అద్దెకు తీసుకున్న కార్లు కుదువబెట్టి పరార్‌ | - | Sakshi
Sakshi News home page

అద్దెకు తీసుకున్న కార్లు కుదువబెట్టి పరార్‌

Published Wed, Apr 17 2024 12:25 AM | Last Updated on Wed, Apr 17 2024 12:25 AM

కాజ్‌వే పై నుంచి స్వర్ణముఖి నదిలో పడ్డ లారీ - Sakshi

తడ: అద్దెకు తీసుకున్న కార్లు ఇతరులకు కుదువబెట్టి వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి పలాయనం చిత్తగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్‌ఐ పీ.నరశింహారావు కథనం.. తడకు చెందిన గుణశేఖర్‌ వద్ద ఉన్న ఓ కారుని శ్రీసిటీ పరిధిలోని ఇరుగళం గ్రామానికి చెందిన బాబు నెలవారి అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తడకే చెందిన మరో వ్యక్తి రాజశేఖర్‌కి చెందిన మరో కారును కూడా అద్దెకు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాబు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. తమ కార్లను కుదువబెట్టి బాబు పారిపోయాడని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు

నాయుడుపేట టౌన్‌: పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది కాజ్‌వేపై వెళుతున్న మీని లారీ మంగళవారం అదుపు తప్పి స్వర్ణముఖి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ వెంకటెశ్వర్లుకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. నాయుడుపేట పట్టణం నుంచి మేనకూరు పరిశ్రమల కేంద్రం వద్దకు లోడింగ్‌ చేసుకునేందుకు మీని లారీ తీసుకుని వెళుతున్నారు. మార్గ మధ్యలో పట్టణ పరిధిలోని స్వర్ణముఖి కాజ్‌వే వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదుపు తప్పి కాజ్‌వే దిమ్మెలను ఢీకొంది. ఆపై నది ఒడ్డున మీనిలారీ పడిపోయింది. లారీ డ్రైవర్‌ వెంకటేశ్వర్లు చేతికి గాయాలయ్యాయి.

పెళ్లకూరులో విషాదం

పెళ్లకూరు: రోడ్డు ప్రమాదంలో పెళ్లకూరుకు చెందిన పులి మస్తాన్‌(38) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు... తొట్టంబేడు మండలం, కనపర్తి గ్రామానికి చెందిన మస్తాన్‌, మానస దంపతులు జీవనోపాధి కోసం పెళ్లకూరులో చిరు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. మస్తాన్‌ పనుల నిమిత్తం మోటారు బైక్‌లో వెంకటగిరికి వెళుతుంగా మార్గ మధ్యంలో పెరిమిడి క్రాస్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మస్తాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
మస్తాన్‌(ఫైల్‌)
1/1

మస్తాన్‌(ఫైల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement