పిచ్చి కుక్క స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క స్వైర విహారం

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

-

● తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి తొమ్మిది మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలోని యాత వీధిలో ఆరు బయట ఉన్న వారిపై కుక్క విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వెంటబెట్టగా అక్కడ నుంచి జాతీయ రహదారికి ఆనుకోని ఉన్న టీ పాయింట్‌కు సమీపంలో మరి కొంత మందిపై దాడి చేసింది. అక్కడ నుంచి జాతీయ రహదారి పక్కన తాటి ముంజెలు విక్ర యిస్తున్న వారితో పాటు, రోడ్డు పక్కన లారీని ఆపి ఉంచిన డ్రైవర్‌పై కూడా దాడి చేసింది. ఈ ఘటనల్లో గ్రామానికి చెందిన పి.అచ్చియ్యమ్మ, బి,కృష్ణమ్మ, బి.సంతోష్‌ , కె.సురేష్‌, పి.రామలక్ష్మి, వై.సన్యాసిలకు తీవ్ర గాయాలు కాగా, బొండపల్లిలోని పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బొండపల్లి పీహెచ్‌సీలో నీలాతి రాము, పురం రామలక్ష్మి, ఎర్ర సన్యాసిలు చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement