గౌరవెల్లిని ఆపేయండి | Godavari Board mandate to Telangana | Sakshi
Sakshi News home page

గౌరవెల్లిని ఆపేయండి

Published Sat, Jul 22 2023 2:14 AM | Last Updated on Sat, Jul 22 2023 2:14 AM

Godavari Board mandate to Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఆదే­శిం­చింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌.అఝగేషన్‌ శుక్రవారం రాష్ట్ర నీటిపారు­దల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద­ర్శి రజత్‌­కుమార్‌కు లేఖ రాశారు.

పర్యావరణ అను­మ­తి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వా­య­ర్‌ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీ­య హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివా­దిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయ­ర్‌ పనులపై యథాస్థితిని కొనసా­గించా­లని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదా­వరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’
గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్‌), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజె­క్టులకు గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్, టెక్ని­కల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభు­త్వా­నిదేనని స్పష్టం చేసింది.

ప్రాజెక్టుల సా­మ­ర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేట­ర్లు, అప్రోచ్‌ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్‌) ప్రకారం అనుమతి లేని ప్రాజె­క్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్‌ విడుద­లైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకో­వా­ల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను విని­యో­గించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది.

రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు.

రిజర్వాయర్‌ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్‌ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా  ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమ­తులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement