No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

-

విజయనగరం ఫోర్ట్‌:

హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేతనదారులకు కోట్లాది పనిదినాలు కల్పించింది. ఫలితంగా జిల్లాలో వలసలు గణనీయంగా తగ్గాయి. ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలోను పెద్ద ఎత్తున పనులు కల్పించారు. గతంలో ఉపాధి లేక గ్రామాల్లో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సొంతూళ్లలో పని కల్పించింది. దీంతో అధిక సంఖ్యలో వేతనదారులు పనులకు వెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాల చెల్లింపు కూడా సత్వరమే చెల్లిస్తున్నారు. దేశంలోనే విజయనగరం జిల్లా పని కల్పనలో ప్రథమంగా నిలిచింది. ప్రతి కుటుంబానికి 100 రోజులు పాటు ఈ పథకం ద్వారా పని కల్పిస్తారు. ఉన్న ఊళ్లలోనే పని దొరుకుతుంది. సాఫీగా జీవనం సాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement