రజతం నెగ్గిన రాధిక  Radhika won silver | Sakshi
Sakshi News home page

రజతం నెగ్గిన రాధిక 

Published Sun, Apr 14 2024 4:19 AM | Last Updated on Sun, Apr 14 2024 4:19 AM

Radhika won silver - Sakshi

శివాని, ప్రియాలకు కాంస్య పతకాలు  

బిషె్కక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్‌ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.

68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్‌లలో శివాని 9–7తో ఒట్గాన్‌జర్గాల్‌ డొల్గొర్‌జవ్‌ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్‌)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో భారత రెజ్లర్‌ పుష్పా యాదవ్‌ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement