ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు మధురవాడ కుర్రాడు | Bhanu Swaroop From Vizag Selected For Andhra Cricket Under-14 Team | Sakshi
Sakshi News home page

Andhra Cricket Association: ఆంధ్ర క్రికెట్‌ అండర్‌-14 జట్టుకు మధురవాడ కుర్రాడు

Published Mon, Jan 23 2023 10:16 AM | Last Updated on Mon, Jan 23 2023 10:21 AM

Bhanu Swaroop From Vizag Selected For Andhra Cricket Under-14 Team - Sakshi

మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్‌ ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్‌ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు.

అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్‌ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్‌ టోర్నమెంట్‌లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్‌ పాల్గొంటున్నాడు.

భానుస్వరూప్‌ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement