మండల సభలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నం
మహబూబాబాద్ రూరల్: తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
మహబూబాబాద్ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గోనె ఉమారాణి అధ్యక్షతన జరిగింది. సభ జరుగుతుండగా జంగిలిగొండ ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలకృష్ణ ఒక్కసారిగా లేచి తమను పట్టించుకునే వారే లేరని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే నిధులు వినియోగించుకోండి అంటూ బాటిల్లోని పెట్రోల్ ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు బాలకృష్ణ వద్ద నుంచి బాటిల్ను తీసుకుని అతడిని వారించి కూర్చోబెట్టారు.
ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం
Published Wed, Mar 15 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఈవీలపై రోడ్ట్యాక్స్ బాదుడు
- టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి, కూతురు బలి
- కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
- లంచాల బాగోతంలో టీడీపీ కీలక నేత!
- తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
- స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
- అనూహ్యంగా తెరపైకి జితేందర్
- హస్తినలో ‘బంగారు బోనం’
- ఏఐ కాంప్లెక్స్లో అందాల పోటీలు
- గుండెపోటుకు తేనెతో చెక్!
Advertisement