హైకోర్టులో కర్నూలు జిల్లా పోలీసుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి హైకోర్టు ఈ నెల 15న బెయిల్ మంజూరు చేసిందని, అయితే అతను బహ్రెయిన్కు పారిపోయాడని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇతర నిందితులూ దేశం దాటేందుకు అతను సహకరించే ప్రమాదం ఉందని, ఇతనికి అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకుగాను వెంటనే అతని బెయిల్ను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. కర్నూలు గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం విచారించనున్నారు.
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి
Published Wed, May 28 2014 5:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement