చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని కేఎంఎం కళాశాల వెనుక భాగంలో మహిళ మృతినట్టు గుర్తించి కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రామయ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళగా గుర్తించారు.
హత్య కేసులో జీవిత ఖైదు
చిల్లకూరు: మండలంలోని కడివేడు పంచాయ, గుత్తావారిపాళెం సమీపంలో వాచ్మన్ని హత్య చేసిన ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం గూడూరు ఏడో అదనపు జిల్లా అడిషనల్ జుడీషియల్ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుహాసిని వివరాల మేరకు.. ఓజిలి మండలానికి చెందిన కుడుముల రామసుబ్బయ్య గుత్తావారిపాళెంలోని ఓ ఆగ్రోఫాంలో వాచ్మెన్. ఈ క్రమంలో అక్కడికి పనికి చేరిన గూడూరు రూరల్ మండలం, వేములపాళెంకు చెందిన తుపాను వెంకటేశ్వర్లు 2021 జూలై 7వ తేదీన వాచ్మన్ రామసుబ్బయ్యపై కర్రతో దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు పీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment