తెలంగాణ ఎన్నికలు.. 11 రోజుల్లో ఎంత డబ్బు సీజ్‌ చేశారంటే? | Telangana Police Rs 286 Crore Gold And Cash Seized Till Now | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు.. 11 రోజుల్లో ఎంత డబ్బు సీజ్‌ చేశారంటే?

Published Fri, Oct 20 2023 9:35 PM | Last Updated on Fri, Oct 20 2023 9:37 PM

Telangana Police Rs 286 Crore Gold And Cash Seized Till Now - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి (అక్టోబర్‌ 9) నుంచి ఈ రోజు వరకు (శుక్రవారం) వరకు 11 రోజుల్లో తనిఖీల్లో మొత్తం రూ.286 కోట్ల 74 లక్షల 1,370 విలువ గల సొత్తు సీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే తనిఖీల్లో రూ. 42 కోట్ల 93 లక్షల 5,700 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

గడిచిన 24 గంటల్లో రూ. 28 కోట్ల 73 లక్షల 55, 200 విలువ గల బంగారం, వెండి వజ్రాలను సీజ్ చేశారు. రూ. 8 కోట్ల 8 లక్షల 2,070 నగదును నిన్న ఒక్కరోజే సీజ్ చేయగా, కోటి 68 లక్షల 45,982 విలువ గల మద్యం సీజ్ చేశారు.
చదవండి: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement