సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజా సినిమా ‘రెయిడ్’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది. మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్ అనాలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ కమీషనర్ అమై పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది.
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్
Published Sun, Mar 18 2018 6:15 PM | Last Updated on Mon, Mar 19 2018 6:40 PM
Related news by tags
-
Olympics 2024: బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బెల్జియంతో హోరాహోరీగా సాగిన గురువారం నాటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సేన ఓటమిపాలైంది. దీంతో పూల్-బిలో భారత్ రెండోస్థానానికి పడిపోగా.. తాజా విజయంతో బెల్జియం టాప్లోకి దూసుకువెళ్లింది.కాగా భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, బలాబలాలను పరీక్షించుకునే క్రమంలో గ్రూపు దశలో.. నాలుగో మ్యాచ్లో భాగంగా వరల్డ్ నంబర్ వన్ బెల్జియంతో తలపడింది. నాకౌట్ దశకు ముందు ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న భారత్.. గెలుపొంది ఉంటే ఆత్మవిశ్వాసం ఇనుమడించి ఉండేది.ఉత్కంఠగా సాగిన మ్యాచ్అయినప్పటికీ టోక్యో గోల్డ్ మెడలిస్ట్ బెల్జియంకు భారత్ గట్టిపోటీనిచ్చింది. భారత్ తరఫున అభిషేక్ గోల్(18వ నిమిషంలో)తో మెరవగా.. బెల్జియం ప్లేయర్లలో తిబియూ స్టాక్బ్రోక్స్(33వ నిమిషంలో), జాన్-జాన్ డొమెన్(44వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఫలితంగా 1-2తో భారత జట్టు బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఇక బెల్జియం కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. తదుపరి మ్యాచ్లో భారత్ ఆఖరిగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.ఐర్లాండ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోగత ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి... పూర్వవైభవాన్ని గుర్తు చేసిన భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్లోనూ శుభారంభం అందుకుంది. ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న టీమిండియా 7 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్కు చేరింది. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు 2–0తో ఐర్లాండ్ను ఓడించింది.ఇక మంగళవారం ఐర్లాండ్తో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్తో సత్తా చాటాడు. మ్యాచ్ మొత్తంలో భారత్కు 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా.. అందులో కేవలం ఒక్క దాన్ని మాత్రమే గోల్గా మలచగలిగింది. మరోవైపు ఐర్లాండ్ 10 పెనాల్టీ కార్నర్ లను వృథా చేసింది. తొలి రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ చేసిన టీమిండియా... ద్వితీయార్థంలో గోల్ కొట్టలేకపోయింది. మన డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి ప్రయత్నాలను భగ్నం చేశాడు. గ్రూప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన ఐర్లాండ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా రెండు గ్రూప్ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్కు చేరుతాయి.ప్యారిస్ ఒలింపిక్స్-2024 పురుషుల హాకీ పూల్స్పూల్-ఏ: నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికాపూల్-బి: బెల్జియం, భారత్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్.చదవండి: Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..? -
కెప్టెన్ గా హర్మన్ప్రీత్ సింగ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెపె్టన్గా హర్మన్ప్రీత్ సింగ్... వైస్ కెప్టెన్గా హార్దిక్ సింగ్ వ్యవహరిస్తారు. గత టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. గోల్కీపర్ శ్రీజేశ్, మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడనున్నారు. భారత హాకీ జట్టు: హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), హార్దిక్ సింగ్ (వైస్ కెపె్టన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్కుమార్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, క్రెయిగ్ ఫుల్టన్ (హెడ్ కోచ్). -
Paris Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనబోయే భారత పురుషుల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. విశ్వ క్రీడల్లో ఆడబోయే 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు.కెప్టెన్గా అతడేడ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ను అతడికి డిప్యూటీగా ఎంపిక చేశారు. ఇక ఈ జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. కాగా 2016లో మొదటిసారిగా ఒలింపిక్స్(రియో) జట్టులో చోటు దక్కించుకున్న హర్మన్ప్రీత్ సింగ్.. 2020 టోక్యో క్రీడల జట్టులోనూ భాగమయ్యాడు. అదే విధంగా.. వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్కు ఇవి నాలుగో ఒలింపిక్స్. భారత హాకీ జట్టు డిఫెన్స్ విభాగం హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్లతో పటిష్టంగా ఉంది. ఇక మిడ్ ఫీల్డర్లుగా రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ సత్తా చాటుతున్నారు.అదే విధంగా ఫార్వర్డ్ లైన్లో అభిషేక్ , సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుజ్రాంత్ సింగ్ తదితరులు ఉండనే ఉన్నారు.ఇక వీరితో పాటు అదనపు ఆటగాళ్లుగా గోల్కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్, మిడ్ ఫీల్డర్ నీలకంఠ శర్మ, డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అందుబాటులో ఉండనున్నారు. కాగా తమ జట్టు అనుభవజ్ఞులైన, యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సమతూకంగా ఉందని చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ పేర్కొన్నాడు. ఇక జూలై 29 నుంచి ఒలింపిక్ క్రీడలు ఆరంభం కానున్నాయి.పారిస్ ఒలింపిక్స్కు భారత పురుషుల హాకీ జట్టుగోల్ కీపర్: శ్రీజేష్ పరాట్టు రవీంద్రన్డిఫెండర్లు: జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్మిడ్ ఫీల్డర్లు: రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్.తొలిసారి ఒలింపిక్స్ హాకీ జట్టులో చోటు దక్కించుకున్నది వీళ్లేజర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్. -
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో పుణేరీ బప్పా టీమ్కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 7) రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్లోకి చేరకముందే బ్యాట్కు అతని చేతికి కనెక్షన్ కట్టైంది. రుతురాజ్ బ్యాట్ క్రీజ్లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్ బ్యాట్ క్రీజ్కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. ఈ రనౌట్ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Ruturaj Gaikwad was dismissed in a bizarre fashion during Maharashtra Premier League (MPL).pic.twitter.com/zQHMxWt1kX— OneCricket (@OneCricketApp) June 7, 2024కాగా, ఈ మ్యాచ్లో రుతురాజ్ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పుణేరీ టీమ్ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్ (4-0-24-4) పుణేరీ టీమ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్లో పవన్ షా (32), రుతురాజ్ (29), యశ్ సాగర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్ (25), అజిమ్ ఖాజీ (31), నిఖిల్ నాయక్ (27 నాటౌట్), సత్యజిత్ (17 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్ను గెలిపించారు. -
వారెవ్వా విరాట్.. చిరుతలా పరిగెత్తుతూ! సంచలన రనౌట్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి మరోసారి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ సంచలన త్రో తో మెరిశాడు.కళ్లు చెదిరే త్రోతో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ను కింగ్ కోహ్లి రనౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్లో నాలుగో బంతిని డిప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే డిప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ లేకపోవడంతో సామ్ కుర్రాన్ రెండో పరుగుకు పిలుపునిచ్చాడు.ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ నాన్స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేసి స్టంప్స్ను పడగొట్టాడు. బంతిని అందుకునే క్రమంలో కోహ్లి బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి గురి మాత్రం తప్పలేదు. బంతి స్టంప్స్ను తాకే సమయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోకపోవడంతో రనౌట్గా వెనుదిరిగాడు. కోహ్లి రనౌట్ చూసిన సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్లో అదరగొట్టాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్లతో 92 పరుగులు చేశాడు.He's unfolding magic tonight 💫First with the bat & now on the field with that outstanding direct hit 🎯Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRCB | @imVkohli | @RCBTweets pic.twitter.com/6TsRbpamxG— IndianPremierLeague (@IPL) May 9, 2024
Related News by category
Advertisement
Comments
Please login to add a commentAdd a comment