పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత Maoists Call For Bandh In Five States On April 15 | Sakshi
Sakshi News home page

పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత

Published Sun, Apr 14 2024 6:27 AM | Last Updated on Sun, Apr 14 2024 6:27 AM

Maoists Call For Bandh In Five States On April 15 - Sakshi

కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యాకాండను ప్రజలు ఖండించాలి

ఈ నెల 15న బంద్‌కు పిలుపు

లేఖ విడుదల చేసిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ 

సాక్షి, హైదరాబాద్‌/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్‌ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్‌ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ శనివారం ఓ లేఖను విడుదల చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్‌ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్‌ బలగాలు ఏప్రిల్‌ 6న మధ్య రీజనల్‌ కంపెనీ–2కి చెందిన కమాండర్‌ అన్నె సంతోష్‌ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్‌ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్‌ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement