మద్దూరు : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ముంబాయికి వెళ్లే బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నారాయణపేట నుంచి మద్దూరు మీదుగా ముంబాయికి వెళ్లే ఆర్టీసీ బస్సు మద్దూరు బస్టాండ్కు చేరింది. పాతబస్టాండ్ మీదుగా వెళ్లాల్సిన బస్సు పాతబస్టాండ్లోమిషన్ భగీరథ పైప్లైన్ పనులు జరుగుతుండడంతో ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వెళ్లడానికి బస్సుడ్రైవర్ బస్టాండ్లో సీసీ రోడ్డుపైకి బస్సును ఎక్కించే ప్రయత్నం చేశారు. సీసీ రోడ్డు వారం రోజుల క్రితమే వేయడంతో క్యూరింగ్ కోసం కట్టలు కట్టారు. దీంతో బస్సు అదుపుతప్పి బొల్తా పడబోయింది. బస్సు డ్రైవర్ ప్రయాణికులు గమనించడంతో బస్సును అపి అందులోని ప్రయాణికులను దింపేశారు. బస్సును సీసీ రోడ్డుపైకి తోశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తృటిలో తప్పిన బస్సు ప్రమాదం
Published Sat, Apr 7 2018 12:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఈవీలపై రోడ్ట్యాక్స్ బాదుడు
- టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
- కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
- లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!
- తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
- స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
- అనూహ్యంగా తెరపైకి జితేందర్
- హస్తినలో ‘బంగారు బోనం’
- ఏఐ కాంప్లెక్స్లో అందాల పోటీలు
- గుండెపోటుకు తేనెతో చెక్!
Advertisement
Comments
Please login to add a commentAdd a comment