- ఒకే రోజు అక్కాచెల్లెలు మృతి
చింతమానుపల్లె(సి.బెళగల్):
మరణంలో అక్కాచెల్లెలు బంధం వీడలేదు. అక్క మరణాన్ని తట్టుకోలేక చెల్లి గుండె ఆగింది. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటన చింతమానుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగు చిన్న ఆంజనేయులు, హనుమంతు సోదరులకు ఇనగండ్ల గ్రామానికి చెందిన అక్కా చెల్లెలు సవరమ్మ(70), సరోజమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. సవరమ్మకు కడుపులో గడ్డలు ఉన్నాయంటూ 4 నెలలుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సవరమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తుండగా సరోజమ్మ గుండె పోటుకు గురై కుప్పకూలి పోయింది. అక్కాచెల్లెలు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.
అక్కా నీ వెంటే నేను
Published Sun, Oct 16 2016 1:24 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
- ఇవేం కష్టాలు తిరుమలేశా!
Advertisement