చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 26న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా తొలిసారిగా రెండు వేరు వేరు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా శాటిలైట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో అధికారులు గురువారం తెలిపారు.
సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శాటిలైట్లను ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 377 కిలోల బరువున్న ఎస్సీఏటీఎస్ఏటీ-1 శాటిలైట్ సముద్రాలు, వాతావరణ అధ్యయనంలో తోడ్పడనుంది.
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
Published Thu, Sep 22 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
- ‘నీట్’పై మాట్లాడితే రాహుల్ మైక్ కట్ చేశారు’’
- టీమిండియా ఒక అద్భుతం.. అదే మా కొంపముంచింది: ఇంగ్లండ్ కెప్టెన్
- Kalki2898AD ‘నవ్వొస్తోంది.. మేం రికార్డులకోసం చేయలేదు’! షాకింగ్ ట్వీట్
- ఎర్రటి ఎండ.. అమలాపాల్ కేరవాన్లో నుంచి దిగమంది: మేకప్ ఆర్టిస్ట్
- విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. ఆమెకు డైమండ్ రింగ్
- క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ నటి.. ఎమోషనల్ పోస్ట్
- జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్కు బెయిల్
- విశాఖలో దారుణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న పద్మిని ఆడియో
- దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి 13 మంది..
Advertisement