తెలంగాణభవన్‌: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ కీలక భేటీ.. | BRS Working President KT Rama Rao Conducted The First Meeting With BRS MLAs At Telangana Bhavan - Sakshi
Sakshi News home page

తెలంగాణభవన్‌: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ కీలక భేటీ..

Published Mon, Dec 4 2023 1:44 PM | Last Updated on Mon, Dec 4 2023 3:41 PM

KTR Meeting With BRS Mlas At Telangana Bhavan - Sakshi

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్‌.. గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. 

వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి, తదితర కీలక అంశాలపై కేటీఆర్‌ చర్చించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement