స్టేషన్‌ ఘనపూర్‌ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన‌ అభ్య‌ర్థులు వీరే... | Candidates Who Won In The Station Ghanpur (SC) Constituency | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ ఘనపూర్‌ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన‌ అభ్య‌ర్థులు వీరే...

Published Thu, Aug 10 2023 12:52 PM | Last Updated on Thu, Aug 17 2023 1:20 PM

Candidates Who Won In The Station Ghanpur (SC) Constituency - Sakshi

స్టేషన్‌ ఘనపూర్‌ (ఎస్సి) నియోజకవర్గం

స్టేషన్‌ ఘనపూర్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్‌ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్‌ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది సింగాపూర్‌ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్‌కు 22700 పైగా ఓట్లు వచ్చాయి.

తెలంగాణ తొలి క్యాబినెట్‌లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే  ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న  మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా  క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు.

రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్‌ ఐలో గెలుపొంది టిఆర్‌ఎస్‌లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్‌ఎస్‌లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్‌ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ ఐ కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు.

కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్‌ఎస్‌లో చేరి వరంగల్‌ నుంచి లోక్‌ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్‌ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో గెలిచారు.

ఒకసారి సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్‌ఎస్‌ వ్యూహంలో  భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్‌ నియోజకవర్గం జనరల్‌గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్‌లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్‌ తూటాలకు బలైపోవడం ఓ విషాదం.

హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్‌లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్‌లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్‌.టి.ఆర్‌. క్యాబినెట్‌లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్‌ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

డాక్టర్‌. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో పనిచేశారు. డాక్టర్‌ రాజయ్య కూడా కెసిఆర్‌ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు  సిపిఐ ఒకసారి, టిఆర్‌ఎస్‌ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్‌ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు.

స్టేషన్‌ ఘనపూర్‌ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement