హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ సేవలను వినియోగించుకుంటున్న వారు యాడ్ ఆన్ ప్యాకేజీ కింద కేవలం నెలకు రూ 99 చెల్లించి యప్టీవీలో అందుబాటులో ఉండే 200లకు పైగా లైవ్ టీవీ చానల్స్, రెండు వేలకు పైగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు, టీవీ షోలు లాంటి విభిన్న కార్యక్రమాలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు కలుగుతోంది. హైదరాబాద్లో ఏసీటీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకునే వారికి మనోరంజకమైన యప్టీవీ కార్యక్రమాలు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ సందర్భంగా యప్టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ కావాలని.. ఏసీటీతో ఒప్పందం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సర్వీస్ అందుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ఈ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
'ఏసీటీ'తో యప్టీవీ ఒప్పందం
Published Thu, May 26 2016 12:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఈ పాఠాలు అవసరం
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement