జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌ | JD(U) Announces Full List Of Party Candidtes For Constituencies In Loksabha Elections - Sakshi
Sakshi News home page

ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్‌ చేసిన జేడీయూ

Published Sun, Mar 24 2024 1:35 PM | Last Updated on Sun, Mar 24 2024 4:17 PM

Jdu Announces Party Candidtes For Loksabha Elections - Sakshi

పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్‌లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్‌ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్‌ రాజీవ్‌ రంజన్‌(లలన్‌) సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.

ఈయన ముంగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్‌​ కేటాయించారు.

ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్‌ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్‌ కుమార్తె 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement