ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసులకు చుక్కెదురు! | Court Twist In Telangana Phone Tapping Case, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీసులకు చుక్కెదురు!

Published Tue, Jun 25 2024 1:06 PM | Last Updated on Tue, Jun 25 2024 3:20 PM

Court Twist In Telangana Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. 

ఈ సందర్భంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మెటీరియల్‌ ఎవిడెన్స్ సబ్మిట్‌ చేయకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగ రావ్‌, తిరుపతన్నలు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్‌షీట్‌ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్‌ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement