మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత | Rs 5 Crores Worth Of Gold Seized in Miryalaguda On Election Code | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన 13 కిలోల బంగారం పట్టివేత

Published Mon, Mar 18 2024 8:42 PM | Last Updated on Mon, Mar 18 2024 9:05 PM

Rs 5 Crores Worth Of Gold Seized in Miryalaguda On Election Code - Sakshi

సాక్షి, నల్గొండ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.

ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల్లో హైదరాబాద్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువైన 13 కిలోల బంగారం పట్టుకున్నారు పోలీసులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 
చదవండి: ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్‌ విడుదల

-

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement