సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
Published Fri, Feb 19 2021 2:25 AM | Last Updated on Fri, Feb 19 2021 2:02 PM
Advertisement
Related news by tags
-
టాటా పవర్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో భారీ పెట్టుబడులు వెచ్చించనుంది. కంపెనీ 105వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదారులకు పెట్టుబడి సంబంధిత అంశాలను వెల్లడించారు.వీటి ప్రకారం కంపెనీ ఈ ఏడాది రూ. 20,000 కోట్ల పెట్టుబడి వ్యయాలకు సిద్ధంగా ఉంది. వీటిలో అధిక శాతం పెట్టుబడులను పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోకు కేటాయించనుంది. మిగిలిన నిధులను విద్యుత్ ప్రసారం, పంపిణీ బిజినెస్పై వెచ్చించనుంది. గతేడాది కేటాయించిన రూ. 12,000 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు దాదాపు 67 శాతం అధికంకావడం గమనార్హం!కంపెనీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలోగల అవకాశాలను అన్వేషించనున్నట్లు టాటా సన్స్కు సైతం చైర్మన్గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అవసరమైన అనుమతులను మంజూరు చేసిన అనంతరం ఇందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోను 15 గిగావాట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 9 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.అంతేకాకుండా తమిళనాడులో 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంటును ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈవీ చార్జింగ్ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ 530కుపైగా పట్టణాలలో 5,500 పబ్లిక్, సొంత అవసరాల చార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ బాటలో 86,000కుపైగా హోమ్ చార్జర్లను సైతం నెలకొల్పింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్బ్యాంక్
ఫిన్టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.సాఫ్ట్బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.సాఫ్ట్బ్యాంక్ ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్బ్యాంక్ పేటీఎం షేర్లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది. -
సీబీడీటీ కొత్త చైర్మన్గా రవి అగర్వాల్
ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.గుప్తా 2022 జూన్లో సీబీడీటీ చీఫ్గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు. -
టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఇది. ఇండస్ ఎల్ఎల్ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఎల్ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్ఏఐ అప్లికేషన్లలో ఇండస్ మోడల్ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు, వన్ఏపీఐ సాఫ్ట్వేర్, ఇంటెల్ అడ్వాన్స్డ్ మ్యాట్రిక్స్ ఎక్స్టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది. -
విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్ ఇన్స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్ను బట్టి మాజీ మోడల్గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్గా పరిచయస్థుడే. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది.
Related News by category
-
రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్..
వైఎస్సార్ సీపీ అణచివేతే లక్ష్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కుట్రలకు తెరలేపింది. ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ ఆనవాళ్లు కనిపించకూడదనే ధ్యేయంతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయి. కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్న అరాచకాలను కట్టడి చేయాల్సిన పోలీసులు, ప్రభుత్వ అధికారులను తొలి రోజు నుంచే కీలుబొమ్మలుగా మార్చారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించొద్దు. అది ఏ పార్టీ వారైనా.. వైఎస్సార్ సీపీ శ్రేణులైనా సరే.. ఇదీ 2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టగానే ఐఏఎస్, ఐపీఎస్లకు సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశం. ప్రస్తుత సీఎం చంద్రబాబు నుంచి ఇలాంటి ఆదేశాలను ఆశించడం ప్రజల అమాయకత్వమే అవుతుంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నెల రోజులకే రాష్ట్రాన్ని సౌత్ బీహార్ చేశారనేది నూటికి నూరుశాతం నిజమని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు పేట్రేగిపోయారు. జూన్ 4న ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు విధ్వంసం మొదలైంది. జిల్లాలో ఎక్కడ చూసినా భయాందోళనకర పరిస్థితి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చిత్రాలు కనిపిస్తే చాలు పూనకం వచ్చిన పోతురాజుల్లా ఊగిపోయారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడంతోపాటు పలుచోట్ల నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ విజయోత్సవాల పేరిట దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు రువ్వడంతోపాటు ఇళ్లలోకి దూరి టపాసులు పేల్చి భయబ్రాంతులకు గురిచేశారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే మహిళలు, వృద్ధులని కూడా కర్రలతో చితకబాదారు.అధికారులు గప్చుప్..వైఎస్సార్ సీపీకి ఓటేశారన్న కసితో దళితులు, మైనారీటీలు, ఇతర సామాజికవర్గాలపై దాడులకు పాల్పడుతుండటంతో పచ్చ కండువా భుజాన వేసుకుని ఎవరైనా కనిపిస్తే భయంతో వణికిపోయే దుస్థితి. గతంలో ఎప్పుడూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగిన దాఖలాలు లేవు. ఏకంగా అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులే రౌడీల్లా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చోద్యం చూశారు. కనీసం దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం కూడా అధికారులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.చోద్యం చూసిన పోలీసులుప్రభుత్వ కార్యాలయాలపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం ఉన్నా పోలీసులు అడ్డుకున్న దాఖలాలు లేవు. నిందితులపై సుమోటోగా కేసులు పెట్టాలని పోలీసులు భావించినా టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిడితో వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఎప్పుడైతే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారో ప్రజలు కూడా ఈ దౌర్జన్యాలను, దాడులను అడ్డుకునేందుకు సాహసించలేకపోయారు. ఒకటీ రెండు చోట్ల ఇదేంటని ప్రశ్నించిన వారి మీద కూటమి నాయకులు దాడులకు పాల్పడ్డారు. కర్రలకు మేకులు కొట్టి దారుణంగా చితకబాదారు.ఫిర్యాదులు లేవటప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఫిర్యాదులు లేవని అధికారులు చెప్పారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు సమాచారం లేదని డీఎస్పీ కిశోర్బాబు తెలిపారు. ఒంగోలు నగరంలోనూ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు చెప్పారు. మార్కాపురం, కనిగిరి, దర్శి సబ్ డివిజన్ల పరిధిలో ఎక్కడా విధ్వంసకారులపై, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. -
సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి
ఆగిరిపల్లి: ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన తాను తినటానికి తిండి లేక నరకయాతన అనుభవిస్తున్నానని, కాపాడాలంటూ ఆగిరిపల్లికి చెందిన షేక్ జుబేర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆగిరిపల్లికి చెందిన సలీమునిస్సా కుమారుడు జుబేర్ మూడు నెలల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలోని రియాదు నగరంలో ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నానని మూడు నెలల నుంచి యజమాని జీతం ఇవ్వడం లేదని, జీతం అడిగితే దౌర్జన్యంగా పాస్పోర్ట్ లాక్కుని గదిలో బంధించి రక్తం వచ్చేలా కొట్టాడని, యజమానికి తెలియకుండా పారిపోయి తప్పించుకున్నానని, తిండి, నీరు లేక అల్లాడిపోతున్నానని చాలా భయంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తనను స్వదేశానికి తీసుకురావాలని వీడియోలో కోరాడు. -
ప్రజాగళం వినపడుతోందా?
చంద్రబాబు ప్రజాగళం పేరుతో అలవికాని హామీలు ఇచ్చాడు. ప్రజలు నమ్మారు. అధికారం ఇచ్చారు.ప్రస్తుతం హామీల ఊసే ఎత్తడం లేదు.బాబుతో పాటు కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి రాయచోటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ సంక్షేమం వైపు అడుగులు పడటం లేదు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లతో సరిపెడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామిల అమలు వైపు అడుగులు వేగంగా పడటం లేదు. ప్రధానంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులతోపాటు నిరుద్యోగులు, విద్యార్థుల తల్లులకు ప్రత్యేక పథకాల ద్వారా అందిస్తామని చెప్పిన హామిలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తల్లికి వందనం అంటూ జీఓ విడుదల చేసినా మార్గదర్శకాల పేరుతో కాలయాపన సాగుతోంది. ఇదేకాకుండా ఇంకా కూటమి సర్కార్ చెప్పిన సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆర్థిక సమస్యలంటూ వైఎస్సార్ సీపీపై నిందారోపణలు చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో అడుగులు ముందుకు పడడం లేదు. అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిర్ణయాల విషయంలో వెనుకంజ కనిపిస్తోంది. మరోవైపు అన్నదాతలు మొదలుకొని పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులు, నిరుద్యోగులు సైతం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదీ కదలిక సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున హామీలు ఇచ్చినా వెంటనే అమలుకు చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందోనన్న ఆలోచన ప్రజల్లో మెదలుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే సూపర్ సిక్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించారు. కానీ ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంత సమయం తీసుకుంటారో తెలియడం లేదు.అన్నదాతకు ఏదీ భరోసా అన్నదాతకు ప్రతి ఏడాది కష్టకాలం వెంటాడుతోంది. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలో ఉన్నన్నాళ్లు రైతు భరోసా పేరుతో ఠంఛనుగా నిధులు మంజూరు చేస్తుండడంతో అన్నదాతకు అన్ని విధాలా ఉపయోగపడేది. అయితే కూటమి సర్కార్ అ«ధికారంలో వచ్చాక ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా ప్రకటించిన మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మొత్తాన్ని అందజేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు పంటల సాగుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు లేక కరువు పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా.. జిల్లాలో పాఠశాలలు జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు కూడా వెళుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద రూ. 15 వేలు ఇస్తామన్నా ఇప్పటికీ అతీగతీ లేదు. ప్రతి ఏడాది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి క్రమం తప్పకుండా నిరీ్ణత సమయానికే తల్లుల ఖాతాకు నిధులు జమ చేయడంతోపాటు విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజే విద్యా సామగ్రితోకూడిన కిట్లను అందజేసేవారు. అయితే ప్రస్తుతం తల్లికి వందనం నిధుల కోసం ఇంకా ఎన్నిరోజులు ఎదురు చూడాల్సి వస్తుందోనని విద్యార్థుల తల్లులు పేర్కొంటున్నారు. భృతి కోసం నిరీక్షణ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు నెలన్నర రోజులవుతున్నా నిరుద్యోగ భృతిపై కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎన్నాళ్లకిస్తారో...ఎలాంటి నిబంధనలు పెడతారోనన్న ఆందోళన నిరుద్యోగుల్లో ఉంది. ఉపాధి లేని నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున ఇస్తామని ప్రకటించినా నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని భృతి కోసం ఎదురు చూస్తున్నారు.కుప్పలు తెప్పలుగా హామీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో కుప్పలు తెప్పలుగా హామీలు కురిపించింది. సూపర్ సిక్స్ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా 20వేల ఆర్థికసాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1500, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు రూ.3వేల నిరుగ్యోగభృతి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యారి్థకి ఏడాదికి రూ.15వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా రైతుకూలీలకు కార్పొరేషన్లు, 90శాత సబ్సిడీతో బిందుసేద్యం, ట్రాన్స్ఫార్మర్ ధర తగ్గింపు ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి మేనిఫెస్టో 66 హామీలు గుప్పించింది. నా పేరు షేక్ మస్తాన్. మాది సంబేపల్లె మండలం దేవపట్ల గ్రామం. నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఎక్కడా ఉపాధి అవకాశం దొరకలేదు. కూటమి సర్కార్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా నిరుద్యోగ భృతి కింద రూ. 3 వేలు అందిస్తే ఎంతోకొంత ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ ఆ దిశగా స్పందించాలి. మా పిల్లలందరికీ తల్లికి వందనం ఇవ్వాలి నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప షన మూడో తరగతి, రెండో పాప రజియా రెండో తరగతి చదువుతున్నారు. మాది సామాన్య కుటుంబం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం ద్వారా ఇస్తామన్నారు. హామీ నిలబెట్టుకుని చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అందించాలి. –సహారాభాను, అప్పారావుతోట, మదనపల్లె.హామీలు అమలు చేయాలి ఎన్నికల సందర్భంగా కూటమి నేలతు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేయాలి. అధికారాన్ని చేపట్టి 50 రోజులు గడుస్తున్నా కమిటీలు, సమీక్షల పేర్లతో కాలయాపన చేయడం పద్దతి కాదు. చదువులే ఆస్తిగా భావించిన పేద పిల్లలకు తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెనను వెంటనే అందివ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు సాగుసాయం వంటి వాటిని ఇంతవరకు అమలు చేయలేకపోవడం అన్యాయం. –ఎంరామాంజులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలయాపన చేయడం తగదు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని మరో మారు రుజువు అవుతోంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచి నెలరోజులు గడుస్తున్నా విద్యార్థుల చదువులకు కావాలసిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలు నమ్మి మరోమారు ప్రజలు మోసపోయారు. – కొత్తిమీర ప్రసాద్,రాయచోటి -
విషమంగానే ‘నాగరాజు’ పరిస్థితి
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు. పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. … pic.twitter.com/cV7yv0iQ2v— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024 -
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఏపీలో, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారుకాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. ఇక, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Advertisement
Comments
Please login to add a commentAdd a comment