![ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది! - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/41497526366_625x300.jpg.webp?itok=RANXkUrL)
ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది!
Published Thu, Jun 15 2017 4:25 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
![ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది! - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/41497526366_625x300.jpg.webp?itok=RANXkUrL)
లాస్ ఏంజిల్స్ : హై-ఎండ్ ఆపిల్ ఐఫోన్లకు ధీటుగా గూగుల్ తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్లకు మరింత పోటీనిచ్చేందుకు తను తర్వాత తీసుకురాబోతున్న ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం ఏకంగా ఐఫోన్ల, ఐప్యాడ్ ల చిప్ ఆర్కిటెక్ట్ ను గూగుల్ తీసేసుకుంది. భారతీయ సంతతి ఇంజనీర్ మను గులాటిని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన కంపెనీలోకి నియమించుకుంది. మైక్రో-ఆర్కిటెక్ట్ గా ఎనిమిదేళ్లుగా గులాటి ఆపిల్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్ లో లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా చేరినట్టు తెలిసింది.
ప్రస్తుతం గులాటి ఆపిల్ నుంచి బయటికి వచ్చేయడం ఆ కంపెనీకి ఎదురుదెబ్బని పలువురంటున్నారు. చిప్ లకు సంబంధించి చాలా పేటెంట్లు ఆయన వద్దనే ఉన్నాయి. అంతేకాక వాటి వ్యవస్థాపకుడిగా గులాటికే క్రెడిట్ అంతా దక్కుతోంది. చిప్ డిజైన్ లో ఆయన 15 ఆపిల్ పేటెంట్ రైట్లను కలిగి ఉన్నారు. గూగుల్ సొంతంగా ఓ ప్రాసెసర్ ను అభివృద్ధి చేయాలని ప్లాన్ వేస్తోంది. తర్వాతి పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు సొంత చిప్ సెట్ల కోసం చిప్ నిపుణుల టీమ్ ను కూడా కంపెనీ భారీగా పెంచుతోంది. ప్రస్తుతం ఆపిల్ కు సొంత స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు ఉన్నాయి. కానీ గూగుల్ కు అలాంటివేమీ లేవు. గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లకు క్వాల్ కామే తన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లను సప్లై చేస్తోంది. దీంతో గూగుల్ కూడా సొంతంగా ప్రాసెసర్ల రెడీకి సిద్ధమైంది.
ఆపిల్ కొత్త చిప్ లు ఏ10ఎక్స్. ఇంటెల్, క్వాల్ కామ్ లకు బదులుగా ఆపిల్ సొంతంగా చిప్ లను తయారుచేసుకుంది. గతంలో 2010ఐప్యాడ్ ఏ4, ఏ9 చిప్ లకు గులాటినే బాధ్యత వహించేవారు. గులాటి అంతకముందు బ్రాడ్ కామ్, ఏఎండీల్లో కూడా పనిచేశారు. గులాటి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఆయన గూగుల్ లో చేరిన విషయాన్ని ధృవీకరిస్తోంది. ఆయన ప్రొఫైల్ లో గూగుల్ లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది.
Advertisement
Related news by tags
-
Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్లో, సత్యన్ 68వ ర్యాంక్లో ఉన్నారు -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్లో నెగ్గగా... తన సరీ్వస్లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
TT: 24 ఏళ్లపుడు.. మళ్లీ 40 ఏళ్ల వయసులో! రెండు స్వర్ణాలు.. రాజమండ్రి నుంచి
2006 మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు.. 24 ఏళ్ల యువ ఆటగాడు టేబుల్ టెన్నిస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు.. 40 ఏళ్ల వెటరన్ ఆటగాడు టేబుల్ టెన్నిస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ రెండు పతకాల మధ్య 16 ఏళ్ల అంతరం ఉంది. అయితే అప్పటి యువ ఆటగాడు, ఇప్పటి వెటరన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అదే దూకుడు, అదే పట్టుదల, అదే విజయకాంక్ష, అందుకోసం తీవ్రంగా శ్రమించే తత్వం! అతనే ఆచంట శరత్కమల్.. ఈ 16 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల ప్రస్థానంలో ఏకంగా 13 పతకాలు, వాటిలో 7 స్వర్ణాలు సాధించిన శరత్ కమల్ 41 ఏళ్ల వయసులోనూ ఆటే ప్రాణంగా దూసుకుపోతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మదరాసులో పుట్టి పెరిగిన ఈ తెలుగు ప్లేయర్ సుదీర్ఘ కాలంతో తన ఆటతో ప్రత్యేక ముద్ర వేసి భారత టేబుల్ టెన్నిస్కు పర్యాయపదంగా నిలిచాడు. ఎనిమిదేళ్ల క్రితం శరత్ కమల్ తుంటికి గాయమైంది. 20 సెంటీ మీటర్ల చీలిక రావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకునే క్రమంలో దాదాపు రెండు నెలల పాటు అతను వీల్చెయిర్లోనే ఉన్నాడు. ఆపై మరో మూడు వారాల పాటు క్రచెస్తోనే నడక. ఈ సమయంలో ఇంకా కెరీర్ కొనసాగుతుందని ఎవరూ అనుకోరు. శరత్ కూడా అదే భావనతో ఉన్నాడు. అయితే ఆటపై ఉన్న మమకారం అతనిలో పట్టుదలను పెంచింది. కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్నెస్ను అందుకోవడంపై దృష్టి పెట్టిన శరత్ మళ్లీ తన ఆటను మొదలుపెట్టాడు. పునరాగమనం ఏదో నామ్కే వాస్తేగా జరగలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన శరత్ తర్వాతి ఏడాది రియో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆపై కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజత, కాంస్యాలతో మెరిశాడు. అదే ఏడాది ఆసియా క్రీడల్లోనూ రెండు కాంస్యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఎదురులేకుండా అతను తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇది అతని మానసిక దృఢత్వాన్ని చూపిస్తోంది. ఆట మొదలుపెట్టిన కొత్తలో ఓటమి ఎదురైనప్పుడు తట్టుకోలేక తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే అలవాటు శరత్లో ఉండేది. గెలుపోటములను సమానంగా స్వీకరించలేకపోయాడు. ఈ లక్షణాన్ని తగ్గించేందుకు శరత్ తండ్రి, బాబాయ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే అనుభవంతో తర్వాతి రోజుల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శించిన శరత్ ఇప్పటి వరకు దానిని కొనసాగించడంలో సఫలమయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో.. శరత్ కమల్ తండ్రి శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి. ఆయనతో పాటు ఆయన సోదరుడు మురళీధర్రావుకూ టేబుల్ టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అయితే రాజమండ్రిలో శిక్షణకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో టీటీని కెరీర్గా మలచుకునే క్రమంలో మద్రాసు చేరారు. అక్కడ సాధన తర్వాత జాతీయ స్థాయి పోటీల వరకు వారు వెళ్లగలిగారే తప్ప పెద్ద స్థాయి కలలు కనలేకపోయారు. తర్వాతి దశలో టేబుల్ టెన్నిస్ కోచ్గా శ్రీనివాసరావు కొత్త ప్రయాణం మొదలైంది. సహజంగానే తాము సాధించలేనిదాన్ని తమ శిష్యుల ద్వారా సాధించాలనే కోరిక, తపన కోచ్లలో ఉంటుంది. అలా అక్కడ ఆయన కోచింగ్ మొదలైంది. ఆ క్రమంలో శిక్షణ పొందుతూ వచ్చినవారి జాబితాలో కొద్ది రోజులకే ఆయన కొడుకు కూడా చేరాడు. పసివాడిగా ఉన్నప్పుడు తండ్రి వెంట కోచింగ్ కేంద్రానికి వెళుతూ వచ్చిన శరత్కూ టీటీపై ఆసక్తి పెరగడం శ్రీనివాసరావు పనిని సులువు చేసింది. ప్రాథమికంగా ఓనమాలు నేర్పించిన తర్వాత కమల్లో నిజంగానే అరుదైన ప్రతిభ ఉందని గుర్తించిన తండ్రి సరైన శిక్షణతో బాగా ప్రోత్సహించాడు. దాంతో తమిళనాడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అతను పాల్గొనడం మొదలైంది. అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–17లలో రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్లో శరత్ హవా సాగింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆటను కొనసాగించాలా లేక ఇంజినీరింగ్ వైపు వెళ్లాలా అని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫలితాలు సాధిస్తూ కూడా ఆటను వదిలిపెట్టిన చాలామంది గురించి శ్రీనివాసరావుకు బాగా తెలుసు. కానీ తన కుమారుడి విషయంలో మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదు. టీటీపైనే దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేశాడు. దాని ఫలితాలు ఆ తర్వాత అద్భుతంగా వచ్చాయి. అలా మొదలైంది.. సరిగ్గా 20 ఏళ్ల వయసులో శరత్కమల్ 2002లో తొలిసారి జాతీయ చాంపియన్షిప్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆపై భారత జట్టుకు కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంప్కీ ఎంపికయ్యాడు. జూనియర్ కావడంతో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అవకాశం రాకపోయినా సీనియర్ల సాహచర్యంలో ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది. తర్వాతి ఏడాదే అతను తొలిసారి జాతీయ చాంపియన్షిప్లో (2003) విజేతగా నిలవడంతో భారత టీటీలో కొత్త మార్పుకు అంకురార్పణ జరిగింది. 2003లో జరిగిన టీటీ ప్రపంచ చాంపియన్షిప్ శరత్ కెరీర్లో తొలి మెగా టోర్నీ కాగా, తర్వాతి ఏడాది కామన్వెల్త్ చాంపియన్షిప్లో అతను తన కెరీర్లో తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం రావడం అతని కెరీర్కు కీలక మలుపుగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో శరత్ పోరు రెండు రౌండ్లకే పరిమితమైనా అతని ఆట పదును పెరిగింది. కామన్వెల్త్లో హవా.. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ పోటీల్లో రాణించడం అంత సులువు కాదు. చైనాతో పాటు యూరోపియన్ ఆటగాళ్ల హవా అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడా శరత్ తన ముద్ర చూపించాడు. కెరీర్లో రెండు ప్రొఫెషనల్ టూర్ టైటిల్స్ సాధించిన అతను భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శరత్కు కామన్వెల్త్ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. వరుసగా ఐదు సార్లు 2006, 2010, 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాడు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీమ్ విభాగాలు.. ఇలా అన్నింటిలో అతను చెలరేగిపోయాడు. ఫలితంగా అతను ఖాతాలో ఏకంగా 13 కామన్వెల్త్ క్రీడల పతకాలు ఉన్నాయి. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించిన అతను ఆసియా చాంపియన్షిప్లో మరో 3 పతకాలు సాధించడం విశేషం. మరో వైపు విదేశీ లీగ్లలో కూడా తన సత్తాను చూపించాడు. ప్రపంచ టీటీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బుందేస్లిగా (జర్మనీ)లో కూడా ఆడిన అతను 2010–11 సీజన్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు డచ్, స్వీడన్, స్పానిష్ లీగ్లలో కూడా అతను ఆడాడు. దురదృష్టవశాత్తు శరత్ మెరుపులు ఒలింపిక్స్లో ఫలితాన్ని అందించలేదు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లలో పాల్గొన్నా పతకం అతని దరి చేరలేదు. వరుస గాయాలతో బాధపడుతూ 2012 లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒలింపిక్స్ పతకం లేకపోయినా శరత్ సాధించిన ఘనతలు అతని స్థాయిని చూపించాయి. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతున్న శరత్ కమల్ 2024 పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు. 10 – భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన రికార్డు శరత్ సొంతం. 2019లో తొమ్మిదో టైటిల్ గెలిచి కమలేశ్ మెహతా (8) రెండు దశాబ్దాల రికార్డు బద్దలు కొట్టిన అతను 2022లో పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 30వ స్థానానికి చేరిన శరత్ కమల్.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అర్జున, పద్మశ్రీ, ఖేల్రత్న పురస్కారాలను అందుకున్నాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
Related News by category
-
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్లను కలిగి ఉంది. ఈ షోరూమ్లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
7030 విమానాలు రద్దు.. గవర్నమెంట్ డేటా
దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం.. క్యారియర్లు 2024లో 4,56,919 షెడ్యూల్డ్ డిపార్చర్లను నిర్వహించాలి. 2022లో 6,413 విమానాలు రద్దయ్యాయని, 2023లో ఈ సంఖ్య 7,427కి పెరిగిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తెలిపారు.డిజి యాత్ర (Digi Yatra) గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, దశలవారీగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా విమాన ప్రయాణికులు డిజి యాత్రను ఉపయోగించారు.డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా రూపొందించారు. విమానాశ్రయాల్లోని వివిధ చెక్పాయింట్ల వద్ద కాంటాక్ట్లెస్ ప్రయాణం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రయాణికుల డేటా అంత ఉంటుంది. అయితే విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి డేటా తొలగిస్తుంది. ఇది ప్రయాణికులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతుంది. -
యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్సైట్లో వీడియోలను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.యూట్యూబ్లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్సైట్తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.Youtube Video Upload But not showing in YouTube application as well as Yt studio please fix this issue as early as possible.... #Youtubedown #Videouploadbutnotshowingproblem @TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024#YouTube Ka Bhi Systumm Hang Ho Gya Aaj 🤦♀️🤦♀️Upload Nahi Ho Rahi Videos#YoutubeDown— Aditi Shharmaa (@AditiSharma780) July 22, 2024 -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్ఫారమ్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది.
Advertisement