శ్రీవారి ఆలయంలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌ | two cooks suspend in dwaraka tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌

Published Fri, Feb 9 2018 12:09 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

two cooks suspend in dwaraka tirumala

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల:  చినవెంకన్న ఆలయంలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే నేతి డబ్బాలను మాయం చేసిన ఘటనలో ఇద్దరు వంట స్వాములను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకొక్కటి 15 కేజీల బరువైన మూడు నేతి డబ్బాలు చోరీకి గురైనట్టు తెలుసుకున్న అధికారులు ఈనెల 5న ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచార్యులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మూడు నేతి డబ్బాలు అక్కడ దర్శనమిచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు వంట స్వాములను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement