ఆటో ఢీకొని యువకుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని యువకుడికి గాయాలు

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

-

బొబ్బిలి: మండలంలోని రంగరాయపురానికి చెందిన రాజాన దిలీప్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అదే పనిపై పట్టణంలోని శ్రీకళాభారతి వెనుక గల రాతిపనివారి వీధి వెళ్లి డెలివరీ అనంతరం తిరిగి వస్తుండగా మెయిన్‌రోడ్డు మీదుగా తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన మోది సింహాచలం నడుపుతున్న ఆటో ఢీకొనడంతో దిలీప్‌ గాయపడ్డాడు. వెంటనే దిలీప్‌ను స్థానిక సీహెచ్‌సీకి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు ఏఎస్సీ జి.భాస్కరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement