రన్నరప్‌ ఆదర్శ్‌ | Telangana boy Uppala Adarsh Sriram was the runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ ఆదర్శ్‌

Published Mon, Dec 11 2023 4:25 AM | Last Updated on Mon, Dec 11 2023 4:25 AM

Telangana boy Uppala Adarsh Sriram was the runner up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–13 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ఆదర్శ్‌ శ్రీరామ్‌ రన్నరప్‌గా నిలిచాడు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత వీరేశ్‌ శరణార్థి (మహారాష్ట్ర), ఆదర్శ్‌ శ్రీరామ్‌ 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. వీరేశ్‌ విజేతగా అవతరించాడు. ఆదర్శ్‌ శ్రీరామ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

తమిళనాడుకు చెందిన రాఘవ్‌ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన శ్రేయ విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రేయ 9.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైనా గొర్లి ఏడో స్థానాన్ని పొందింది. తెలంగాణకు చెందిన కీర్తిక ఎనిమిదో స్థానంలో, దీక్షిత పదో స్థానంలో, శివాంశిక 12వ స్థానంలో నిలిచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement