'కాంగ్రెస్ మాత్రమే మాటమీదే నిలబడి ఉంది' | only Congress stand clear on Telangana issue, JD seelam | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ మాత్రమే మాటమీదే నిలబడి ఉంది'

Published Fri, Feb 14 2014 11:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'కాంగ్రెస్ మాత్రమే మాటమీదే నిలబడి ఉంది' - Sakshi

ఏలూరు : రాష్ట్ర విభజన విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలు మాట మార్చాయని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్ మాత్రమే మాటమీద నిలబడి ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లుపై ఇంకా సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడలేదని జేడీ శీలం అన్నారు.  కాగా అంతకు ముందు హనమాన్ జంక్షన్ వద్ద జేడీ శీలం కాన్వాయ్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీపుర్లు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement