ఆ రెండింటినీ హుస్సేన్సాగర్లా మార్చకండి | kcr reviews on water bodies of hyderabad | Sakshi
Sakshi News home page

ఆ రెండింటినీ హుస్సేన్సాగర్లా మార్చకండి

Published Thu, Jun 26 2014 3:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆ రెండింటినీ హుస్సేన్సాగర్లా మార్చకండి - Sakshi

గండిపేట, హిమాయత్సాగర్ జంట జలాశయాల్లో కలుషిత నీరు చేరుతోందని, ఆ రెండూ మరో హుస్సేన్సాగర్లా మారకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో ఆయన గురువారం నాడు సమీక్షించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం 12 నుంచి 15 డంపింగ్ యార్డులను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డంపింగ్ యార్డుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని తెలిపారు. నగర పరిధిలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement