లారీ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

-

బీబీనగర్‌: హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై గుర్తు తెలియని లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి బీబీనగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రశాంత్‌ తన భార్య రాధికతో కలిసి హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నివాసముంటున్నారు. దంపతులిద్దరూ తమ ద్విచక్ర వాహనంపై భువనగిరి మండల పరిధిలో గల స్వర్ణగిరి క్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి రాత్రి బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా బీబీనగర్‌లోని ఎస్‌బీఐ ఎదురుగా వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీవారిని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న రాధిక(23) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్‌కు తీవ్రగాయాలు కావడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement