-
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్ల్యాండ్ వేదికగా జరుగనుంది.రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్బోర్న్ వేదికగా జరుగనుంది.టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్లో జరుగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్లో)రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్లో)మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్లో)నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్బోర్న్లో)ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్కప్లో తమ్ముడి సెంచరీలు
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ముషీర్ ఖాన్కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్తో తలపడుతోంది. ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు. అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’ -
సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘దేశం మారితేనైనా ఫలితం ఉంటుందేమో!’
ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన 14వ సెంచరీ నమోదు చేశాడు. ధనాధన్ బ్యాటింగ్తో కేవలం 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. డబుల్ సెంచరీ దిశగా బ్యాట్ ఝులిపిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్పై ప్రశంసలు కురిపిస్తున్న టీమిండియా అభిమానులు.. అదే సమయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టు రేసులో ఎల్లప్పుడూ ముందే ఉన్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించడం లేదు. ప్రధాన జట్టుకు ఈ ముంబై ఆటగాడిని ఎంపిక చేయడం లేదు. అయితే, ఇంగ్లండ్ లయన్స్తో స్వదేశంలో మూడు అనధికారిక టెస్టు సిరీస్లో తలపడే భారత-ఏ జట్టులో మాత్రం చోటిచ్చారు. ఇందులో భాగంగా వామప్ మ్యాచ్లో 96 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలి అనధికారిక టెస్టులో 55 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకు ముందు సౌతాఫ్రికా గడ్డపై ఈ 26 ఏళ్ల ముంబై బ్యాటర్ మొత్తంగా 102 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టీమిండియా తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరం కాగా సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు పిలుపునిస్తారని అతడి అభిమానులు భావించారు. కానీ మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్తో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడంతో సర్ఫరాజ్కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు సెంచరీ బాదిన తర్వాత నెట్టింట బీసీసీఐపై ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. ‘‘తన బ్యాటింగ్లో తార స్థాయికి వెళ్లిన తర్వాత .. రెండు- మూడు ఛాన్సులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ జట్టు నుంచి తప్పిస్తారు. ఇదంతా భరించే బదులు.. అతడు ఉన్ముక్త్ చాంద్ను సంప్రదించి.. దేశం నుంచి వలస వెళ్లి.. అక్కడే క్రికెట్ ఆడుకుంటే మంచిది!! ఇక్కడుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్కు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మన సెలక్టర్ల ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు కదా. ఏదేమైనా అతడికి అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం’’ అంటూ ఫైర్ అవుతున్నారు. If you are him and not getting selected for test cricket,what are you thinking??? pic.twitter.com/uVzUfvNPTx — Irfan Pathan (@IrfanPathan) January 24, 2024 కాగా గత రంజీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున బరిలోకి దిగి సగటు 92.66తో 556 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021/22 సీజన్లో 982 పరుగులతో అతడు టాప్ స్కోరర్గా నిలిచాడు. HUNDRED FOR SARFARAZ KHAN...!!!! Hundred from just 89 balls against England Lions 🔥 India A lost 4 quick wickets in the space of 22 runs and then Sarfaraz show started - A special knock. pic.twitter.com/PDz5WGCfaj — Johns. (@CricCrazyJohns) January 25, 2024 ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఓవరాల్గా 65 ఇన్నింగ్స్లో 3751 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెటర్గా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్కు కూడా ఇదే గతి పట్టిస్తారేమోనంటూ అతడి అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
ఇంగ్లండ్పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన ఆర్సీబీ ప్లేయర్
ఓ ప్రాక్టీస్ మ్యాచ్, మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో లయన్స్.. భారత్-ఏ జట్టుతో తలపడుతుంది. పర్యటనలో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తి కాగా (డ్రా).. ప్రస్తుతం తొలి అనధికారిక టెస్ట్ జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 338 పరుగులు వెనుకపడి ఉంది. వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్.. ఇంగ్లండ్ లయన్స్తో సిరీస్లో భారత ఏ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ వరుస శతకాలతో విరుచుకుపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో లయన్స్పై 141 బంతుల్లో 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111 పరుగులు చేసిన పాటిదార్.. ప్రస్తుతం జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్లో 132 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన విధ్వంసకర శతకం (140) బాదాడు. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన పాటిదార్.. సహచరులు అభిమన్యు ఈశ్వరన్ (4), సాయి సుదర్శన్(0), సర్ఫరాజ్ ఖాన్ (4), ప్రదోష్ పాల్ (0), శ్రీకర్ భరత్ (15), మానవ్ సుతార్ (0), పుల్కిత్ నారంగ్ (18) విఫలమైనా ఒక్కడే భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తుషార్ దేశ్పాండే (23) సహకారంతో కష్టాల్లో (95/7) ఉన్న జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పాటిదార్కు జతగా నవదీప్ సైనీ (3) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ను 553 పరుగుల వద్ద డిక్లేర్ (8 వికెట్ల నష్టానికి) చేసింది. జెన్నింగ్స్ (154), జోష్ బోహన్నన్ (125) శతకాలతో సత్తా చాటగా.. అలెక్స్ లీస్ (73), మౌస్లీ (68), జాక్ కార్సన్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, సైనీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి మొదలవుతుంది. తొలి రెండు టెస్ట్ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్కు చోటు దక్కలేదు. తర్వాతి మూడు టెస్ట్ల కోసం ప్రకటించే జట్టులో పాటిదార్ చోటు ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), కేఎస్ భరత్ (వికెట్కీపర్), ధృవ్ జురెల్ (వికెట్కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
ఆఖరి మ్యాచ్లో టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్దే టీ20 సిరీస్
ముంబై: భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’పై గెలిచింది. ముందుగా భారత జట్టు 19.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష ఏడు పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇసీ వాంగ్, క్రిస్టీ, మ్యాడీ, లారెన్ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి నెగ్గింది. ఇసీ వాంగ్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ జట్టును విజయతీరానికి చేర్చింది. ఆంధ్ర అమ్మాయి బి.అనూష ఒక వికెట్ తీసింది. -
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత-ఏ జట్టు కెప్టెన్గా కేఎస్ భరత్
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సీనియర్లు రోహిత్, విరాట్ దూరంగా ఉండనుండగా.. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ పర్యటన టీ20 సిరీస్తో మొదలుకానుంది. కాగా, భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగానే భారత-ఏ జట్టు కూడా పర్యటనలో భాగం కానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. అలాగే సీనియర్ జట్టుతో ఓ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. భారత ఏ జట్టుకు ఆంధ్ర వికెట్కీపర్ కేఎస్ భరత్ నాయకత్వం వహించనున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్కు ముందు భారత-ఏ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఆడబోయే రెండో టెస్ట్కు ముందు రెండో మ్యాచ్ జరుగనుంది. తొలి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో దేశవాలీ స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, దేవ్దత్ పడిక్కల్,సాయి సుదర్శన్లకు చోటు లభించింది. రెండో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత ఏ జట్టులో జాతీయ జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలకు అవకాశం లభించింది. తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ప్రదోష్ రంజన్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, పుల్కిత్ నారంగ్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, తుషార్ దేశ్పాండే రెండో నాలుగు రోజుల మ్యాచ్కు భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎస్ భరత్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, నవదీప్ సైనీ మూడు రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ , ధ్రువ్ జురెల్ , ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పుల్కిత్ నారంగ్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, విధ్వత్ కావరప్ప, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. టీ20 సిరీస్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) వన్డే సిరీస్.. డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) టెస్ట్ సిరీస్.. డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్టౌన్) -
Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్ 128 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (29), కెప్టెన్ యశ్ ధుల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో 2 వికెట్లు, ముబాసిర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్.. నాడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్..!
కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్ను, పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించి ఫైనల్కు చేరాయి. ఫైనల్ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, ఇదే ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, 2013లో సింగపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్-23 జట్టును.. పాక్ అండర్-23 టీమ్ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్.. పాక్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఛాంపియన్గా నిలిచింది. India will face Pakistan in the Emerging Asia Cup final tomorrow! The last time they met was in 2013 when India won the Trophy under Suryakumar Yadav. KL Rahul won the Player of the match award in the final for scoring 93* runs. pic.twitter.com/Kj8FhqpuNZ — Johns. (@CricCrazyJohns) July 22, 2023 నాడు పాక్ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్ రాహుల్తో పాటు నాటి యంగ్ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్ పటేల్, ప్రస్తుత యూఎస్ఏ ఆటగాడు స్మిత్ పటేల్ ఉన్నారు. అలాగే నాటి పాక్ జట్టులో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (7) విఫలం కాగా.. మహ్మద్ రిజ్వాన్ (21), ఉమర్ వహీద్ (41), 10, 11వ నంబర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాదిర్ (33), ఎహసాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్ 3, సందీప్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు, సందీప్ వారియర్, అంకిత్ బావ్నే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), మన్ప్రీత్ జునేజా (51 నాటౌట్) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్లో ఉన్న నికిన్ జోస్కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
సెమీస్లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్లు ఇదివరకే సెమీస్కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్కు చేరిన భారత్, పాక్లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్, పాక్లకే ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్లో భారత్-పాక్లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్డౌన్లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
పాక్తో మ్యాచ్.. సంచలన స్పెల్తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్లో ప్రామిసింగ్ క్రికెటర్గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్కప్కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్చేస్తే సూపర్మార్కెట్ ఓనర్గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్తో మ్యాచ్లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్లో ఉన్న భారత్, పాక్లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లో విజయాలతో గ్రూప్ టాపర్గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు
విశాఖ స్పోర్ట్స్: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్కుమార్ రెడ్డి.. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్ కెరీర్కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. కోచ్ల శిక్షణలో నితీశ్ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్తో పాటు మీడియం పేస్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్రౌండర్గా మారాడు. ఏసీఏ అకాడమీ వైపు అడుగులు.. నితీశ్కుమార్ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్జోన్కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ నితీశ్ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్ నాగాలాండ్తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్కు 2017–18 సీజన్లో బీసీసీఐ అండర్–16 ఉత్తమ క్రికెటర్గా జగన్మోహన్ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది. అరంగేట్రం ఇలా.. నితీశ్ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్క్లాస్ క్రికెట్ మొదలెట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్లోనే సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్ జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్ అరంగేట్రం.. నితీశ్ కుమార్ 2023 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్రైజర్స్ హైదరాబాద్ నితీశ్ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నితీశ్ 2 మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని నితీశ్.. 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్ వెళ్లినా నా క్రికెట్ కెరీర్ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ తరఫున తొలి క్రికెటర్గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున క్రీజ్లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్–ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్కుమార్ రెడ్డి -
రాణించిన బ్యాటర్లు.. కెప్టెన్ సెంచరీ.. సైనీ కూడా దంచికొట్టాడు!
సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. జయంత్ యాదవ్ (83; 10 ఫోర్లు)తో పాటు సౌరభ్ కుమార్ (55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నవ్దీప్ సైనీ (50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జయంత్, సౌరభ్ ఏడో వికెట్కు 86 పరుగులు జోడించగా, సైనీ, ముకేశ్ కుమార్ (23 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఆఖరి వికెట్కు 68 పరుగులు జత చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లా ‘ఎ’ ఆటనిలిచే సమయానికి 49/2 స్కోరు చేసింది. షాద్మన్ ఇస్లామ్ (22 బ్యాటింగ్), మోమినుల్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్లు.. రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు. ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది. -
ఐదేసిన సౌరభ్ కుమార్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ జో కార్టర్ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్ క్లీవర్ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (2/48), ఉమ్రాన్ మాలిక్ (1/62), శార్ధూల్ ఠాకూర్ (1/44), ముకేశ్ కుమార్ (1/39) రాణించారు. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు డ్రా కాగా, ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందింది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. స్కోర్ వివరాలు.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్: 293 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 108, ఉపేంద్ర యాదవ్ 76; మ్యాథ్యూ ఫిషర్ 4/52) న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ (మార్క్ చాప్మన్ 92, సోలియా 54; సౌరభ్ కుమార్ 4/48, రాహుల్ చాహర్ 3/53) భారత్-ఏ రెండో ఇన్నింగ్స్: 359/7 డిక్లేర్ (రజత్ పాటిదార్ 109, రుతురాజ్ 94, ప్రియాంక్ పంచల్ 62; రచిన్ రవీంద్ర 3/65) న్యూజిలాండ్-ఏ రెండో ఇన్నింగ్స్: 302 ఆలౌట్ (జో కార్టర్ 111, మార్క్ చాప్మన్ 45; సౌరభ్ కుమార్ 5/103) -
రజత్ పాటిదార్ అజేయ శతకం.. కివీస్ ముందు భారీ టార్గెట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్ పాటిదార్ (135 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా కివీస్కు 406 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్ (రచిన్ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మ్యాచ్ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో పాటిదార్, రుతురాజ్, పంచల్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్ 2, సోలియా, కెప్టెన్ టామ్ బ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ఆటగాళ్లు చాప్మన్ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ 2, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 4, జో వాకర్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
Ind A vs NZ A: న్యూజిలాండ్తో సిరీస్.. కెప్టెన్గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన
New Zealand A tour of India, 2022- Unofficial ODI Series- Sanju Samson: న్యూజిలాండ్- ఏ జట్టుతో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు తెలిపింది. కేఎస్ భరత్, తిలక్ వర్మ ఈ జట్టులో కూడా! ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన 16 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టులో తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్ వర్మను కూడా ఈ జట్టుకు ఎంపిక చేశారు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ఏ జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా.. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు రెండో రోజు(శుక్రవారం) ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్లో భారత ఏ జట్టు.. కివీస్ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ తమిళనాడులోని చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022కు ప్రకటించిన జట్టులో కనీసం స్టాండ్ బై ప్లేయర్గా కూడా సంజూకు అవకాశం దక్కలేదన్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐపై సంజూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఏ’ జట్టుకు అతడిని కెప్టెన్గా నియమించడం పట్ల స్పందిస్తూ.. ‘బాగానే కవర్ చేశారులే’ అంటూ మరోసారి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఇండియా- ఏ జట్టు: సంజూ శాంసన్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ, రాజ్ అంగద్ బవా. చదవండి: కోహ్లి, రోహిత్లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. వెంకటేశ్ అయ్యర్కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ!