![ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/24/19alr202-230014_mr.jpg.webp?itok=Qg0RiQUg)
యాదగిరిగుట్ట : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోరుతూ ఆలేరు నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకు శుక్రవారం యాదాద్రీశుడి వైకుంఠద్వారం వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీ తామహేందర్రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, కౌన్సిలర్ బూడిద సురేందర్, నాయకులు ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, సాయియాదవ్, భాస్కర్గౌడ్, ముక్కెర్ల సతీష్, యాకూబ్, కల్వకొలను సతీష్రాజ్, బండి వాసు, అంకం నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment