కన్నడ సినీ దర్శకుడు రాజేంద్ర బాబు కన్నుమూత!
Published Sun, Nov 3 2013 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, రచయిత డి రాజేంద్ర బాబు ఆదివారం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. 62 సంవత్సరాల రాజేంద్ర బాబు కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
మా నాన్నకు గుండెపోటు రావడంతో వెంటనే రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరకముందే కన్నుమూశారు అని వైద్యులు నిర్ధారించారని రాజేంద్ర బాబు కూతురు నక్షత్ర మీడియాకు తెలిపారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొద్దికాలంగా అస్వస్థతకు గురయ్యారన్నారు.
రాజేంద్ర బాబు 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్ లో పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఆయన కొన్ని తెలుగు, మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. 1987లో గోవిందా, మందాకిని నటించిన ప్యార్ కర్కే దేఖో అనే హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
నాను నన్న హెందతి, ఒలవినా ఉదుగోరే, రామాచారి, రామరాజ్యదల్లి రక్షసరు, హలుందా తవరు, అప్పాజీ, దిగ్గజారు, అమ్మ, ఎన్ కౌంటర్ దయానాయక్, బిందాస్ వంటి హిట్ చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు.
రాజేంద్ర బాబు మృతికి కన్నడ నటులు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, లోకసభ సభ్యులు రమ్యతోపాటు పలువురు సంతాపం వెలిబుచ్చారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement