మునకలవలస సచివాలయంలో ఉద్యోగుల మధ్య వివాదం | - | Sakshi
Sakshi News home page

మునకలవలస సచివాలయంలో ఉద్యోగుల మధ్య వివాదం

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

మునకలవలస సచివాలయంలో ధ్వంసమైన కుర్చీలు  - Sakshi

రేగిడి : మండలంలోని మునకలవలస గ్రామ సచివాలయ ఉద్యోగుల మధ్య శుక్రవారం వివాదం నెలకొంది. సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ కె.సత్యనారాయణ తనకు జీతం బిల్లును పంచాయతీ కార్యదర్శి పి.సుధీర్‌కుమార్‌ పెట్టకపోవడంపై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు గ్రామస్తులు వెల్లడించారు. సచివాలయంలో వీరిద్దరు పరస్పరం వాదోపవాదనలు చేసుకుని, చివరికి సచివాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పంచాయతీ కార్యదర్శితో పాటు డిజిటల్‌ అసిస్టెంట్‌ వద్ద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. గ్రామస్తులతో పాటు మండల పరిషత్‌ అధికారులు వద్ద ఈ వివాదానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement