ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే.. ఆస్తుల విలువ రూ.69 లక్షలే...
Published
Sat, Apr 20 2024 1:25 AM
| Last Updated on Sat, Apr 20 2024 1:25 AM
● పాలకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి నిరాడంబర జీవితం
పాలకొండ రూరల్: పాలకొండ అసెంబ్లీ స్థానానికి మూడో దఫా వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి వ్యక్తిగత ఆస్తుల విలువ కేవలం రూ.69 లక్షలు మాత్రమే. (ఆమె వాడుతున్న రెండు కార్లు, మూడు ఎకరాల పొలం, బ్యాంక్ డిపాజిట్లు, వండవలో తన స్వగృహం విలువ ఇది). ఈ రోజుల్లో అతి సామూన్యుడు కూడా ఆస్తులు కూడబెట్టుకుంటున్న తరుణంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆస్తులు పెంచుకోవడం కంటే ప్రజాసేవే పరమావధిగా సాగారు. తన నామినేషన్ పత్రంలో అధికారులకు నిష్పక్షపాతంగా తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను సమర్పించి, సర్వసాధారణ మధ్యతరగతి గృహిణిగా, అసలు సిసలైన గిరిజన మహిళగా నిరూపించుకున్నారు. మరోవైపు తన భర్త, కుమార్తె పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సైతం తెలియపర్చారు. భర్త మండగి హరిప్రసాద్ పేరిట విశాఖలో ఓ ఫ్లాట్ (రూ.35లక్షలు), 4.74 ఎకరాల పొలం (రూ.60లక్షలు) విలువ గలది ఉన్నాయని, కుమార్తె సాయివైష్ణవి పేరిట రూ.2లక్షల40వేల విలువగల బంగారు ఆభరణాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. వీటితోపాటుగా ఆమె పేరిట రూ.5.91 లక్షలు, భర్త పేరిట రూ.1.30 లక్షలు బ్యాంకు రుణాలు ఉన్నట్టు ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment