-
లాల్ సింగ్ చద్దా.. నన్ను ఆడిషన్ చేశారు.. కానీ!: ఆమిర్ తనయుడు
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఇందులో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఆమిర్ చేయాల్సిన పాత్ర కోసం ముందుగా తనను ఆడిషన్ చేశారని చెప్తున్నాడు ఆయన తనయుడు, నటుడు జునైద్ ఖాన్. జునైద్ ఇటీవలే మహారాజ్ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నిజానికి లాల్ సింగ్ చద్దా కోసం నన్ను ఆడిషన్ చేశారు. ఈ మూవీ నేను చేస్తే బాగుండని నాన్న ఎంతగానో అనుకున్నారు. కానీ కుదరలేదు అని తెలిపాడు.కుమారుడికి స్క్రీన్ టెస్ట్ఈ విషయాన్ని ఆమిర్ గతంలోనూ వెల్లడించాడు. లాల్ సింగ్ చద్దా కోసం మొదటగా జునైద్కు స్క్రీన్ టెస్ట్ చేశారని తెలిపాడు. కాగా లాల్ సింగ్ చద్దాలో కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మహారాజ్ సినిమా..మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. 1862లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. జైదీప్ అహ్లావత్, షాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్గా స్టార్ హీరో! -
విడిపోయినా కలిసికట్టుగానే.. మాజీ భార్యతో హీరో ఫన్డే
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి ముఖం మరొకరు చూడటానికే ఇష్టపడరు. అలాంటిది సన్నిహితంగా మెదులుతారా? సమస్యే లేదు! కానీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్రావు మాత్రం విడిపోయినా సరే దంపతుల్లా కలిసి షికార్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన వారెవరూ డివోర్స్డ్ కపుల్ అనుకోనే అనుకోరు.వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసిన వీళ్లు రావ్- ఖాన్ హాలీడే అని రాసుకొచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి ఓ ఫోటోల కూడా దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుస్సేన్ 90వ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలు స్పెషల్గా ఉండాలని బంధువులు, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా ఉన్నారు.చదవండి: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ -
మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న స్టార్ హీరో.. ఎన్ని కోట్ల ఖరీదంటే?
రీసెంట్ టైంలో స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కొత్త ఇల్లు కొనేసి, ఓ ఇంటి వాళ్లవుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ మంది బంగ్లా లేదా ఫ్లాట్ కొనడంలో కాస్త ముందుండేవాళ్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి హీరో ఆమిర్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే అరడజనుకి పైగా ఇళ్లని కొనుగోలు చేసిన ఇతడు.. తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ముంబైలోని చాలా ఖరీదైన ప్రాంతంగా పేరున్న పలిహలి ఏరియాలో ఓ సూపర్ లగ్జరీ రెడీ టూ మూవ్ అపార్ట్మెంట్ని ఆమిర్ ఖాన్ ఇప్పుడు కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది. ఇందుకోసం రూ.58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడని జాతీయ న్యూస్ సైట్లు రాసుకొచ్చాయి.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆమిర్ ఖాన్కి ముంబైలోని మెరీనా, బాంద్రాలో సముద్రం ఒడ్డున, పంచగనిలో ఫామ్ హౌస్ ఉన్నాయి. అలానే ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఆమిర్.. ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రెండో భార్య కిరణ్ రావ్కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడు.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్గా టాలీవుడ్ హీరో) -
నాన్న సలహాలు లైట్ తీసుకున్నాం, ఇది తన మూవీ కాదు!: ఆమిర్ కుమారుడు
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, దంగల్, పీకే, గజిని, 3 ఇడియట్స్, రంగ్దే బసంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో భారీ బ్లాక్బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. తను చూడని విజయాలంటూ ఏమీ లేవు. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ ఇటీవలే మహారాజ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. స్క్రీన్టెస్ట్కు పిలిచారుఎంతో అనుభవం ఉన్న ఆమిర్ ఈ మూవీ చూసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కానీ అవన్నీ తామసలు లెక్క చేయలేదంటున్నాడు జునైద్. 'డైరెక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఒకసారి స్క్రీన్టెస్ట్ చేయాలని రమ్మన్నాడు. అలా మహారాజ మూవీకి నన్ను తీసుకున్నారు. బహుశా దర్శకనిర్మాతలు నన్ను రొమాంటిక్ నటుడిగా చూడలేదేమో! అందుకే ఇలాంటి కాన్సెప్ట్కు ఎంచుకున్నారు. నాన్నతో ఎక్కువగా చెప్పలేదుఎందుకో తెలీదు గానీ ఈ మూవీకి ముందు కొంత రాద్ధాంతం జరిగింది. అయితే ఈ చిత్రం ద్వారా మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు. మహారాజ గురించి మా నాన్నతో ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఆయన తన పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పైగా ఇది తన సినిమా కానే కాదు. నాన్న సలహాలుఅంతా అయ్యాక సిద్దార్థ్ సర్, నిర్మాత ఆదిత్య చోప్రా సర్ నాన్నకు సినిమా చూపించారు. తనకు సినిమా నచ్చింది. అలాగే కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిలో కొన్ని సలహాలు తీసుకుని పాటించారు. మరికొన్ని లైట్ తీసుకున్నారు. ఆయన కూడా మా సినిమాలో మరీ అంత జోక్యం చేసుకోలేదు. కానీ మాకేదైనా డౌట్ ఉందంటే మాత్రం దాన్ని టక్కున తీర్చేవారు' అని జునైద్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘ఏం జరిగిందో మీకే తెలియాలి'.. తిరుమలలో నటి హేమ వ్యాఖ్యలు -
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
సితారే జమీన్ పర్ పూర్తి
ఆమీర్ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆర్ఎస్ ప్రసన్న.అంతేకాదు.. ‘సితారే జమీన్ పర్’ సినిమాని ఈ డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఆమీర్ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ తెరకెక్కుతోందట. ఆ సినిమాలో ఓ బాలుడిలో స్ఫూర్తి నింపే పాత్ర చేశారు ఆమీర్ఖాన్ . అయితే ‘సితారే జమీన్ పర్’ లో ఆమీర్ఖాన్ పాత్రను పిల్లలే మోటివేట్ చేస్తారని, ఇదే ఈ సినిమా బేసిక్ స్టోరీ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. -
అమ్మ కోసం స్టార్ హీరో గ్రాండ్ పార్టీ : 200 మందికి పైగా అతిథులు
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల ఎంపిక లోనూ, అద్భుతమైన నటనలోనూ అతనికి అతనే సాటి. మూడు పదుల తన సినిమా కరియర్లో ఎన్నో క్లాస్, మాస్ సినిమాలను అందించడమే కాదు, అనేక అవార్దులను కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్యామిలీ , పిల్లలు, ఇరా, జునైద్, ఆజాద్ పట్ల బాధ్యతగా ఉండే ఆమీర్ తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్లకు మంచి కుమారుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన తల్లి 90వ పుట్టిన రోజును అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి వార్త హల్చల్ చేస్తోంది.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, జూన్ 13, అమీర్ తల్లి జీనత్ హుస్సేన్ బర్త్డే. ఈ నేపథ్యంలో గ్రాండ్ పార్టీని ప్లాన్ చేశాడట. కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడిన 200 మందికి పైగా అతిథులతో గ్రాండ్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. ముంబై నివాసంలో ఈ పార్టీ జరగనుంది. బనారస్, బెంగళూరు, లక్నో, మైసూర్ తదితర నగరాల నుండి తరలి రానున్నారు.2022లో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఈ క్రమంలో తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకుని, కోలుకున్న సందర్భంగా అందర్నీ కలిసేందుకు ఆమె పుట్టిన రోజుకంటే మంచి సందర్భం ఏముంటుందని భావించారట. కాగా గతంలో మదర్స్ డే సందర్భంగా తన తల్లిని బెస్ట్ మామ్ ఇన్ద వరల్డ్ అంటూ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు ఆమీర్. -
రెంట్ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్ హీరో మాజీ భార్య!
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్బస్టర్ మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్టైజింగ్ సంస్థల్లో పనిచేశా. లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్టైజింగ్ జాబ్స్తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్ రావు.. హీరో అమిర్ ఖాన్కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్న ఘున్ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
లవ్ మ్యారేజ్.. అరేంజ్డ్ మ్యారేజ్.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్ నటి జీనత్ అమన్ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్ ఖాన్- కిరణ్ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.పేరెంట్స్ బలవంతం వల్లే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్స్టిట్యూట్లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది.కోతులుగా ఉన్నప్పుడు..కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్ సైకాలిజస్ట్ ఎస్తర్ పెరల్ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడిదానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.అప్పుడు పరిచయం మాత్రమేకాగా ఆమిర్.. కిరణ్ రావు 'లగాన్' సినిమా సెట్స్లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్ హీరోగా నటించగా కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్ మంగళ్ పాండే, కిరణ్ రావు స్వదేశ్ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్ యాడ్స్కు కలిసి పని చేశారు. డేటింగ్.. పెళ్లిఅప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. 2021లో ఆమిర్- కిరణ్ విడిపోయారు.చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్ -
మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ అనే కుమారుడు, ఇరా ఖాన్ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్ దంపతులు విడాకులు తీసుకున్నారు.విడాకులు2005లో ఆమిర్.. కిరణ్ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఆమిర్ హాజరయ్యాడు.షోలో ఆమిర్ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. రెండు సినిమాలూ వర్కవుట్ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్ కపిల్ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్ వేశాడు.టైం వేస్ట్!ఇంతలో అర్చన పూరన్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్.. సెటిల్ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్ లాహోర్ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Ab hogi comedy ki dangal with one and only Aamir Khan 😁Dekho #TheGreatIndianKapilShow this Saturday 8 pm sirf Netflix par ✨ pic.twitter.com/ukDIKk0U2D— Netflix India (@NetflixIndia) April 24, 2024 చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన దర్శకనటుడు -
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు. బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान 🇮🇳🇮🇳🇮🇳देशहित में जारी🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/hJkEFEL5vG — Mini Nagrare (@MiniforIYC) April 14, 2024 -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్నగర్లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్లోని జామ్నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
దంగల్ ఆడిషన్.. నన్ను సెలక్ట్ చేయలేదు: హీరోయిన్
ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. చిన్నప్పుడు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో చిన్ని డ్యాన్సర్గా అలరించింది. ఎనిమిదేళ్ల వయసులోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. తర్వాతి కాలంలో డ్యాన్సర్గానే కాకుండా నటిగానూ అలరిస్తూ వస్తోంది. ఆ సినిమాలకు రిజెక్ట్.. మేరీ మా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహాని సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 వంటి సినిమాలతో పాటు పలు సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. అయితే కొన్ని ఆడిషన్స్లో తనను రిజెక్ట్ చేశారంటోందీ బ్యూటీ. తాజాగా ఆమె స్టార్ హీరో నిర్మించిన లాల్పట్టా లేడీస్ సినిమా ప్రీమియర్కు హాజరైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆమిర్ను కలిసింది. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు కలిశా అయితే ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది. దంగల్, సీక్రెట్ సూపర్స్టార్ సినిమాల ఆడిషన్స్కు వెళ్లానని, అప్పుడు ఆయన్ను కలిశానంది. ఆ రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చానని, వర్క్షాప్కు కూడా వెళ్లానని కానీ తనను సెలక్ట్ చేయలేదని తెలిపింది. అయితే ఆమిర్ మాత్రం తనను మెచ్చుకున్నాడని చెప్తూ ఉబ్బితబ్బిబైపోయింది. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
ఒకరంటే ఒకరికి గౌరవం.. ఒక్కసారి కూడా గొడవపడలే!
విడాకులెందుకు తీసుకుంటారు? సఖ్యత లేకో, భేదాభిప్రాయాలు రావడం వల్లో, గొడవలు తలెత్తడం వల్లో, ప్రేమ తగ్గిపోవడం వల్లో.. దూరమవుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెలబ్రిటీ జంట మాత్రం మాకసలు గొడవలే లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిరణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమిర్.. రీనా దత్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అతడికి రెండో పెళ్లి. విడాకులు తీసుకునేముందు గొడవ? ఆమిర్-కిరణ్.. సరోగసి ద్వారా 2011లో ఆజాద్ రావుకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడవపడ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భర్తతో నేను బాగానే ఉంటాను. తల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్దరం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి అంటుంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మా అనుబంధం అలాంటిది కానీ ఆమిర్, నేను మాత్రం ఎప్పుడూ గొడవపడలేదు. వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చావి కానీ ఎన్నడూ గొడవపడలేదు. మేము ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం, ఒకరినొకరం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒకరు చెప్పేది మరొకరు వింటుంటాం. బహుశా దానివల్లే మా మధ్య ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. మా అనుబంధం అలాంటిది. అల్లకల్లోలానికి దారితీసే గొడవలు, చర్చలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజన్లు.. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మరి అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: బేబీ బంప్లో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమన్న మనోజ్ -
హనీమూన్లో స్టార్ హీరో కూతురు.. బీచ్లో విన్యాసాలు!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లాడింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ప్రారంభంలో వీరి వివాహం జరిగింది. ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉదయ్పూర్లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఈ మధ్యే కొత్త జంట హనీమూన్కు ఇండోనేషియా చెక్కేసింది. అక్కడ కూడా వర్కవుట్స్ వదలడం లేదు నుపుర్. హనీమూన్లో భాగంగా ఏయే ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ అన్నిచోట్లా ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఒలంపిక్స్కు వెళ్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ హనీమూన్ ఎలా ఉంది? అని భర్తను కొంటెగా అడుగుతూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ వైరల్గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హనీమూన్ ఎంజాయ్ చేయకుండా ఈ యోగా ఏంట్రా బాబూ.. ఈయన్ను ఒలంపిక్స్కు పంపించండి, ఐరా నువ్వు పెళ్లాడింది మనిషిని కాదు, కోతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమిర్ దగ్గరే పని చేసి అతడి కూతురికే లైన్.. కాగా నుపుర్ శిఖరే.. బాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలకు ఫిటెన్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. అలా ఆమిర్ ఖాన్ దగ్గర కొంతకాలంపాటు ఫిట్నెస్ కోచ్గా పనిచేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. జనవరిలో వీరి పెళ్లి, రిసెప్షన్ వేడుకలు జరిగాయి. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
ఆ బాలీవుడ్ స్టార్తో నన్ను పోల్చవద్దు: హీరో
తమిళ హీరో ఆర్జే బాలాజి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగపూర్ సెలూన్. మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, లాల్, అరవిందస్వామి ముఖ్య పాత్రలు పోషించారు. గోకుల్ దర్శకత్వం వహించగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించారు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో సింగపూర్ సెలూన్ సక్సెస్మీట్ నిర్వహించారు. అలాంటి వ్యక్తి లైఫ్లో ఉంటే బాగుండు ఈ సందర్భంగా ఆర్జే బాలాజి మాట్లాడుతూ.. సింగపూర్ సెలూన్ చిత్ర విజయం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మూవీలోని అరవిందస్వామి పాత్రను చూసి ఇలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారన్నారు. అంత ఉత్తమ నటనను ప్రదర్శించిన అరవిందస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తొలివారంలో ప్రేక్షకులకు నచ్చేసిన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టాలనే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పోల్చొద్దు నటుడు చిన్ని జయంత్ తనను సౌత్ ఇండియన్ అమీర్ ఖాన్ అని పేర్కొనడంతో భయం కలిగిందన్నారు. ఆయన లెజెండ్ అని, ఆయనతో తనను పోల్చరాదన్నారు. తనలోని నటనను బయటకు తీసిన దర్శకుడు గోకుల్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిర్మాత ఐసరి గణేశ్ తనకు తండ్రి లాంటివారని, ఎల్కేజీ 2, మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలను చేయాలన్న ఆలోచన ఉందని, వాటిని ఐసరి గణేశ్ సంస్థలోనే చేస్తానని చెప్పారు. చదవండి: 'దమ్ మసాలా' సాంగ్కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్ -
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్ది టౌన్గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్లో ఈ రిసెప్షన్కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్ఖాన్తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు.