంతో వచ్చి ఢీ కొని ప్రాణాలు కోల్పోయేవారమని పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉంది వీరే.. భైంసాకు చెందిన హమీదా బేగం ముఖం భాగంలో ఎముకలు విరిగిపోయాయి. నిర్మల్కు చెందిన కళ్యాణికి ముక్కుభాగంలో ఎముక విరిగింది. శంకర్ అనే వ్యక్తికి నడుం భాగంలో ఎముకలు విరిగాయి. లక్ష్మీ అనే వృద్ధురాలికి ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ నలుగురుకి పరిస్థితి విషమంగా వుండటంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నిజామాబాద్, హైదరాబాద్కు రెఫర్ చేశారు. గాయాలతో బయటపడిన వారు.. నిర్మల్కు చెందిన కండక్టర్ రమేష్గౌడ్, నిజాదవ్ వసంత, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక, రేఖ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన రమేష్, నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన అమీద, నిజామాబాద్కు చెందిన నరేష్, నందిపేట్కు చెందిన లక్ష్మీ, గుత్పాకు చెందిన సునిత, లావణ్య, ఆదిలాబాద్ జిల్లా బోథ్కు చెందిన శంకర్, హైదరాబాద్కు చెందిన నరేష్ కుమార్, నిర్మల్కు చెందిన ఫహిజుల్లా ఖాన్, షబాన, షేక్ ఉల్లాఖాన్, గంగయ్య, రమేష్, సునితా, సరీనా బేగం ఉన్నారు. ఇదే బస్సులో ఉన్న నలుగురు చిన్నారులు, మరో ఇద్దరు వృద్ధులు ఎలాంటి గాయాలుకాకుండా బయట పడ్డారు. మొహర్రం పండగా పూట ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మొహర్రం పండగా ఒకటి. అయితే పండగను జరుపుకోవడానికి వెళ్లిన ముస్లిం వృద్ధురాలు హమీదాబేగం పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. బైంసాకు చెందిన హమీదా బేగంకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కుమారుడు మహారాష్ట్రలోని నాందెడ్లోని అత్తగారి ఇంటివద్ద ఉంటున్నాడు. భర్త అప్సర్ గతంలోనే మరణించగా ఇంట్లో ఒక్కతే కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మూరులో ఉండే ఆమె చిన్న కూతురు ఆసియా బేగం తన తల్లికి ఫోన్ చేసి మొహర్రం పండగకు రావాలని కోరడంతో ఆదివారం ఆర్మూర్కు వెళ్లి సోమవారం మొహర్రం పంగను కూతురు, అల్లుడు, మనవళ్లతో ఆనందంగా జరుపుకుంది. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు. ఇదే సంఘటనలో మరో ఐదుగురు ముస్లింలు సైతం గాయపడ్డారు. పండగ పూట ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోన్: జిల్లాలోని 44వ జాతీయ రహదారి మంగళవారం నెత్తురోడింది. నిజామాబాద్ నుంచి నిర్మల్కు బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు గంజాల్ సమీపంలోని టోల్ప్లాజా వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న సిమెంట్ గద్దెకు ఢీకొనడంతో ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఒక్కసారిగా హాహాకారాలు.. ఆర్తనాదాలు మిన్నంటాయి. మొత్తం 32 మంది ప్రయాణికుల్లో 24 మందికి తీవ్ర గాయాలవగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. -
రమేష్ హత్య వెనుక రహస్యాలనేకం..!
సాక్షి, ఆసిఫాబాద్: స్నేహితుల చేతిలో హతమైన ఆత్రం రమేష్ మృతి వెనక అసలు కారణాలు మాత్రం అంతు చిక్కడం లేదు. దాడికి అసలైన కారణం దొంగతనమే అయితే ఆ దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరరనేది అంతుచిక్కడం లేదు. గూడ్స్ రైలులో నుంచి బస్తాలు దొంగతనం చేసేందుకు నిరాకరించాడనే కారణంతో దాడికి పాల్పడితే ఎన్ని నెలల నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నాయనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైల్వే సిబ్బంది ప్రమేయం లేకుండానే బస్తాల దొంగతనం ఎలా సాధ్యమవుతుంది..? అనే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మండల ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేసేందుకు సహాయం చేయకపోవటంతో ఆగ్రహించిన స్నేహితులు ఆత్రం రమేష్పై దాడికి పాల్పడటంతో విషయం బయటపడింది. కాలితో తట్టడంతోనే ఆత్రం రమేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నా దాడిలో చాలామంది ఉండి ఉంటారని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే నిందితులు బయటపడే అవకాశం ఉందని మండల వాసులు అంటున్నారు. బస్తాల దొంగతనం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోంది..? రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్లో నిత్యం ఏదో ఒక గూడ్స్ రైలు నిలిచి ఉంటుంది. అలా ఆగి ఉన్న గూడ్స్ రైలులో నుంచి కొంతకాలంగా రాత్రి సమయంలో ఎరువుల బస్తాలను దొంగిలిస్తూ వాటిని రైతులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనుక మండలానికి చెందిన పలువురు వ్యక్తులే ఉన్నట్లు అనుమానాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం పంటల సీజనల్లో రసాయనిక ఎరువులు సరాఫరా అధికంగా జరిగే సమయాల్లో దొంగతనం జరుగుతుందని చెప్పుకుంటున్నారు. గూడ్స్ రైలు వచ్చి నిలిచిందనే సమాచారం తెలియగానే సూత్రదారులు తమ అనుచరులను రంగంలోకి దింపి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారని ప్రయాణికులు సైతం చెబుతున్నారు. రైలు బోగిల్లోని బస్తాలను స్టేషన్ చివర్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి గుట్టు చప్పుడు కాకుండా వాహనాల్లో తరలించి సమీప రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే స్టేషన్ ఆవరణలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా రైల్వే సిబ్బందికి ఏ మాత్రమూ తెలియకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దొంగతనం బయటకి రావద్దనే దాడి..? రైలులో నుంచి బస్తాల దొంగతనానికి పాల్పడుతున్న విషయం బయటకు పొక్కుతుందనే కారణంతోనే ఆత్రం రమేష్పై దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమేష్తోపాటు మరో వ్యక్తి కలిసి ముందుగా ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి బస్తాల దొంగతనం విషయం చెప్పారు. దానికి నిరాకరించగా మద్యం ఆశ చూపి ఆయనను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రైలులో నుంచి బస్తాలను దొంగతనం చేద్దామని తెలపగా మరోసారి నిరాకరించటంతో ఇద్దరు కలిసి ఆత్రం రమేష్పై దాడికి పాల్పడినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. అప్పటికే రైలులో నుంచి బస్తాలను దొంగలించి స్టేషన్కు చివరల్లో ఉన్న ముళ్ల పొదల్లో పడేసి వాటిని తరలించేందుకు ఆత్రం రమేష్ను సహాయం కోరినట్లు సమాచారం. దొంగతనం విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో ఆత్రం రమేష్పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవటంతో అక్కడి నుంచి జారుకున్నారు. బయటి వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు స్టేషన్కు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న రమేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. లోతుగా విచారిస్తే.. ఆత్రం రమేష్ మృతి కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉండగా, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కేసులో అసలు నిందితులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని గత శనివారం మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. దాంతో స్పందించిన కాగజ్నగర్ డీఎస్పీ వీవీఎస్ సుదీంద్ర కేసును రైల్వే పోలీసుల నుంచి తమ శాఖ పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఈ కేసు విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి నిందితులకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. రమేష్ మృతికి ముందు నుంచే కొందరు రాజకీయ నాయకులు బాధితుడి కుటుంబ సభ్యులకు డబ్బులు ఎరగా చూపి కేసు వాపస్ తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసుల విచారణలో దాడితో పాటు దొంగతనం వెనుక ఉన్న అసలు సూత్రదారులు బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమదైన శైలిలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
పండుగకు పిలిచి మరీ చంపారు
సాక్షి, ఆదిలాబాద్ : కట్టుకున్న భార్య, బావమరుదులే కాలయములై ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బావను పండగ కోసం ఇంటికి పిలిచి హతమార్చారు. అంతవరకు బక్రీద్ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాలు ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడలో నివాసం ఉంటున్న షేక్ ఆసీఫ్ (26)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సదాది కిన్వట్. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అనంతరం ఫిర్దోస్ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. ఫిర్దోస్, ఆసీఫ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యను వదిలిపెట్టి తనతో ఉండాలని ఫిర్దోస్ ఆసీఫ్తో గొడవ పడుతుండేది. పట్టణ మహిళా పోలీస్స్టేషన్లో సైతం ఈ విషయంలో గతంలో కేసు నమోదయింది. సోమవారం బక్రీద్ను పురస్కరించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో షేక్ ఆసీఫ్ బావమరుదులు సలీం, షారూఖ్ ఇంటికి పిలిచారు. మొదటి భార్యను వదిలేసి తమ సోదరితో కలిసి ఉండాలని కోరారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు బావమరుదులు ఆసీఫ్ను తీవ్రంగా కొట్టి, కత్తెరతో గుండెలో పొడిచారు. రక్తం మడుగులో ఆసీఫ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ వైద్యులు పరిశీలించి ఆసీఫ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్లో భార్య ఫిర్దోస్, బావమరుదులు సలీం, షారూఖ్, మామ అజీం, అత్త హలీమా, మరదళ్లు నసీమ, హీనాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..
సాక్షి, అదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మాయ మాటలు చెప్పి.. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మేసిన ఘటన కోమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాణి మండలం కొలం తెగకు చెందిన మతిస్థిమితం లేని గిరిజన మహిళను సమీప బంధువుతోపాటు ఓ వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకొని మధ్యప్రదేశ్లోని మండ్పుర్ జిల్లాలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కూతురు కనబడటం లేదని మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో, తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తండ్రిని మభ్యపెట్టారు. మహిళను మధ్యప్రదేశ్లో ఇంటి పనులకు వాడుకోవడమే కాకుండా.. శారీరకంగా నరకం చూపించడంతో తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశామని, నిందుతులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. గిరిజన మహిళలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్ సంస్థల దోపిడీ
సాక్షి, బోథ్: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల శవపేటికల్ని స్వగ్రామానికి రవాణా చేయడానికి అంబులెన్స్ సంస్థలు అందిన కాడికి బాధితుల నుంచి దోచుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలు, ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికుల శవాలు స్వగ్రామానికి రావడానికి నెలల తరబడి వేచి చూస్తున్న కుటుంబాల బలహీనతలు ఆసరా చేసుకొని అంబులెన్స్ల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటూ డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే బాధిత కుటుంబ సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన జలెందర్(38) ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం బహ్రెయిన్కు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి పడడంతో తలకు బలమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి కంపెనీ వారు ఈ నెల 3వ తేదీన జలెందర్ శవపేటికను హైదరాబాద్కు పంపారు. ఆధికారులు మృతుని అన్న కుమారుడు హరీష్కుమార్కు శవపేటికను అప్పగించి, ఉచిత అంబులెన్స్లో సాగనంపారు. హైదరాబాద్ నుంచి శవపేటికతో వెళ్లిన అంబులెన్స్లో నుంచి శవాన్ని గ్రామాస్థులు దించుకున్నారు. ప్రభుత్వానికి కిరాయికి సరఫరా చేసే శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ డ్రైవర్ జలెందర్ బంధువుల నుంచి బలవంతంగా రూ. 1500 వసూలు చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న హరీష్ కేసీఆర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ సర్వీసు సంస్థ ప్రతినిధి గూగుల్ పేలో డబ్బు వాపస్ ఇచ్చినట్లు హరీష్కుమార్ తెలిపారు. -
ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత
సాక్షి, సిర్పూర్: కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారెం మహేష్, గాదిరెడ్డి రాకేష్, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని శికిరం గ్రామానికి చెందిన సొక్కల శ్రీనివాస్లు బావిలో దిగి ఊపిరాడక బుధవారం మృతి చెందారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి జేసీబీ, ప్రోక్లియిన్లతో బావి చూట్టు తవ్వకాలు జరిపారు. బావిలో ఆక్సిజన్ నింపి బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బావి చుట్టూ తవ్విన మట్టిని జేసీబీల సహాయంతో పూడ్చివేశారు. రాత్రి కావడంతో పూర్తిగా పూడ్చివేత పనులు నిర్వహించలేదు. బావిని పూర్తిగా పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు. కంటతడి పెట్టిన ముత్తంపేట ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బంధువులు బావిలో దిగి మృతి చెందడంతో గ్రామంలోని యువకులు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బావిలో దిగి ముగ్గురు మృతి చెందిన వార్త మండలంలో సంచలనం రేపడంతో గురువారం ఉదయం యువకుల అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి మృతదేహాలకు నివాళ్లు అర్పించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు ఒకేసారి గ్రామంలో చివరి అంతిమ యాత్ర నిర్వహించడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరునా విలపించారు. -
వీళ్లూ మనుషులు కాదు మృగాళ్లు..
పట్టుమని పదినెలలు కూడా లేని చిన్నారి. తన చిరునవ్వులతో ఇంటిల్లిపాదిని అలరించేది. ఒక్కక్షణం కూడా ఆ బంగారుతల్లిని విడిచి ఉండలేం.. అలాంటి ముద్దులొలికే చిట్టితల్లి ఓ రాక్షసుడి చేతిలో బలైంది. తల్లిపక్కన వెచ్చగా ఒదిగి పడుకున్న బంగారుతల్లిని ఎత్తుకెళ్లిన కిరాతకుడు మాటల్లో చెప్పలేని విధంగా మట్టుబెట్టాడు. వరంగల్లో జరిగిన చిన్నారి ఘటన జిల్లావాసులనూ కంటతడి పెట్టించింది. సరిగ్గా ఏడాదిక్రితం జిల్లాలోని సోన్లో ఓ చిట్టితల్లిపై జరిగిన దారుణాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. నిర్మల్: ఈ మధ్య వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. ‘అసలు వీళ్లు మనుషులేనా.. వీరికి మానవత్వం లేదా..’ అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా కారకులను అంతే కిరాతకంగా శిక్షించాలంటూ తమలోని ఆక్రందనను వ్యక్తంచేస్తోంది. మరోవైపు స్మార్ట్ఫోన్కు బానిసైన యువత అశ్లీల చిత్రాలను చూస్తూ.. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతోంది. జిల్లాలో ఏడాదిక్రితం.. బడికి సెలవొచ్చిందని.. తన స్నేహితురాలి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి ఓ మృగాడి బారిన పడింది. తన స్నేహితురాలి మామ కావడంతో తానూ ‘మామా..’ అనే ప్రేమగా పిలిచింది. కానీ.. ఆ దుర్మార్గుడు అప్పటికే అశ్లీల దృశ్యాలు చూడటానికి బానిసయ్యాడు. వాటి ప్రభావంతో మృగాడిగా మారాడు. చిన్నారి అని కూడా చూడకుండా పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన గురించి ఎక్కడ చెబుతుందోనని ఇటుక రాయితో ముఖంపై దాడిచేసి, దారుణంగా చంపేశాడు. ఇదంతా గతేడాది ఇదేనెల 16న సోన్ మండల కేంద్రంలో జరిగిన ఘటన. తమ ముందు ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నితల్లి విగతజీవిగా మారడంతో సోన్ ఊరంతా ఆరోజు ఆగ్రహంతో ఊగిపోయింది. గతంలో పలు ఘటనలు.. జిల్లాలోనూ గతంలో అభంశుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. వావివరసలు లేకుండా.. తాత వయసున్న ‘మృగాడు’ ఓ చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. గత ఏప్రిల్ 7న సోన్ మండలకేంద్రంలోనే ఎనిమిదేండ్ల బాలికపై యాభయ్యేళ్ల వృద్ధుడు బాలయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రిపూట ఇంట్లో అందరూ పెళ్లి సందడిలో ఉండగా చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పడంతో నమ్మి వచ్చిన చిన్నారికి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. రెండేళ్ల కిందట లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్లో రెండున్నరేళ్ల చిన్నారిపై సతీశ్ అనే యువకుడు లైంగికదాడికి యత్నించాడు. 2014 ఆగస్టులో సారంగపూర్ మండలంలోని ధనిలో శ్రీకాంత్ అనే యువకుడు ఆరేళ్ల్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతేడాది దిలావర్పూర్ మండలకేంద్రంలో ఓ కిరాణ దుకాణాన్ని నడిపించే వ్యక్తి కుమారుడైన బాలుడు ఓ చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. ఊరికి పెద్దగా.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకోవాల్సిన వాళ్లే నయవంచకులుగా మారిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఓ ఆడపిల్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లక్ష్మణచాంద మండలంలో ఓ సర్పంచ్ లైంగిక దాడికి పాల్పడి జైలుకు వెళ్లాడు. ఇక లోకేశ్వరం మండలానికి చెందిన ఓ నాయకుడు తనకు సహకరించని యువతులపై వేధింపులకు దిగాడు. యువతులు, మహిళలపై వేధింపులు జిల్లాలో చిన్నారులతో పాటు యువతులు, మహిళలు, ఉద్యోగినులపై వేధింపులు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి చదువుకోవడానికి, ఉపాధి కోసం వస్తున్న యువతులే లక్ష్యంగా జిల్లాకేంద్రంలో వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో మహిళలు, యువతులతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. సైగలు చేస్తూ.. వేధిస్తున్న ఘటనలు చాలాసార్లు బయటపడ్డాయి. బతుకుదెరువు కోసం దుకాణాల్లో పనిచేస్తున్న యువతులతోనూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కళాశాలల్లో చదువులు చెప్పాల్సిన అధ్యాపకుల్లోనూ కొందరు మృగాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాకేంద్రంలోని ఓ కళాశాలలో, ఓ పాఠశాలలో గతేడాది జరిగిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాయి. ఒకట్రెండు శాఖల్లో మృగాళ్ల చేష్టలు భరించలేక ఉద్యోగం మానేయడం, బదిలీ చేయించుకోవడం వంటివీ జరిగాయి. చాలామంది పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మళ్లీ తమ పరువే పోతుందన్న భయంతో బయటకు రావడం లేదు. షీటీమ్లు ఎక్కడ? మహిళలపై ఈవ్టీజింగ్, దాడులను నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖ షీటీమ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇవి జిల్లాకేంద్రానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇందులోనూ సరిపడా సిబ్బంది లేకపోవడంతో అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. తరచూ విద్యార్థినులు, యువతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉన్నా.. అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున కళాశాలలు, విద్యాలయాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సఖీ కేంద్రాన్ని సంప్రదించాలి మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరం. ఇలాంటి ఘటనల్లోని బాధితులు నేరుగా సఖి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. చాలామంది పోలీసుల వద్దకు వెళ్లి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా మహిళల స్వేచ్ఛ, హక్కులు, రక్షణ కోసం సఖి కేంద్రం కృషిచేస్తుంది. సమస్యను నేరుగా చెప్పడానికి ఇబ్బంది పడేవారు టోల్ ఫ్రీ నంబర్ 181 లేదా సఖి కేంద్రం 85005 40181 నంబరులో సంప్రదించవచ్చు. – మమత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు,నిర్మల్ -
ఫెయిల్ అవుతానన్న బెంగతో ఆత్మహత్య
కాగజ్నగర్: పరీక్షలో ఫెయిల్ అవుతానన్న బెంగతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాగజ్నగర్లో చోటు చేసుకుంది. సీఐ తెల్లబోయిన కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్, అంజుమ్బేగం దంపతుల కుమార్తె ఫిజా ఫిర్దౌజ్(15) స్థానిక వీఐపీ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. మార్చిలో వార్షిక పరీక్షలు రాసిన ఫిర్దౌజ్ ఫలితాల కోసం వేచిచూస్తోంది. కాగా రెండు రో జులుగా పరీక్షలు బాగా రాయలేదని ఆందోళన చెందుతుంది. ఈ భయంతో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫిజా ఫిర్దౌజ్ బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అన్వర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దబ్బాయి అమాన్ హైదరాబాద్లో డిగ్రీ చదువుతుండగా రెండోబ్బాయి నౌమాన్ కాగజ్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కూతురు ఫిజా ఫిర్దౌజ్ పదో తరగతి పూర్తిచేసింది. వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేదని గత రెండు రోజులుగా బెంగతో ఉందని కుటుంబీకులు తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు వేకువ జామున సహెర్ చేసి ఉపవాస దీక్ష పట్టి మళ్లీ నిద్రపోయారు. అయితే 9 గంటల ప్రాంతంలో ఫిర్దౌజ్ బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాత్రూం నుంచి పోగలు రావడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి పూర్తిగా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ కిరణ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక తండ్రి అన్వర్ ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
అనుమానమే పెనుభూతమై..
రెబ్బెన(ఆసిఫాబాద్): కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానానికి తోడు అదనపు కట్నంకోసం జీవితాంతం తోడుగా నిలవాల్చిన భర్తే భార్యను కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలం నారాయణపూర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన కుడికాలు రామకృష్ణ ఆటోడ్రైవర్. ఈయనకు తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సరిత (27)తో 2011లో వివాహమైంది. వీరికి అరవింద్ (7), శ్రీనిధి(5) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లుగా రామకృష్ణ భార్య సరితపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటినుంచి కలహాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలోనే రామకృష్ణ తల్లి కమల, తండ్రి హన్మంతుతో కలిసి సరితను అదనపు కట్నంకోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నారాయణపూర్ గ్రామంలో సరిత పేరుపై రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా.. దానిని అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. దానికి సరిత ససేమిరా అనటంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. దీంతో ఎలాగైనా సరితను అంతమొందించాలనే పథకం పన్నిన రామకృష్ణ.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న సరిత తలపై బలమైన ఆయుధంతో మోదడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రెబ్బెన సీఐ రమణమూర్తి, ఆసిఫాబాద్ సీఐ మల్లయ్య, ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు ములుకుట్ల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.