Parag Agrawal: ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు క్రికెట్ అంటే పిచ్చి
Published
Tue, Nov 30 2021 2:04 PM
| Last Updated on Tue, Nov 30 2021 6:02 PM
Twitter CEO Parag Agrawal Huge Cricket Fan.. ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి.
నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్కు క్రికెట్ అంటే ప్రాణం. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పరాగ్ అగర్వాల్ టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్ను ఎంకరేజ్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా గెలిచిన తర్వాత పరాగ్ భారత్ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగిన ఫోటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment