● ఇది టీచర్స్కాలనీలోని పార్క్. ఇందిరమ్మకాలనీ, టీచర్స్కాలనీ, గంగానగర్, విఠల్నగర్లో రూ.1.50కోట్లు వెచ్చించి ఉద్యాన వనాలు నిర్మించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో టీచర్స్కాలనీ పార్క్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల విషసర్వం సంచరించడంతో సందర్శకులు, కాలనీవాసులు భయంతో వణికిపోయారు. గంగానగర్ పార్క్ పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. నీళ్లు అందక పచ్చని మొక్కలు, పచ్చని గడ్డి ఎండిపోతున్నాయి.
● వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకునేందుకు పార్క్ల్లో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు, క్రీడాపరికరాలు తుప్పుపట్టి, విరిగిపోయాయి. ఎంతోఆశతో ఉద్యానవనాలకు వస్తున్న చిన్నారులు.. వీటిని చూసి ఎలా ఆడుకునేదని నిశ పడుతున్నారు. ఒక్కపార్క్లోని ఆటవస్తువులు కూడా సరిగాలేవు. పరికరాలను అమర్చినన అధికారులు.. ఏనాడూ వాటి నిర్వహణ, మరమ్మతు గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment