దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టు
కరుణ్ నాయర్ సెంచరీ
వాయనాడ్ (కేరళ): ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో భారత ‘ఎ’ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టును డ్రాగా ముగించగలిగింది. 73/2 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు శుక్రవారం ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 309 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (192 బంతుల్లో 114; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు.
విజయ్ శంకర్ (142 బంతుల్లో 74 నాటౌట్; 12 ఫోర్లు), ముకుంద్ (200 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అతనికి అండగా నిలిచారు. చివరి రోజు విజయానికి భారత్ 371 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఇది కష్ట సాధ్యం కావడంతో భారత్ మ్యాచ్ను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. నాయర్, శంకర్ ఐదో వికెట్కు అభేద్యంగా 148 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించగా...రెండో రోజు ఆటలో భారత కెప్టెన్ రాయుడు (15) మాత్రమే విఫలమయ్యాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది.
‘డ్రా’తో గట్టెక్కిన భారత్ ‘ఎ’
Published Fri, Aug 21 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Related news by tags
-
ఉగ్రవాదుల కట్టడికి యువరక్తం!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులపై నిఘా పెట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పాత్ర అత్యంత కీలకం. దేశంలోని అనేక నగరాలతోపాటు హైదరాబాద్లోనూ ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడంలో ఐబీ తన మార్కు చూపించింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, ‘ఆన్లైన్ ఉగ్రవాదం’ నేపథ్యంలో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన మల్టీ ఏజెన్సీ కమిటీ (మ్యాక్) సమావేశంలో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్షా కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర పరిధిలో ఉన్న వివిధ ఏజెన్సీల అధినేతలు ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ వంటి నిఘా విభాగాల్లో అనుభవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం అనేది అందులో పనిచేసిన వారి అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనుభవజ్ఞులకు తోడు సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి యువ అధికారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.టెర్రర్ రిక్రూట్మెంట్లో పంథా మారిందిపుష్కరకాలంగా ఉగ్రవాదుల పంథా పూర్తిగా మారింది. ఒకప్పుడు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి ఏజెంట్లు వచ్చేవారు. 1998లో హైదరాబాద్ పాతబస్తీలో పట్టుబడిన మహ్మద్ సలీం జునైద్ ఆ కోవకు చెందినవాడే. ఇలా అనేకమంది ఏజెంట్లు పట్టుబడ్డారు. యువతను ఆకర్షించి, సరిహద్దులు దాటించి, శిక్షణ ఇచ్చి, తిప్పి పంపడంతో పాటు పేలుడు పదార్థాలు సైతం సరిహద్దు ఆవలి నుంచే పంపడంలో ఈ ఏజెంట్లు కీలకంగా వ్యహరించేవారు. అయితే దశాబ్దకాలంగా ఉగ్రమూకలు అప్డేట్ అయ్యాయి. యవతను ఆకర్షించి రిక్రూట్ చేసుకోవడం, వారిని ప్రేరేపించడం, శిక్షణ ఇవ్వడం, స్థానికంగా పేలుడు పదార్థాలు సమీకరించుకునే మార్గాలు సూచించడం... ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ప్రధానంగా ఐసిస్ ప్రాబల్యం పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. దీనికోసం ముష్కరమూకలు వివిధ రకాలైన సోషల్మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు డార్క్ వెబ్ వాడుతున్నాయి. హైదరాబాద్లో పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే వారికి చెక్ చెప్పేలా...హైటెక్ ఉగ్రవాదులకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారానే చెక్ చెప్పవచ్చని కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని శుక్రవారంనాటి మ్యాక్ సమావేశంలో అమిత్షా స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోపాటు మిషన్ లెర్నింగ్ టూల్స్ వినియోగించడం ద్వారా ఉగ్రవాదులు, వారి కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఆ విభాగంలో ప్రస్తుతం ఉన్న అధికారులకు తోడు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న యువకులను ఎంపిక చేసుకొని బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉగ్రవాదుల కంటే ఒక అడుగు ముందు ఉండటానికి ఇది అవసరమని అమిత్షా అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం కాలయాపనకు ఆస్కారం ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సంస్కరణలను అమలులోకి తీసుకురావాలని అమిత్షా స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు నిత్యం ముష్కరుల టార్గెట్లో ఉండే హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు కలిసి వచ్చే అంశమని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
జమ్మూలో దాడుల వెనుక...
కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్లోని బారాముల్లా వరకు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్ పంజాల్కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్లో కంటే అఫ్గాన్ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్–రాజౌరీ సెక్టార్లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్ వారి బ్రిగేడ్ను తూర్పు లద్దాఖ్కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్ కొంతమంది రిజర్వ్ బలగాలతో భర్తీ అయింది.ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.ఇటీవలి లోక్సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్పుర్ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్ సింగ్ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్ భల్లాను 52.8 శాతంతో జుగల్ కిషోర్ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్కు అవకాశం వస్తుంది. కశ్మీర్ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.జ్యోతీ మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు
జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో కొందరు భారత ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తాజగా పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో పాక్ దుశ్చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లి ప్రాంతంలో పాక్ సైన్యం క్యాంపును ఏర్పాటు చేసి, అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని సమాచారం.జమ్ముకశ్మీర్లోని దోడాలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా పాఠశాలలో ఉన్న ఆర్మీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. -
జమ్ముకశ్మీర్లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు.
Related News by category
-
రాష్ట్రపతి పాలన విధించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ, లోక్సభ పక్ష నేతలు వి.విజయసాయిరెడ్డి, పి.మిథున్రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో అదుపు తప్పిన శాంతి భద్రతలు, అధికార పార్టీ దాడులు, విభజన హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీలకే రక్షణ లేని దుస్థితి..ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులకు సైతం భద్రత లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ గూండాలు దాదాపు 500 మందితో వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. దాడులకు బరి తెగించిన టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్ సీపీకి చెందిన బాధితులపై నే కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగించేందుకు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్హత లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 45 రోజుల టీడీపీ పాలనలో 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరిగాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వేలాదిగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ గూండాలు వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలించేది? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 300 హత్యాయత్నాలు జరిగాయంటే ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చన్నారు. మౌనపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే బుధవారం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఫోటో ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, బడ్జెట్లో ఎక్కువ వాటా, విభజన హామీల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్న పెట్రో కెమికల్, రైల్వే జోన్, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై డిమాండ్ చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరగా మరో కీలక భాగస్వామి టీడీపీ మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. మాపై దాడి చేసి.. మాపైనే కేసులా?రెండుసార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైనా టీడీపీ గూండాలు అడ్డుకుని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. గృహ నిర్భంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి వాహనాలను దగ్ధం చేస్తే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వినుకొండలో రషీద్ది రాజకీయ హత్య అని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. -
కాళేశ్వరంపై సొంత నిర్ణయాలు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా ఇతర బరాజ్లను వినియోగంలోకి తెచ్చే విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. శనివారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో జరిపిన చర్చల సారాంశాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఢిల్లీలోనే ఉన్న ఆ శాఖ కార్యదర్శులు, రాహుల్ బొజ్జా, ప్రశాంత్ పాటిల్లను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి, తన అధికారిక నివాసంలో వీరితో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు చర్చించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక వచ్చేంతవరకు బరాజ్లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కాళేశ్వరం బరాజ్ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దని, నిపుణుల కమిటీ సూచనల మేరకే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి, అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సోమవారం ఎన్డీఎస్ఏతో మరోమారు భేటీ ఉన్న దృష్ట్యా, నిపుణుల సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు, ఇతర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్రెడ్డి మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది. అధిష్టానం పెద్దలతో భేటీ కానున్న సీఎంఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ రాష్ట్ర రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రుణమాఫీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్లో ‘కృతజ్ఞత సభ’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాహుల్ గాం«దీని ఆహా్వనించనున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ షెడ్యూల్ను బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించే అవకాశముందని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సీఎం చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతోనూ భేటీ? పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రేవంత్రెడ్డి కలుస్తారని తెలిసింది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశముందని చెపుతున్నారు. కాగా, సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వారు కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. -
రీల్స్ కోసం కెమెరా కొనేందుకు ఓనర్ ఇంట్లో చోరీ
ఢిల్లీ: ఇన్స్ట్రామ్లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.అందుకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది. కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. -
హార్ట్ బ్రేకింగ్ వీడియో: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్గావా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు. The result of 20 years of misgovernance by BJP is that goons have flourished in every district. This viral video is from village Mangava in Rewa district of Madhya Pradesh, in which women were forced to commit murder by some goons. And an attempt was made to take his life.… pic.twitter.com/2oF1KnhwI7— Bhopal Congress (@Bhopalinc) July 21, 2024 ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్నెట్ బంద్
చండీగఢ్: బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. నుహ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీస్ను నిలిపివేస్తున్నట్లు హర్యానా అడిషినల్ చీఫ్ సెక్రటరీ( హోం ) అనురాగ్ రస్తోంగి తెలిపారు. అసత్యాలు, పుకార్లు.. సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంనేందుకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్(ఎక్స్)పై సస్పెన్షన్ విధించామని పేర్కొన్నారు.మరోవైపు.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా నుహ్ జిల్లా మొత్తం భద్రత ఏర్పాట్లు చేసినట్ల పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నిర్వహించి ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, 15 మంది మృతి చెందారు. రాళ్లు విసిరి.. కార్లకు నిప్పుపెట్టారు. అదే రాత్రి గురుగ్రామ్లోని ఓ మసీద్పై దాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. ఆ తర్వాత కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. అప్పడు సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు.